Political News

ప‌ని మొదలు పెట్టిన నాగ‌బాబు..

జ‌న‌సేన నాయ‌కుడు.. ఇటీవ‌ల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎలాంటి పోటీ లేకుండానే విజ‌యం ద‌క్కించుకున్న కొణిద‌ల నాగ‌బాబు.. రంగంలోకి దిగిపోయారు. త‌న సోద‌రుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలో నిర్వ‌హిస్తున్న ప‌లు అధికారికా కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న పాల్గొంటున్నా రు. అయితే .. గ‌తంలోనూ ఆయ‌న ఇక్క‌డ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నా.. అప్ప‌ట్లో ఎలాంటి ప్రొటోకాల్ లేదు. కానీ.. ఇప్పుడు ఎమ్మెల్సీ కావ‌డంతో ఆ ప్రొటోకాల్ ప్ర‌కారం.. నాగ‌బాబు స‌ద‌రు కార్య‌క్ర‌మాల్లో పాల్గొ న‌డం గ‌మ‌నార్హం.

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఇటీవ‌ల కాలంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేపట్టిన విష‌యం తెలిసిం దే. శుక్రవారం ఉదయం నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చిన నాగ‌బాబు.. స్థానిక గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధి లో రూ. 88.98 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ల్యాబ్ ను జ‌న‌సేన పార్టీకే చెందిన కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ప్రారంభించారు.

ఈ సౌక‌ర్యాల‌తో పిఠాపురం ప్ర‌జ‌ల‌కు అధునాతన వైద్యం అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఈ సంద‌ర్భంగా నాగబాబు వ్యాఖ్యానించారు. త‌మ‌కు రాజ‌కీయాలు ముఖ్యం కాద‌ని.. ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు వ‌చ్చామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. పిఠాపురం త‌మ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కంచుకోట‌గా మారింద‌న్నారు. త‌మ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు శ్ర‌మిస్తున్నార‌ని తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌లే కాదు.. ఎప్పుడు ఎలాంటి ఎన్నిక‌లు వ‌చ్చినా.. ఇక్క‌డ గెలుపు జ‌న‌సేన‌దేన‌ని నాగ‌బాబు చెప్పుకొచ్చారు.

కాగా.. ఇది అధికారిక కార్య‌క్ర‌మం కావ‌డంతో టీడీపీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేల‌ను కూడా ఆహ్వానించా రు. ఇక‌, టీడీపీ మ‌రో నేత‌, ప‌వ‌న్ కోసం సీటును త్యాగం చేసిన వ‌ర్మ‌కు మా్త్రం ఎలాంటి పిలుపు అంద‌లేద నిఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. దీనిపై వారు ఆగ్ర‌హంతో ఉండ‌డం గ‌మ‌నార్హం. పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మం కాద‌ని.. ప్ర‌భుత్వం త‌ర‌ఫునే నిర్వ‌హించార‌ని.. అలాంట‌ప్పుడు క‌నీసం.. మాజీ ఎమ్మెల్యే హోదాలో అయినా.. వ‌ర్మ‌కు ఆహ్వానం ఉండి ఉండాల్సింద‌ని అంటున్నారు.

This post was last modified on April 4, 2025 3:15 pm

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

2 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

2 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

2 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

3 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

3 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

5 hours ago