కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఆ పార్టీ సీనియర్ నేత.. ప్రస్తుతం వైసీపీలో ఉన్న సాకే శైలజానాథ్ చేసిన కామెంట్లను ఉటంకించారు. “షర్మిల కనిపించడం లేదు. అందుకే.. తాను పార్టీ నుంచి బయటకు వచ్చా” అని అప్పట్లో సాకే వ్యాఖ్యానించారు. తాజాగా.. షర్మిల దీనికి కౌంటర్ ఇచ్చారు. “నేను కనిపించడం లేదని అంటే.. మెడికల్ లీవు అనుకోవచ్చు కదా!” అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపైనే నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రాజకీయాల్లో మెడికల్ లీవులు ఏంటి అక్కా! అంటూ.. విరుచుకుపడుతున్నారు. మరికొందరు.. మెడికల్ లీవు అంటే.. రోజులా.. నెలలా? సంవత్సరాలా? అని నిలదీశారు. గత ఏడాది ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన షర్మిల.. తర్వాత.. ఇప్పటి వరకు ఎవరి ముఖం చూసిన పాపాన పోలేదు. ఢిల్లీలో జగన్ ధర్నా చేసినప్పుడు.. ఏలూరుకు వచ్చిన షర్మిల.. అప్పట్లో ఎర్రకాలువ పొంగడంతో మునిగిన పొలాలను పరిశీలించారు.
ఉధృతంగా వస్తున్న వరద నీటిలో దిగి రాజకీయాలు చేశారన్న వాదన అప్పట్లో సొంత పార్టీ నాయకుల నుంచే వినిపించింది. ఆ తర్వాత.. సమయం సందర్భం చూసుకుని.. ఒక్కసారి కూడా.. ప్రజల మధ్యకు ఆమెరాలేదు. కనీసం.. ప్రజల కష్టాలు కూడా పట్టించుకోలేదని.. సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డే స్వయంగా ఓ యూట్యూబ్ చానెల్తో వ్యాఖ్యానించారు. ఇప్పుడు.. కూడా అదే తరహాలో సీనియర్లు ఉన్నారు. కొందరు అయితే.. షర్మిల నాయకత్వం తమకు వద్దని లేఖలు కూడా సంధించారు.
అయితే.. వైఎస్ ఇమేజ్ ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం ఆమెను కొనసాగిస్తుండడం గమనార్హం. కానీ.. ఇప్పటి వరకు గత ఎన్నికల సమయం నుంచి జరిగిపోయిన 11 మాసాల్లో ఒక్కసారి కూడా.. ఉత్తరాంధ్రలో కానీ.. సీమలో కానీ.. ఆమె ప్రజలకోసం పర్యటించింది లేదు. మరి ఎవరైనా మెడికల్ లీవు అంటే.. ఓ నెల రోజులు.. రెండు నెలలు.. తీసుకుంటారు. మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు షర్మిల మెడికల్ లీవులోనే ఉంటారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తుండడం గమనార్హం.
This post was last modified on April 4, 2025 10:46 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…