Political News

పిఠాప‌రంలో రాజకీయాల కోసం రాలేదట

జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నాగ‌బాబు రెండో రోజు శ‌నివారం కూడా.. పిఠాపురంలో ప‌ర్య‌టించారు. శుక్ర‌వారం పిఠాపురానికి వెళ్లిన ఆయ‌న‌.. అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి.. ప‌లువురికి భోజ‌నాలు వ‌డ్డించిన విష‌యం తెలిసిందే. తాజాగా రెండో రోజు కూడా.. అక్క‌డే ఉండి.. ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ఈ క్ర‌మంలో గ‌త ఏడాది సెప్టెంబ‌రులో ఒకే రోజు చేప‌ట్టిన ప‌ల్లె పండుగ‌ కార్య‌క్ర‌మం కింద‌ నియోజకవర్గ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన గ్రామీణ రోడ్ల‌ను శ‌నివారం నాగ‌బాబు ప్రారంభించారు.

అదేవిధంగా పిఠాపురం మండలం, కుమారపురం హౌసింగ్ లే అవుట్ –1లో రూ.15.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును కూడా ప్రారంభించారు. అలానే.. విరవ గ్రామం నుంచి గోకివాడ బ్రిడ్జి వరకు యంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి రూ. 75 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన తారు రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. వ‌చ్చే నాలుగేళ్ల‌లో అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్ట‌నున్న‌ట్టు ఈ సంద‌ర్భంగా నాగ‌బాబు తెలిపారు.

ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న కొన్ని ర‌హ‌దారుల ప‌నుల‌ను కూడా నాగ‌బాబు ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భం గా స్థానికుల‌ను ఉద్దేశించి నాగ‌బాబు మాట్లాడుతూ.. పిఠాపురాన్ని వ‌చ్చే నాలుగేళ్ల‌లో ఐకాన్ సిటీగా మా ర్చేందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ కృత నిశ్చ‌యంతో ఉన్నారు. దీనికి అంద‌రూ స‌హ‌క‌రించాలి అని వ్యాఖ్యానిం చారు. తాను రాజ‌కీయాలు చేసేందుకు రాలేద‌ని.. అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టేందుకు మాత్ర‌మే వ‌చ్చాన‌ని నాగ‌బాబు చెప్పారు. రాజ‌కీయాలు చేసేందుకు నాలుగు సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంద‌ని ప‌రోక్షంగా ఆయ‌న కొంద‌రు నాయ‌కుల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

This post was last modified on April 5, 2025 6:58 pm

Share
Show comments
Published by
Satya
Tags: Nagababu

Recent Posts

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

47 minutes ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

2 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

2 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

4 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

4 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

5 hours ago