సమాజంలోని ఏ కుటుంబమైనా.. తమకు ఓ గూడు కావాలని తపిస్తుంది. అయితే.. అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. పేదలు,.. అత్యంత నిరుపేదలకు ఇది సాకారం కావాలంటే.. వారి జీవితకాలం సరిపోతుంది. అందుకే.. పేదలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలే ఇళ్లునిర్మిస్తున్నాయి. కానీ, మంగళగిరి నియోజకవర్గం లో తాజాగా మంత్రి నారా లోకేష్.. ‘మీ ఇల్లు-మీ లోకేష్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది సక్సెస్ అయితే.. తమకు తిరుగులేని ఎన్నికల రాజకీయం అవుతుందన్న లెక్కలు వేసుకున్నారు.
ఏంటీ పథకం..
మీ ఇల్లు-మీ లోకేష్ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదు. ప్రభుత్వానికి రూపాయి ఖర్చు కూడా కాదు. కానీ, ఇదేసమయంలో మంత్రి నారా లోకేష్కు భారీ ఎత్తున ఓట్లను తీసుకురానుంది. అసలు ఈ కార్యక్రమంలో ఏం చేస్తారంటే.. పేదలు చాలా మంది ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని.. లేదా.. ప్రభుత్వ భూముల్లో చిన్నపాటి గుడిసెలు వేసుకుని దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. అయితే.. సర్కార్లు తలుచుకుంటే.. వీరిని అక్కడ నుంచి తరిమేయొచ్చు.
వైసీపీ హయాంలో ఇదే జరిగింది. మీకు వేరే చోట ఇళ్లు ఇస్తున్నామని చెబుతూ.. అప్పటికే నివాసం ఏర్పా టు చేసుకున్న పేదలను ఆయా భూముల నుంచి ఖాళీ చేయించింది. చెప్పిన ప్రకారం.. వారికి వేరే చోట భూములు ఇచ్చింది. కానీ, ఇళ్ల ను మాత్రం నిర్మించలేదు. అయితే.. ఇవి నగరాలు, పట్టణాలకు సుదూరం గా ఉండడం.. ఇళ్లు నిర్మించుకునేందుకు లక్షల రూపాయలు కావాల్సి ఉండడంతో ఇది విఫలమైంది. అందుకే.. జగన్.. తను ఇచ్చిన ఇళ్లు తనకు ఓట్లేస్తాయని ఆశించినా.. ఫలితం దక్కలేదు.
ఈ క్రమంలోనే ప్రజల నాడిని పసిగట్టిన నారా లోకేష్.. వారు ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకు న్న భూములను వారిపేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించి.. ఇస్తామని ఎన్నికలకు ముందు నిర్వహించిన యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇప్పుడు.. అదే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టి.. మీ ఇల్లు- మీ లోకేష్ పేరుతో అమలు చేస్తున్నారు. తాజాగా ఓ కుటుంబానికి ఆయన మంగళగిరిలో పట్టా కూడా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఏమీ చేయదు. వారి ఇల్లు వారే ఇప్పటికి నిర్మించుకున్న నేపథ్యంలో కేవలం ఎలాంటి ఖర్చులేకుండా.. పట్టా ఇస్తుంది. ఇది సక్సెస్ అయితే.. నారా లోకేష్కు తిరుగులేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 12 నుంచిఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో అమలు కానుంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…