Political News

బ్రేకింగ్: జ‌మిలి ఎన్నికలు ఎప్పుడంటే…

దేశంలో `వ‌న్ నేష‌న్-వ‌న్ ఎల‌క్ష‌న్` పేరుతో ఒకేసారి అసెంబ్లీ, పార్ల‌మెంటుకు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని.. కేంద్రం త‌ల‌పోస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై అధ్య‌య‌నానికి మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ అధ్య‌క్ష‌త‌న క‌మిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీ త‌న ప‌ని పూర్తి చేసి.. ఆరు మాసాల కింద‌టే కేంద్రానికి నివేదిక‌స‌మ‌ర్పించింది. ఇక, అప్ప‌టి నుంచి కూడా.. జ‌మిలి ఎన్నిక‌ల‌పై పెద్ద ఎత్తున దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నడుస్తోంది. ఎప్పుడైనా ఎన్నిక‌లు రావొచ్చ‌ని.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీలు ప్ర‌క‌టిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ‌ల్లోనూ ప్ర‌తిప‌క్షాలుగా ఉన్న పార్టీలు జ‌మిలి వ‌స్తోంద‌ని హంగామా చేస్తున్నాయి.

ఏపీలో అయితే.. 11 స్థానాల‌కు ప‌రిమిత‌మైన వైసీపీ అదినేత జ‌గ‌న్‌.. త‌న పార్టీ నాయ‌కుల‌తో ఎప్పుడు భేటీ అయినా.. ఇంకే ముంది.. ఎన్నిక‌ల‌కు ఆట్టే స‌మ‌యం లేద‌ని.. మ‌న‌దే గెలుపు ప‌క్కా అని చెబుతున్నారు. దీంతో నాయ‌కులు కొంత ఊర‌ట చెందుతున్నారు. ఇక‌, తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ కూడా.. ఇదే పాట పాడుతున్నారు. ఎన్నిక‌లు వ‌చ్చేస్తున్నాయ‌ని.. ఇటీవ‌ల ఆయ‌న పార్టీనాయ‌కుల‌తోనూ వ్యాఖ్యానించారు. వీరి ఆశ‌ల‌న్నీ.. జ‌మిలిపైనే ఉన్నాయి. అయితే.. కేంద్రం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా క్లారిటీ రాలేదు. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

జ‌మిలి ఎన్నిక‌ల‌పై కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. 2029లో వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాతే.. ఈ ప్ర‌క్రియ ఉంటుంద‌ని తెలిపారు. దీనికి రాష్ట్ర‌ప‌తి ఆమోదం తెల‌పాల్సి ఉంటుంద‌ని.. అప్పుడే దీని కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు. అప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చే వ‌న్నీ ఊహాగానాలేన‌ని ఆమె కొట్టి పారేశారు. శ‌నివారం సాయంత్రం చెన్నైలో జ‌రిగి ఓ కార్య‌క్ర‌మంలో మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె జ‌మిలి ఎన్నిక‌ల‌పై దాదాపు ఒక స్ప‌ష్టత ఇచ్చారు. ఇదేస‌మ‌యంలో జమిలి ఎన్నికలపై వస్తున్న పుకార్లను ఆమె కొట్టి పారేశారు. రాబోయే 2029 ఎన్నికలు సాధార‌ణంగానే జ‌రుగుతాయ‌ని తెలిపారు.

ఇక‌, జ‌మిలి ఎన్నిక‌ల ద్వారా.. దేశ ప్ర‌జ‌లు క‌డుతున్న సొమ్మును ఆదా చేయ‌నున్న‌ట్టు మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వివ‌రించారు. “2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. అలా కాకుండా.. ఏక కాల ఎన్నికల నిర్వ‌హ‌ణ‌ ద్వారా ఇంత భారీ ఖర్చును ఆదా చేయవచ్చు.“ అని ఆమె చెప్పారు. పార్లమెంట్, అసెంబ్లీల‌కు ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే దేశ జీడీపీ దాదాపు 1.5 శాతం వృద్ధి చెందుతుందని వివ‌రించారు. ఇక‌, వ‌న్ నేష‌న్‌-వ‌న్ ఎల‌క్ష‌న్ అనేది మోడీ ప్ర‌వ‌చిత ఫార్ములా అని ప్ర‌చారం చేస్తున్నార‌ని.. కానీ, ఇది చాలా త‌ప్ప‌ని అన్నారు. 1960ల నుంచే జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌తిపాద‌న ఉంద‌న్నారు.

This post was last modified on April 6, 2025 6:57 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

7 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

8 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

8 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

10 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

10 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

12 hours ago