సమాజంలోని ఏ కుటుంబమైనా.. తమకు ఓ గూడు కావాలని తపిస్తుంది. అయితే.. అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. పేదలు,.. అత్యంత నిరుపేదలకు ఇది సాకారం కావాలంటే.. వారి జీవితకాలం సరిపోతుంది. అందుకే.. పేదలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలే ఇళ్లునిర్మిస్తున్నాయి. కానీ, మంగళగిరి నియోజకవర్గం లో తాజాగా మంత్రి నారా లోకేష్.. ‘మీ ఇల్లు-మీ లోకేష్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది సక్సెస్ అయితే.. తమకు తిరుగులేని ఎన్నికల రాజకీయం అవుతుందన్న లెక్కలు వేసుకున్నారు.
ఏంటీ పథకం..
మీ ఇల్లు-మీ లోకేష్ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదు. ప్రభుత్వానికి రూపాయి ఖర్చు కూడా కాదు. కానీ, ఇదేసమయంలో మంత్రి నారా లోకేష్కు భారీ ఎత్తున ఓట్లను తీసుకురానుంది. అసలు ఈ కార్యక్రమంలో ఏం చేస్తారంటే.. పేదలు చాలా మంది ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని.. లేదా.. ప్రభుత్వ భూముల్లో చిన్నపాటి గుడిసెలు వేసుకుని దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. అయితే.. సర్కార్లు తలుచుకుంటే.. వీరిని అక్కడ నుంచి తరిమేయొచ్చు.
వైసీపీ హయాంలో ఇదే జరిగింది. మీకు వేరే చోట ఇళ్లు ఇస్తున్నామని చెబుతూ.. అప్పటికే నివాసం ఏర్పా టు చేసుకున్న పేదలను ఆయా భూముల నుంచి ఖాళీ చేయించింది. చెప్పిన ప్రకారం.. వారికి వేరే చోట భూములు ఇచ్చింది. కానీ, ఇళ్ల ను మాత్రం నిర్మించలేదు. అయితే.. ఇవి నగరాలు, పట్టణాలకు సుదూరం గా ఉండడం.. ఇళ్లు నిర్మించుకునేందుకు లక్షల రూపాయలు కావాల్సి ఉండడంతో ఇది విఫలమైంది. అందుకే.. జగన్.. తను ఇచ్చిన ఇళ్లు తనకు ఓట్లేస్తాయని ఆశించినా.. ఫలితం దక్కలేదు.
ఈ క్రమంలోనే ప్రజల నాడిని పసిగట్టిన నారా లోకేష్.. వారు ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకు న్న భూములను వారిపేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించి.. ఇస్తామని ఎన్నికలకు ముందు నిర్వహించిన యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇప్పుడు.. అదే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టి.. మీ ఇల్లు- మీ లోకేష్ పేరుతో అమలు చేస్తున్నారు. తాజాగా ఓ కుటుంబానికి ఆయన మంగళగిరిలో పట్టా కూడా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఏమీ చేయదు. వారి ఇల్లు వారే ఇప్పటికి నిర్మించుకున్న నేపథ్యంలో కేవలం ఎలాంటి ఖర్చులేకుండా.. పట్టా ఇస్తుంది. ఇది సక్సెస్ అయితే.. నారా లోకేష్కు తిరుగులేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 12 నుంచిఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో అమలు కానుంది.
This post was last modified on April 4, 2025 12:20 pm
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…