Political News

కందుల దుర్గేశ్ రూటే సెపరేటు!

జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా పర్యాటక రంగంలో కూడా పెట్టుబడులు సాధించవచ్చన్న విషయాన్ని వెలుగులోకి తీసుకురావడంతో పాటుగా ఏపీ పర్యాటక శాఖకు పెట్టుబడులు రాబడుతూ తనదైన ప్రత్యేక శైలిని ఆయన చాటుతున్నారు. ప్రభుత్వ పాలనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా దుర్గేశ్ ది విభిన్న శైలే. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ తంతును చూస్తేనే ఈ విషయం ఇట్టే అర్థం అయిపోతుంది. ఈ విభిన్న చతురతతోనే దుర్గేశ్ నిడదవోలు పురపాలక సంఘంపై జనసేన జెండా ఎగురవేసేందుకు రంగం సిద్ధం చేశారు.

అన్ని పురపాలికల మాదిరే వైసీపీ అధికారంలో ఉండగా… 2021లోనే నిడదవోలు మునిసిపాలిటీకి ఎన్నికలు జరగగా… అన్ని ప్రాంతాల మాదిరే నిడదవోలు కూడా వైసీపీ ఖాతాలోనే పడిపోయింది. నాడు వైసీపీ నేత శ్రీనివాస నాయుడు ఎమ్మెల్యేగా ఉండగా.. వైసీపీకి చెందిన భూపతి ఆదినారాయణ, కామిశెట్టి సత్యనారాయణ మునిసిపల్ చైర్ పర్సన్ పదవి కోసం పోటీ పడ్డారు. ఎమ్మెల్యే ఎంట్రీ ఇచ్చి చెరి రెండున్నరేళ్ల పాటు అంటూ నాయుడు మధ్యే మార్గంగా తీర్పు చెబితే… అందుకు సమ్మతించిన భూపతి తొలుత తానేనని చైర్మన్ పీఠం ఎక్కారు. అయితే రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత పదవి నుంచి దిగేందుకు భూపతి ససేమిరా అన్నారు. ఈ క్రమంలో కామిశెట్టి, భూపతిల మధ్య వివాదం నెలకొన గా..అది తీరకుండానే 2024 ఎన్నికలు వచ్చేశాయి. వైసీపీ అధికారం కోల్పోయింది. నాయుడు కూడా ఓడిపోయారు.

నాయుడును ఓడించిన దుర్గేశ్ కొత్త ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏకంగా మంత్రి కూడా అయ్యారు. అప్పుడే ఆయన నిడదవోలుపై పట్టు సాధించే దిశగా అడుగులు వేశారు. అందులో భాగంగా భూపతిని జనసేన వైపు లాగేశారు. దుర్గేశ్ కదిపిన పావులతో భూపతి వైసీపీకి చెందిన మరో 10 మంది కౌన్సిలర్లతో రాజీనామా చేయించి మరీ వారితో కలిసి జనసేనలో చేరిపోయారు. అంటే… ఫలితంగా 27 మంది కౌన్సిలర్లు ఉన్న వైసీపీ బలం 16కు పడిపోయింది. టీడీపీకి ఉన్న ఓ కౌన్సిలర్ ను కలుపుకుంటే… జనసేన బలం 12కు చేరింది. ఇంకో ముగ్గురు కౌన్సిలర్లు వైసీపీని వీడి జనసేనలో చేరితే.. నిడదవోలు పురపాలికపై జనసేన జెండా ఎగిరినట్టే. ఈ తంతుకూ దుర్గేశ్ తెలివిగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. పాలక వర్గం మార్పు తన ప్రమేయం లేకుండా జరుగుతున్నట్లుగా దుర్గేశ్ పక్కా పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.

మునిసిపల్ చైర్మన్ గా కొనసాగుతున్న భూపతి ఆదినారాయణ పార్టీ ఫిరాయించారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వైసీపీ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఇప్పటిదాకా కలెక్టర్ అయితే చర్యలు తీసుకోలేదు గానీ… చర్యలు తీసుకుంటే… వైసీపీ శిబిరంలోని మరో ముగ్గురు కౌన్సిలర్లను లాగేసుకుని నిడదవోలు మునిసిపాలిటీపై జనసేన జెండాను ఎగురవేయాలని దుర్గేశ్ కాసుకుని కూర్చున్నారట. ఆయా పాలక వర్గాలను చేజిక్కించుకునేందుకు అందరూ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను లాగేస్తుంటే…వారందరినీ భిన్నంగా సాగుతున్న దుర్గేశ్ ఏకంగా చైర్మన్ నే లాగేసి…వైరి వర్గంతోనే అదికారులకు ఫిర్యాదు చేయించి..పాలకవర్గాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారంటే… దుర్గేశ్ రూటు సెపరేటు అని చెప్పక తప్పదు కదా.

This post was last modified on April 3, 2025 10:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

20 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

50 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago