Political News

జగన్ టూర్ రాప్తాడులో అగ్గిని రాజేసింది!

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. గతంలో ఫ్యాక్షన్ కక్షలతో నిత్యం దాడులు, హత్యలతో ఆ నియోజకవర్గ పరిధిల రక్తమోడింది. అయితే గత కొంతకాలంగా అక్కడ అసలు ఫ్యాక్షన్ అనే పదమే వినిపించడం లేదు. నాడు టీడీపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం జరిగితే.. ఇప్పుడు టీడీపీ, వైసీపీల మధ్య రాజకీయం నడుస్తోంది. నాడు టీడీపీని కాంగ్రెస్ పార్టీ ఓడించిందే లేదు. అయితే ఇప్పుడు అక్కడ వైసీపీ కూడా విజయం సాధించింది. 2019 నుంచి 2024 వరకు రాప్తాడుకు వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లోనూ రాప్తాడులో పెద్దగా గొడవలు జరిగిన దాఖలానే లేదని చెప్పాలి. ప్రశాంతంగా జరిగిన ఆ ఎన్నికల్లో తిరిగి టీడీపీ విజయ కేతనం ఎగురవేసింది. ఇదంతా గతం అయితే… ఇప్పుడు రాప్తాడు పర్యటనకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వస్తున్నారన్న విషయం ఖరారు అయిన మరుక్షణమే రాప్తాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇటీవల జరిగిన రామగిరి మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా వైసీపీ, టీడీపీల మధ్య గొడవలు జరిగాయి. ఈ గొడవల్లో మండలంలోని పాపిరెడ్డిపల్లికి చెందిన లింగమయ్య అనే వైసీపీ కార్యకర్త మరణించారు. లింగమయ్య మృతి కుటుంబ తగాదాల వల్ల జరిగిందని టీడీపీ చెబుతుంటే… టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత దగ్గరి బంధువులు జరిపిన దాడిలోనే లింగమయ్య చనిపోయారని వైసీపీ వాదిస్తోంది. ఇదే వాదనతో లింగమయ్య కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా… ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఇలాంటి సమయంలో తాను రాప్తాడు వస్తున్నానని, మరణించిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తానని జగన్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. జగన్ నుంచి ప్రకటన వచ్చినంతనే రాప్తాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులకు వైసీపీకి చెందిన తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి నాందీ పలికారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

జగన్ పర్యటన గురించి ప్రకటించేందుకు బుధవారం మీడియా ముందుకు వచ్చిన చంద్రశేఖరరెడ్డి… జగన్ టూర్ వరకే పరిమితమై ఉంటే సరిపోయేదేమో. అయితే టీడీపీ శ్రేణులను, ప్రత్యేకించి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి పరిటాల సునీతను టార్గెట్ చేస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఎప్పుడో మరణించి సునీత భర్త పరిటాల రవీంద్ర పేరును తీసుకువచ్చిన ఆయన… తాను దుర్మార్గుడిని అయితే మరి నీ భర్త ఎలాంటి వారు అంటూ ఆయన ప్రశ్నించారు. హత్యా రాజకీయాలను పరిటాల ఫ్యామిలీ ఇంకా వీడలేదంటూ ఆయన ఆరోపించారు.

చంద్రశేఖరరెడ్డి ఆరోపణలతో పరిటాల సునీత అనివార్యంగానే గురువారం మీడియా ముందుకు వచ్చారని చెప్పాలి. పరిటాల రవి హత్య గురించి ఆమె ప్రస్తావించారు. తన భర్త హత్యలో జగన్ కూ పాత్ర ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ నేతల దాడుల్లో మరణించారంటూ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చే జగన్… తోపుదుర్తి ఫ్యామిలీ దాడుల్లో చనిపోయిన టీడీపీ నేతల కుటుంబాలను కూడా పరామర్భించాలని ఆమె డిమాండ్ చేశారు. వెరసి రాప్తాడులో ఇప్పుడు జగన్ పర్యటన అగ్గిని రాజేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on April 3, 2025 2:17 pm

Share

Recent Posts

హీరోపై విరుచుకుపడిన అత్తగారు

తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…

48 minutes ago

ఈవెంట్లు ఒకటే కాదు… షూటింగులు కూడా జరగాలి

ఉమ్మడి రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయాక సినిమా పరిశ్రమకు సంబంధించిన చర్చలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల మధ్య ప్రస్తావనకు రావడం…

1 hour ago

వారణాసి నుండి రామాయణం వరకు… జక్కన్న విధ్వంసం!

తాను తీసే సినిమా కథ గురించి ఆరంభ దశలోనే మీడియాతో విశేషాలు పంచుకోవడం దర్శక ధీరుడు రాజమౌళికి అలవాటు. ‘ఆర్ఆర్ఆర్’…

2 hours ago

పవన్ – రాజు గారి గురించి జరగాల్సిన చర్చ వేరు!

ఏపీలో రెండు రోజుల క్రితం ఓ కీలక అదికారిక కార్యక్రమం జరిగింది. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ…

2 hours ago

అలియాస్ రుక్మిణి… నితిన్ దారిలో పడ్డాడు

ఒకప్పుడు యూత్ ఫుల్ హిట్లతో మంచి ఊపు మీద ఉన్న నితిన్ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో వేగంగా చేసిన సినిమాలు…

3 hours ago

ప్యారడైజ్ ప్రీమియర్లకు ఎంత పెంపు ఉంటుంది

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పాటు ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకున్న సినిమాగా…

3 hours ago