వైసీపీ ప్రభుత్వం పర్యాటక, యువజన శాఖల విషయంలో అప్పటి మంత్రులు తీసుకున్న నిర్ణయాలు.. ఇచ్చిన జీవోలపై పునః సమీక్షకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. వీటిని పునః పరిశీలించి నిర్ణయం తీసుకునేలా తాజాగా జరిగిన మంత్రి వర్గంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. దేశంలో డ్రోన్ వ్యవస్థకు జవసత్వాలు ఇవ్వాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వ బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. వచ్చే రెండేళ్లలో డ్రోన్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేసింది.
ఈక్రమంలో తాజాగా గురువారం నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేక ‘ఏపీ డ్రోన్ కార్పొరేషన్’ ఏర్పాటుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి స్వయం ప్రతిపత్తికల్పించారు. తద్వారా.. మహిళలు, నిరుద్యోగులకు డ్రోన్ ల ద్వారా ఉపాధి కల్పించే అవకాశం మెరుగు పడనుంది.
ఇక, ఇప్పటి వరకు ఏపీ డ్రోన్ వ్యవస్థ.. స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్)లో భాగంగా ఉండేది. అయితే.. ఈ రెండు వ్యవహారాలు భిన్నమైన అంశాలు కావడంతో సర్కారు.. ఈ రెండింటిని విడదీసింది. మరోవైపు.. వైసీపీ హయాంలో యువజన, పర్యాటక శాఖలు జారీ చేసిన జీవోలను పునః పరిశీలించేందు కు(ర్యాటిఫికేషన్)కు కూడా మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే.. అనకాపల్లి జిల్లాలో పెట్టుబడులకు అనుమతులు తెలిపింది. దీంతో డీఎల్పురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటు కానుంది.
కీలకమైన మరో నిర్ణయానికి వస్తే.. కొన్నాళ్లుగా డిమాండ్గా ఉన్న బార్ల లైసెన్సు ఫీజులను ప్రభుత్వం కుదించింది. ప్రస్తుతం 50 నుంచి 75 లక్షల వరకు ఉన్న(ప్రాంతాన్ని బట్టి) త్రీ స్టార్ హోటళ్లు, 5 నక్షత్రాల హోటళ్లలోని బార్లకు ఫీజులను రూ.25 లక్షలకు తగ్గిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేదల ఇంటి నిర్మాణానికి కూడా సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. పేదల ఇళ్లు నిర్మించే హడ్కో కు 710 కోట్లను ప్రభుత్వ గ్యారెంటీతో రుణం అందించేందుకు కేబినెట్ నిర్ణయించింది.
This post was last modified on April 3, 2025 3:28 pm
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…