మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు.. తన యాక్టివిటీని తగ్గించారు. ఆయన పార్టీలో ఒకప్పుడు యాక్టివ్ గా ఉండేవారు. అయితే.. గత ఏడాది ఎన్నికల సమయంలో ఆయన తన కుమారుడికి ఎంపీ టికెట్ ఇప్పించుకుని గెలిపించుకునే ప్రయత్నం చేశారు. అయితే.. చివరి నిముషంలో చంద్రబాబు జోక్యం కారణంగా టికెట్ కోల్పోయారు. జనసేన పార్టీకి మచిలీపట్నం పార్లమెం టు టికెట్ను కేటాయించారు. దీంతో చంద్రబాబు.. ఆయనకు నామినేటెడ్ పదవిని ఇస్తామని హామీ ఇచ్చారు.
చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం.. కొనకళ్లకు ఏపీఎస్ ఆర్టీసీ బోర్డు చైర్మన్ పదవిని ఆఫర్ చేశారు. ఇది జరిగి కూడా ఆరు మాసాలు అయిపోయింది. ప్రస్తుతం ఆర్టీసీ కార్పొరేషన్ బోర్డు చైర్మన్గా కొనకళ్ల వ్యవహ రిస్తున్నారు. అయితే.. ఆయన మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి.. తన ఛాంబర్కు వచ్చారు. నియామకం జరిగి.. బోర్డు సభ్యులు కూడా ఉండి ఆరు మాసాలు దాటిపోయినా.. ఆయన పెద్దగా అటు వైపు చూడడం లేదు.
అంతేకాదు.. ఆర్టీసీ సమస్యలు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో అటు డ్రైవర్లు, సిబ్బంది, ఇటు.. బోర్డు సభ్యులు కూడా.. కింకర్తవ్యం అంటూ. దిక్కులు చూస్తున్నారు. మరి ఇలా ఎందుకు జరుగుతోంది? అనేది ప్రశ్న. దీనికి ప్రధాన కారణం.. కొనకళ్లకు ఇస్తామన్న మరో హోదా ఇవ్వకపోవడమేనని పార్టీ వర్గాలు సహా.. బోర్డు సభ్యులు సైతం చెబుతున్నారు. ఆర్టీసీ చైర్మన్ పదవితో పాటు.. ఈ పదవికి కేబినెట్ హోదా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు.. చెక్ పవర్ కూడా.. ఇవ్వాలి.
ఈ విషయాలను పదవిని ఇస్తున్నప్పుడే.. ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. ఇప్పటి వరకు.. ఆ దిశగా అడుగులు మాత్రం వేయలేదు. అంటే.. కొనకళ్లకు చైర్మన్ పదవి ఇచ్చినా.. ఆ పదవికి తగిన విధంగా దక్కే హోదాలు మాత్రం ఆయన దరి చేరలేదు. దీనిపై ఇప్పటికే ఒకటికి రెండు సార్లు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల దృష్టికి తీసుకువెళ్లారు. కానీ, ప్రయోజనం లేకుండా పోవడంతో ప్రస్తుతం కొనకళ్ల ఇంటికే పరిమితమయ్యారు. ఇది ఆర్టీసీ వర్గాల్లోనూ.. ఇటు.. పార్టీలోనూ చర్చనీయాంశం అయింది. దీనిపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాన్న వాదనా వినిపిస్తోంది.
This post was last modified on April 3, 2025 6:50 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…