వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య, తదనంతరం జరిగిన, జరుగుతున్న పరిణామాలపై జగన్ తోడబుట్టిన సోదరి, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ పై బయటే ఉంటే… వివేకా కూతురు సునీత ప్రాణాలకు రక్షణ ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. అవినాశ్ బయటే యథేచ్ఛగా తిరుగాడుతుండగా… కేసులో కీలక సాక్షులు, నిందితులు వరుసగా చనిపోతున్నారని ఆమె ఆరోపించారు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సునీత ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
వివేకా హత్య జరిగిన సమయంలో సునీత గానీ, సునీత భర్త గానీ అక్కడ లేరన్న షర్మిల… అక్కడ ఉన్నది ఒక్క అవినాశ్ రెడ్డేనని తెలిపారు. వివేకా హత్యకు గురైతే గుండెపోటుతో చనిపోయారని చెప్పింది కూడా అవినాశేనని కూడా ఆమె ఆరోపించారు. కేసును తారుమారు చేసేందుకు అవినాశ్ ఆది నుంచి యత్నిస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని కూడా ఆమె తెలిపారు. కేసునే తారుమారు చేసేందుకు యత్నించిన అవినాశ్ ఇప్పటికీ బెయిల్ పై యథేచ్ఛగా బయటే తిరుగుతున్నారన్న షర్మిల..ఇప్పటికీ కేసును తారుమారు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటప్పుడు కేసులో వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని ఆమె ప్రశ్నించారు. అవినాశ్ బయట ఉండగా.. కేసులో కీలక సాక్షులు, నిందితులు వరుసగా చనిపోతున్న విషయాన్ని కూడా గమనించాలని ఆమె గుర్తు చేశారు.
కేసు దర్యాప్తు తీరు చూస్తుంటే.. సునీత ప్రాణాలకు రక్షణ లేదని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. సునీతకు ఏమైనా అయితే ఆమెకున్న ఇద్దరు పిల్లల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న సీబీఐ అధికారి రాంసింగ్ నే తన ఇంటికి పిలిపించుకుని మరీ అవినాశ్ ఆయనను బెదిరించారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా సునీతనే తన తండ్రిని చంపేసినట్లుగా కేసును మార్చేసి.. దానిపై విచారణాధికారి రాంసింగ్ చేత సంతకం చేయించారని కూడా షర్మిల సంచలన ఆరోపణ చేశారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న అవినాశ్ బయటే ఉంటే… సునీత ప్రాణాలకు ముప్పు ఉందని భావించక తప్పడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వెరసి ఈ కేసులో ప్రధాన నిందితుగా ఉన్న అవినాశ్ రెడ్డి బెయిల్ ను కేంద్రంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేసిన షర్మిల వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి.
This post was last modified on April 4, 2025 9:07 am
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…