Political News

పిఠాప‌రంలో రాజకీయాల కోసం రాలేదట

జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నాగ‌బాబు రెండో రోజు శ‌నివారం కూడా.. పిఠాపురంలో ప‌ర్య‌టించారు. శుక్ర‌వారం పిఠాపురానికి వెళ్లిన ఆయ‌న‌.. అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి.. ప‌లువురికి భోజ‌నాలు వ‌డ్డించిన విష‌యం తెలిసిందే. తాజాగా రెండో రోజు కూడా.. అక్క‌డే ఉండి.. ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ఈ క్ర‌మంలో గ‌త ఏడాది సెప్టెంబ‌రులో ఒకే రోజు చేప‌ట్టిన ప‌ల్లె పండుగ‌ కార్య‌క్ర‌మం కింద‌ నియోజకవర్గ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన గ్రామీణ రోడ్ల‌ను శ‌నివారం నాగ‌బాబు ప్రారంభించారు.

అదేవిధంగా పిఠాపురం మండలం, కుమారపురం హౌసింగ్ లే అవుట్ –1లో రూ.15.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును కూడా ప్రారంభించారు. అలానే.. విరవ గ్రామం నుంచి గోకివాడ బ్రిడ్జి వరకు యంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి రూ. 75 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన తారు రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. వ‌చ్చే నాలుగేళ్ల‌లో అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్ట‌నున్న‌ట్టు ఈ సంద‌ర్భంగా నాగ‌బాబు తెలిపారు.

ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న కొన్ని ర‌హ‌దారుల ప‌నుల‌ను కూడా నాగ‌బాబు ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భం గా స్థానికుల‌ను ఉద్దేశించి నాగ‌బాబు మాట్లాడుతూ.. పిఠాపురాన్ని వ‌చ్చే నాలుగేళ్ల‌లో ఐకాన్ సిటీగా మా ర్చేందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ కృత నిశ్చ‌యంతో ఉన్నారు. దీనికి అంద‌రూ స‌హ‌క‌రించాలి అని వ్యాఖ్యానిం చారు. తాను రాజ‌కీయాలు చేసేందుకు రాలేద‌ని.. అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టేందుకు మాత్ర‌మే వ‌చ్చాన‌ని నాగ‌బాబు చెప్పారు. రాజ‌కీయాలు చేసేందుకు నాలుగు సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంద‌ని ప‌రోక్షంగా ఆయ‌న కొంద‌రు నాయ‌కుల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

This post was last modified on April 5, 2025 6:58 pm

Share
Show comments
Published by
Satya
Tags: Nagababu

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

37 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago