రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. ఆ దిశగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అది కూడా కేంద్రంలోని పెద్దలే రాష్ట్రంలో రాజకీయాలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా తమకు అనుకూలంగా ఉన్న జిల్లాలపై బీజేపీ పెద్దలు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. దీనిలో భాగంగా కర్నూలు విషయంలో ఢిల్లీ పెద్దలు చర్చలు జరుగుతున్నారని తెలిసింది. ఇక్కడ ఎదగడం ద్వారా .. సీమలో బీజేపీకి ఉన్న కొద్దొ గొప్పో ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
సీమ విషయానికి వస్తే.. కడపలో కీలక నేతలు బీజేపీకి ఉన్నారు. సీఎం రమేష్, మాజీ మంత్రి ఆదినారాయ ణ రెడ్డి.. వంటివారు బీజేపీకి అందివస్తున్న నాయకులుగా లెక్కలు వేసుకుంటున్నారు. చిత్తూరులో భానుప్రకాశ్రెడ్డి వంటి సీనియర్ నేతలు ఉన్నారు. కర్నూలు విషయానికివస్తే.. ఎంపీ టీజీ వెంకటేష్ వంటి నాయకులు ఉన్నప్పటికీ.. ఆశించిన రీతిలో ఇక్కడ బీజేపీ ఎదగలేక పోతోంది. పైగా ఇక్కడ న్యాయ రాజధాని ఏర్పాటుకు బీజేపీ సిద్ధంగానే ఉంది. రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయానికి ఈ విషయంలో బీజేపీ పెద్దలు సై అన్నారు. ఈ క్రమంలో ఇక్కడ ఎదిగే అవకాశాలను పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారు.
ఈ క్రమంలోనే కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి కుటుంబంతో సహా.. మాజీ ఎంపీ బుట్టారేణుక కుటుంబాలను కూడా బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇరు కుటుంబాలు కూడా రాజకీయంగా ఇప్పుడు అస్తిత్వం కోసం పోరాడుతున్నాయి. కోట్ల ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. రేణుక కుటుంబం వైసీపీలో ఉంది. అయితే, పార్టీల్లో వారికి గతంలో ఉన్న గుర్తింపు లేదు. దీంతో ఇరు కుటుంబాలు గుర్తింపు కోసం తహతహ లాడుతున్నాయి. కానీ, ఇప్పట్లో పదవులు దక్కే సూచనలు కనిపించడం లేదు ఈ గ్యాప్ను బీజేపీ వినియోగించుకుని, వారిని పార్టీలో చేర్చుకునేలా పావులు కదుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 2, 2020 3:35 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…