జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు రెండో రోజు శనివారం కూడా.. పిఠాపురంలో పర్యటించారు. శుక్రవారం పిఠాపురానికి వెళ్లిన ఆయన.. అన్న క్యాంటీన్ను ప్రారంభించి.. పలువురికి భోజనాలు వడ్డించిన విషయం తెలిసిందే. తాజాగా రెండో రోజు కూడా.. అక్కడే ఉండి.. పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబరులో ఒకే రోజు చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం కింద నియోజకవర్గ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన గ్రామీణ రోడ్లను శనివారం నాగబాబు ప్రారంభించారు.
అదేవిధంగా పిఠాపురం మండలం, కుమారపురం హౌసింగ్ లే అవుట్ –1లో రూ.15.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును కూడా ప్రారంభించారు. అలానే.. విరవ గ్రామం నుంచి గోకివాడ బ్రిడ్జి వరకు యంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి రూ. 75 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన తారు రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. వచ్చే నాలుగేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్టు ఈ సందర్భంగా నాగబాబు తెలిపారు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కొన్ని రహదారుల పనులను కూడా నాగబాబు పరిశీలించారు. ఈ సందర్భం గా స్థానికులను ఉద్దేశించి నాగబాబు మాట్లాడుతూ.. పిఠాపురాన్ని వచ్చే నాలుగేళ్లలో ఐకాన్ సిటీగా మా ర్చేందుకు పవన్ కల్యాణ్ కృత నిశ్చయంతో ఉన్నారు. దీనికి అందరూ సహకరించాలి అని వ్యాఖ్యానిం చారు. తాను రాజకీయాలు చేసేందుకు రాలేదని.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు మాత్రమే వచ్చానని నాగబాబు చెప్పారు. రాజకీయాలు చేసేందుకు నాలుగు సంవత్సరాల సమయం ఉందని పరోక్షంగా ఆయన కొందరు నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
This post was last modified on April 5, 2025 6:58 pm
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…