నిజమే.. లెక్కంటే లెక్కే. ఏదో చేతికి వచ్చినంత ఇచ్చుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట బొక్క బోర్లా పడిపోతాం. అలా అభాసుపాలు కాకుండా ఉండాలంటే… అందుబాటులో ఉన్న లెక్కలను ఆధారం చేసుకుని ముందుకు సాగాల్సిందే. ఈ ఈక్వేషన్ ను టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పక్కాగానే అమలు చేస్తున్నట్లు ఉన్నారు. ఏపీలో అదికారంలో ఉన్న కూటమిలో టీడీపీతో పాటుగా జనసేన, బీజేపీలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడు పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను ఆధారం చేసుకునే చంద్రబాబు…అందుబాటులోకి వస్తున్న పదవులను పంపిణీ చేస్తున్నారు.
ఏపీలో వ్యవసాయ సహకార మార్కెట్ కమిటీలన్నీ దాదాపుగా ఖాళీగానే ఉన్నాయి. ఇటీవలే కొన్నింటికి పాలక వర్గాలను ప్రకటించిన చంద్రబాబు… తాజాగా శుక్రవారం 38 మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను ప్రకటించారు. వీటిని కూటమి పార్టీలకు… వాటి బలాబబాలను బేరీజు వేసుకుని మరీ ఆయా దామాషా పద్ధతిననే భర్తీ చేశారు. ఇందులో అత్యధిక ఎమ్మెల్యేలను కలిగిన టీడీపీకి 31 స్థానాలను కేటాయించిన చంద్రబాబు.. డబుల్ డిజిట్ ఎమ్మెల్యేలను కలిగిన జనసేనకు 6 స్థానాలు, సింగిల్ డిజిట్ సంఖ్యలో ఎమ్మెల్యేలను కలిగిన బీజేపీకి సింగిల్ స్థానాన్ని కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్ఱభుత్వం ఈ నియామకాలకు సంబందించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 సీట్లుండగా.. వాటిలో వైసీపీ గెలిచిన 11 సీట్లను మినహాయిస్తే… కూటమికున్న సభ్యుల సంఖ్య 164. ఇందులో బీజేపీకి 8 సీట్లుండగా… జనసేనకు 21 సీట్లున్నాయి. ఇక మిగిలిన 135 సీట్లు టీడీపీవే. ఈ కారణంగానే అటు కేబినెట్ లో అయినా… ఇటీవలే భర్తీ అయిన రాజ్యసభ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు అయినా… ఈ దామాషా పద్దతి ప్రకారమే పంచుకుంటూ కూటమి పార్టీలు సాగుతున్నాయి. తాజాగా ఈ పద్దతిని స్థానిక సంస్థలకు కూడా చంద్రబాబు వర్తింపజేస్తూ కూటమి పార్టీల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
This post was last modified on April 4, 2025 7:16 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…