Political News

మీ ఇల్లు – మీ లోకేష్‌: చేతికి మ‌ట్టంట‌ని పాలిటిక్స్ ..!

స‌మాజంలోని ఏ కుటుంబ‌మైనా.. త‌మ‌కు ఓ గూడు కావాల‌ని త‌పిస్తుంది. అయితే.. అంద‌రికీ ఇది సాధ్యం కాక‌పోవ‌చ్చు. పేద‌లు,.. అత్యంత నిరుపేద‌ల‌కు ఇది సాకారం కావాలంటే.. వారి జీవిత‌కాలం స‌రిపోతుంది. అందుకే.. పేద‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌భుత్వాలే ఇళ్లునిర్మిస్తున్నాయి. కానీ, మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం లో తాజాగా మంత్రి నారా లోకేష్‌.. ‘మీ ఇల్లు-మీ లోకేష్‌’ పేరుతో వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఇది స‌క్సెస్ అయితే.. త‌మ‌కు తిరుగులేని ఎన్నిక‌ల రాజ‌కీయం అవుతుంద‌న్న లెక్క‌లు వేసుకున్నారు.

ఏంటీ ప‌థ‌కం..
మీ ఇల్లు-మీ లోకేష్ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ప్ర‌మేయం ఏమీ ఉండ‌దు. ప్ర‌భుత్వానికి రూపాయి ఖ‌ర్చు కూడా కాదు. కానీ, ఇదేస‌మ‌యంలో మంత్రి నారా లోకేష్‌కు భారీ ఎత్తున ఓట్ల‌ను తీసుకురానుంది. అస‌లు ఈ కార్య‌క్ర‌మంలో ఏం చేస్తారంటే.. పేద‌లు చాలా మంది ప్ర‌భుత్వ భూముల‌ను ఆక్ర‌మించుకుని.. లేదా.. ప్ర‌భుత్వ భూముల్లో చిన్న‌పాటి గుడిసెలు వేసుకుని ద‌శాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. అయితే.. స‌ర్కార్లు త‌లుచుకుంటే.. వీరిని అక్క‌డ నుంచి త‌రిమేయొచ్చు.

వైసీపీ హ‌యాంలో ఇదే జ‌రిగింది. మీకు వేరే చోట ఇళ్లు ఇస్తున్నామ‌ని చెబుతూ.. అప్ప‌టికే నివాసం ఏర్పా టు చేసుకున్న పేద‌లను ఆయా భూముల నుంచి ఖాళీ చేయించింది. చెప్పిన ప్ర‌కారం.. వారికి వేరే చోట భూములు ఇచ్చింది. కానీ, ఇళ్ల ను మాత్రం నిర్మించ‌లేదు. అయితే.. ఇవి న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌కు సుదూరం గా ఉండడం.. ఇళ్లు నిర్మించుకునేందుకు ల‌క్ష‌ల రూపాయ‌లు కావాల్సి ఉండ‌డంతో ఇది విఫ‌ల‌మైంది. అందుకే.. జ‌గ‌న్‌.. త‌ను ఇచ్చిన ఇళ్లు త‌న‌కు ఓట్లేస్తాయ‌ని ఆశించినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు.

ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల నాడిని ప‌సిగ‌ట్టిన నారా లోకేష్‌.. వారు ఆక్ర‌మించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకు న్న భూముల‌ను వారిపేరుతోనే రిజిస్ట్రేష‌న్ చేయించి.. ఇస్తామ‌ని ఎన్నిక‌ల‌కు ముందు నిర్వ‌హించిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో హామీ ఇచ్చారు. ఇప్పుడు.. అదే కార్య‌క్ర‌మానికి ఆయ‌న శ్రీకారం చుట్టి.. మీ ఇల్లు- మీ లోకేష్ పేరుతో అమ‌లు చేస్తున్నారు. తాజాగా ఓ కుటుంబానికి ఆయ‌న మంగ‌ళగిరిలో ప‌ట్టా కూడా ఇచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వం ఏమీ చేయ‌దు. వారి ఇల్లు వారే ఇప్ప‌టికి నిర్మించుకున్న నేప‌థ్యంలో కేవలం ఎలాంటి ఖ‌ర్చులేకుండా.. ప‌ట్టా ఇస్తుంది. ఇది స‌క్సెస్ అయితే.. నారా లోకేష్‌కు తిరుగులేద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 12 నుంచిఈ కార్య‌క్ర‌మం పూర్తిస్థాయిలో అమ‌లు కానుంది.

This post was last modified on April 4, 2025 12:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

24 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

31 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago