Political News

మీ ఇల్లు – మీ లోకేష్‌: చేతికి మ‌ట్టంట‌ని పాలిటిక్స్ ..!

స‌మాజంలోని ఏ కుటుంబ‌మైనా.. త‌మ‌కు ఓ గూడు కావాల‌ని త‌పిస్తుంది. అయితే.. అంద‌రికీ ఇది సాధ్యం కాక‌పోవ‌చ్చు. పేద‌లు,.. అత్యంత నిరుపేద‌ల‌కు ఇది సాకారం కావాలంటే.. వారి జీవిత‌కాలం స‌రిపోతుంది. అందుకే.. పేద‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌భుత్వాలే ఇళ్లునిర్మిస్తున్నాయి. కానీ, మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం లో తాజాగా మంత్రి నారా లోకేష్‌.. ‘మీ ఇల్లు-మీ లోకేష్‌’ పేరుతో వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఇది స‌క్సెస్ అయితే.. త‌మ‌కు తిరుగులేని ఎన్నిక‌ల రాజ‌కీయం అవుతుంద‌న్న లెక్క‌లు వేసుకున్నారు.

ఏంటీ ప‌థ‌కం..
మీ ఇల్లు-మీ లోకేష్ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ప్ర‌మేయం ఏమీ ఉండ‌దు. ప్ర‌భుత్వానికి రూపాయి ఖ‌ర్చు కూడా కాదు. కానీ, ఇదేస‌మ‌యంలో మంత్రి నారా లోకేష్‌కు భారీ ఎత్తున ఓట్ల‌ను తీసుకురానుంది. అస‌లు ఈ కార్య‌క్ర‌మంలో ఏం చేస్తారంటే.. పేద‌లు చాలా మంది ప్ర‌భుత్వ భూముల‌ను ఆక్ర‌మించుకుని.. లేదా.. ప్ర‌భుత్వ భూముల్లో చిన్న‌పాటి గుడిసెలు వేసుకుని ద‌శాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. అయితే.. స‌ర్కార్లు త‌లుచుకుంటే.. వీరిని అక్క‌డ నుంచి త‌రిమేయొచ్చు.

వైసీపీ హ‌యాంలో ఇదే జ‌రిగింది. మీకు వేరే చోట ఇళ్లు ఇస్తున్నామ‌ని చెబుతూ.. అప్ప‌టికే నివాసం ఏర్పా టు చేసుకున్న పేద‌లను ఆయా భూముల నుంచి ఖాళీ చేయించింది. చెప్పిన ప్ర‌కారం.. వారికి వేరే చోట భూములు ఇచ్చింది. కానీ, ఇళ్ల ను మాత్రం నిర్మించ‌లేదు. అయితే.. ఇవి న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌కు సుదూరం గా ఉండడం.. ఇళ్లు నిర్మించుకునేందుకు ల‌క్ష‌ల రూపాయ‌లు కావాల్సి ఉండ‌డంతో ఇది విఫ‌ల‌మైంది. అందుకే.. జ‌గ‌న్‌.. త‌ను ఇచ్చిన ఇళ్లు త‌న‌కు ఓట్లేస్తాయ‌ని ఆశించినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు.

ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల నాడిని ప‌సిగ‌ట్టిన నారా లోకేష్‌.. వారు ఆక్ర‌మించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకు న్న భూముల‌ను వారిపేరుతోనే రిజిస్ట్రేష‌న్ చేయించి.. ఇస్తామ‌ని ఎన్నిక‌ల‌కు ముందు నిర్వ‌హించిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో హామీ ఇచ్చారు. ఇప్పుడు.. అదే కార్య‌క్ర‌మానికి ఆయ‌న శ్రీకారం చుట్టి.. మీ ఇల్లు- మీ లోకేష్ పేరుతో అమ‌లు చేస్తున్నారు. తాజాగా ఓ కుటుంబానికి ఆయ‌న మంగ‌ళగిరిలో ప‌ట్టా కూడా ఇచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వం ఏమీ చేయ‌దు. వారి ఇల్లు వారే ఇప్ప‌టికి నిర్మించుకున్న నేప‌థ్యంలో కేవలం ఎలాంటి ఖ‌ర్చులేకుండా.. ప‌ట్టా ఇస్తుంది. ఇది స‌క్సెస్ అయితే.. నారా లోకేష్‌కు తిరుగులేద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 12 నుంచిఈ కార్య‌క్ర‌మం పూర్తిస్థాయిలో అమ‌లు కానుంది.

This post was last modified on April 4, 2025 12:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ జోగి రమేశ్ వంతు వచ్చేసింది!

వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…

4 hours ago

బావగారు వివాదం….సుడిగాలి సుధీర్ మెడకు

యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…

4 hours ago

ఫోటో : గాయపడ్డ పవన్ కుమారుడు ఇప్పుడిలా ఉన్నాడు!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…

6 hours ago

కాకాణికి షాకిచ్చిన హైకోర్టు.. అరెస్టు తప్పదా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…

6 hours ago

కన్నప్పకు కరెక్ట్ డేట్ దొరికింది

ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…

6 hours ago

తారక్ & రజని రెండుసార్లు తలపడతారా

ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…

6 hours ago