కన్నతల్లిని మోసం చేసిన రాజకీయ నాయకుడిగా జగన్ కొత్త చరిత్ర సృష్టించారని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్, జగన్ సోదరి వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఇలాంటి కొడుకును కన్నందుకు.. ఆతల్లి రోజూ కుమిలి పోతోందని వ్యాఖ్యానించారు. సరస్వతి భూములు, షేర్లకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందంపై జగనే స్వయంగా సంతకం చేశారని.. కానీ.. ఇప్పుడు తాను ఇంకా సంతకం చేయలేదని.. ప్రాసెస్ నిలిపివేశామని చెప్పి.. మోసానికి దిగారని ఆమె ఆరోపించారు.
తాజాగా ఈ విషయంపై స్పందించిన షర్మిల.. జగన్ను తీవ్రంగా విమర్శించారు. గురువారం.. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో జగన్ అఫిడవిట్ వేసిన విషయం తెలిసిందే. తన తల్లి, చెల్లి.. తనను మోసం చేశారని.. ప్రత్యర్థులతో చేతులు కలిపారని.. ఈ నేపథ్యంలో ఇవ్వాలని అనుకున్న షేర్లను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. దీనిపై ఇంకా ప్రొసీజర్ కూడా పూర్తికాకుండానే సొంతం చేసుకునేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
ఈ వ్యవహారంపైనే షర్మిల స్పందిస్తూ.. విజయమ్మకు సరస్వతి షేర్లను జగన్ గిఫ్ట్గా ఇచ్చారని.. ఇది ముమ్మాటికీ వాస్తవమని పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు అబద్ధాలు ఆడుతూ.. కన్నతల్లినే మోసం చేస్తున్నారని చెప్పారు. ఒకసారి అమ్మకు రాసిచ్చిన షేర్లను వెనక్కి తీసుకుంటానని చెప్పడం జగన్కే చెల్లిందని ఆమె దుయ్యబట్టారు. తల్లిపై కేసు వేసి.. ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న కొడుకుగా.. జగన్ చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు.
ఇక, తన వ్యవహారంపై స్పందించిన షర్మిల.. తన తండ్రి మరణం తర్వాత.. తనకు చిల్లిగవ్వకూడా.. ఆస్తుల్లో భాగం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. తాను అడుగుతానని భయంతోనే పార్టీ నుంచి బయటకు పంపేశారని సంచలన ఆరోపణలు చేశారు. తానేమీ జగన్ సంపాయించుకున్న దానిలో వాటా అడగడం లేదని.. ఉమ్మడిగా ఉన్న వ్యాపారాల్లోనే భాగం కోరుతున్నానని.. తాను వెనక్కి తగ్గేదేలేదని చెప్పుకొచ్చారు.
This post was last modified on April 4, 2025 2:33 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…