సమాజంలోని ఏ కుటుంబమైనా.. తమకు ఓ గూడు కావాలని తపిస్తుంది. అయితే.. అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. పేదలు,.. అత్యంత నిరుపేదలకు ఇది సాకారం కావాలంటే.. వారి జీవితకాలం సరిపోతుంది. అందుకే.. పేదలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలే ఇళ్లునిర్మిస్తున్నాయి. కానీ, మంగళగిరి నియోజకవర్గం లో తాజాగా మంత్రి నారా లోకేష్.. ‘మీ ఇల్లు-మీ లోకేష్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది సక్సెస్ అయితే.. తమకు తిరుగులేని ఎన్నికల రాజకీయం అవుతుందన్న లెక్కలు వేసుకున్నారు.
ఏంటీ పథకం..
మీ ఇల్లు-మీ లోకేష్ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదు. ప్రభుత్వానికి రూపాయి ఖర్చు కూడా కాదు. కానీ, ఇదేసమయంలో మంత్రి నారా లోకేష్కు భారీ ఎత్తున ఓట్లను తీసుకురానుంది. అసలు ఈ కార్యక్రమంలో ఏం చేస్తారంటే.. పేదలు చాలా మంది ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని.. లేదా.. ప్రభుత్వ భూముల్లో చిన్నపాటి గుడిసెలు వేసుకుని దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. అయితే.. సర్కార్లు తలుచుకుంటే.. వీరిని అక్కడ నుంచి తరిమేయొచ్చు.
వైసీపీ హయాంలో ఇదే జరిగింది. మీకు వేరే చోట ఇళ్లు ఇస్తున్నామని చెబుతూ.. అప్పటికే నివాసం ఏర్పా టు చేసుకున్న పేదలను ఆయా భూముల నుంచి ఖాళీ చేయించింది. చెప్పిన ప్రకారం.. వారికి వేరే చోట భూములు ఇచ్చింది. కానీ, ఇళ్ల ను మాత్రం నిర్మించలేదు. అయితే.. ఇవి నగరాలు, పట్టణాలకు సుదూరం గా ఉండడం.. ఇళ్లు నిర్మించుకునేందుకు లక్షల రూపాయలు కావాల్సి ఉండడంతో ఇది విఫలమైంది. అందుకే.. జగన్.. తను ఇచ్చిన ఇళ్లు తనకు ఓట్లేస్తాయని ఆశించినా.. ఫలితం దక్కలేదు.
ఈ క్రమంలోనే ప్రజల నాడిని పసిగట్టిన నారా లోకేష్.. వారు ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకు న్న భూములను వారిపేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించి.. ఇస్తామని ఎన్నికలకు ముందు నిర్వహించిన యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇప్పుడు.. అదే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టి.. మీ ఇల్లు- మీ లోకేష్ పేరుతో అమలు చేస్తున్నారు. తాజాగా ఓ కుటుంబానికి ఆయన మంగళగిరిలో పట్టా కూడా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఏమీ చేయదు. వారి ఇల్లు వారే ఇప్పటికి నిర్మించుకున్న నేపథ్యంలో కేవలం ఎలాంటి ఖర్చులేకుండా.. పట్టా ఇస్తుంది. ఇది సక్సెస్ అయితే.. నారా లోకేష్కు తిరుగులేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 12 నుంచిఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో అమలు కానుంది.
This post was last modified on April 4, 2025 12:20 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…