కమ్యూనిస్టు పార్టీ సీపీఎంకు కొత్త సారథి వచ్చారు. తమిళనాడులో జరుగుతున్న 24వ అఖిల భారత మహా సభల వేదికగా.. కొత్త నాయకుడిని ఎన్నుకుంటూ కమ్యూనిస్టులు తీర్మానం చేశారు. సుదీర్ఘకాలంగా పార్టీతో అనుబంధంతోపాటు.. పార్టీకి హోల్ టైమర్గా వ్యవహరిస్తున్న ఎంఏ బేబీకి ఈ దఫా సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. ఈ మేరకు ఆయన పేరును సీపీఎం సమన్వయ కర్త, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రకాశ్ కారత్ ప్రతిపాదించారు. దీనిని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో సీపీఎంకు గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ప్రధాన కార్యదర్శి పోస్టు భర్తీ అయింది.
ఎవరీ బేబీ..?
ఎంఏ బేబీ అంటే పురుష నాయకుడు. సహజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బేబీ అంటే.. మహిళ అనే కోణంలోనే వాడినా.. కేరళకు చెందిన బేబీ.. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఈయన కేరళలలో బలమైన నాయకుడు కూడా. గతంలో ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. నిజాయితీతో కూడిన నాయకుడిగా..కుటుంబం యావత్తు పార్టీకే పనిచేస్తున్న నేపథ్యంలో బేబీ పేరును కారత్ ప్రస్తావించారు. అయితే.. దీనికి ముందు సుదీర్ఘ కసరత్తు జరిగింది. ఆయన పేరును సీపీఎం ఏకగ్రీవంగా ఆమోదించిన దరిమిలా.. ఆయనను ప్రకటించారు.
బీవీ రాఘవులు అవుట్!?
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా.. కొన్నాళ్ల కిందటి వరకు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన సీతారాం ఏచూరి ఉన్నారు. అయితే.. హృధయ సంబంధిత సమస్యతో ఆయన ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉంది. అనేక మంది పేర్లు తెరమీదికి వచ్చాయి. ఈ క్రమంలో తెలుగు వాడైన బీవీ రాఘవులుకు కూడా అవకాశం దక్కుతుందని అందరూ అనుకున్నారు. అయితే.. సామాజిక వర్గం ప్రకారం.. ఆయన ఉన్నత తరగతికి చెందిన నాయకుడు కావడం, ఈ దఫా మైనారిటీ వర్గాలకు(వక్ఫ్కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో) ఇవ్వాలని సీపీఎం కేంద్ర కమిటీ నిర్ణయించడంతో బేబీకి అవకాశం చిక్కింది.
కేబినెట్ హోదా!
పార్టీపరంగా చూసుకుంటే.. సీపీఎం ప్రధాన కార్యదర్శికి కేబినెట్ హోదాతో కూడిన ర్యాంకు ఉంటుంది. అది అనధికారికమే అయినా.. పార్టీ ఆమేరకు చెల్లింపులు చేస్తుంది. విమాన చార్జీలు, రవాణా చార్జీలు సహా .. దేశవ్యాప్తంగా కార్యదర్శి తిరిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ చార్జీలను పార్టీనే భరిస్తుంది. అదేవిధంగా ఆయన పార్టీకి చీఫ్గా ఉంటూ.. తీసుకునే నిర్ణయాలకు బలమైన మద్దతు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే.. ఆయనే స్వయంగా హాజరు అయ్యే అవకాశంపొలిట్ బ్యూరో.. ఇలా.. అన్ని విధాలా ప్రధాన కార్యదర్శి పోస్టు అత్యంత కీలకమనే చెప్పాలి.
This post was last modified on April 6, 2025 8:18 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…