సమాజంలోని ఏ కుటుంబమైనా.. తమకు ఓ గూడు కావాలని తపిస్తుంది. అయితే.. అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. పేదలు,.. అత్యంత నిరుపేదలకు ఇది సాకారం కావాలంటే.. వారి జీవితకాలం సరిపోతుంది. అందుకే.. పేదలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలే ఇళ్లునిర్మిస్తున్నాయి. కానీ, మంగళగిరి నియోజకవర్గం లో తాజాగా మంత్రి నారా లోకేష్.. ‘మీ ఇల్లు-మీ లోకేష్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది సక్సెస్ అయితే.. తమకు తిరుగులేని ఎన్నికల రాజకీయం అవుతుందన్న లెక్కలు వేసుకున్నారు.
ఏంటీ పథకం..
మీ ఇల్లు-మీ లోకేష్ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదు. ప్రభుత్వానికి రూపాయి ఖర్చు కూడా కాదు. కానీ, ఇదేసమయంలో మంత్రి నారా లోకేష్కు భారీ ఎత్తున ఓట్లను తీసుకురానుంది. అసలు ఈ కార్యక్రమంలో ఏం చేస్తారంటే.. పేదలు చాలా మంది ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని.. లేదా.. ప్రభుత్వ భూముల్లో చిన్నపాటి గుడిసెలు వేసుకుని దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. అయితే.. సర్కార్లు తలుచుకుంటే.. వీరిని అక్కడ నుంచి తరిమేయొచ్చు.
వైసీపీ హయాంలో ఇదే జరిగింది. మీకు వేరే చోట ఇళ్లు ఇస్తున్నామని చెబుతూ.. అప్పటికే నివాసం ఏర్పా టు చేసుకున్న పేదలను ఆయా భూముల నుంచి ఖాళీ చేయించింది. చెప్పిన ప్రకారం.. వారికి వేరే చోట భూములు ఇచ్చింది. కానీ, ఇళ్ల ను మాత్రం నిర్మించలేదు. అయితే.. ఇవి నగరాలు, పట్టణాలకు సుదూరం గా ఉండడం.. ఇళ్లు నిర్మించుకునేందుకు లక్షల రూపాయలు కావాల్సి ఉండడంతో ఇది విఫలమైంది. అందుకే.. జగన్.. తను ఇచ్చిన ఇళ్లు తనకు ఓట్లేస్తాయని ఆశించినా.. ఫలితం దక్కలేదు.
ఈ క్రమంలోనే ప్రజల నాడిని పసిగట్టిన నారా లోకేష్.. వారు ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకు న్న భూములను వారిపేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించి.. ఇస్తామని ఎన్నికలకు ముందు నిర్వహించిన యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇప్పుడు.. అదే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టి.. మీ ఇల్లు- మీ లోకేష్ పేరుతో అమలు చేస్తున్నారు. తాజాగా ఓ కుటుంబానికి ఆయన మంగళగిరిలో పట్టా కూడా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఏమీ చేయదు. వారి ఇల్లు వారే ఇప్పటికి నిర్మించుకున్న నేపథ్యంలో కేవలం ఎలాంటి ఖర్చులేకుండా.. పట్టా ఇస్తుంది. ఇది సక్సెస్ అయితే.. నారా లోకేష్కు తిరుగులేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 12 నుంచిఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో అమలు కానుంది.
This post was last modified on April 4, 2025 12:20 pm
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…