వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం ఓ కొత్త అవతారంలో కనిపించారు. ఫక్తు రాజకీయ నేతగా కనిపించిన అంబటి… బుధవారం మాత్రం న్యాయవాదిగా కనిపించారు. ఎంచక్కా న్యాయవాదులు వేసుకునే డ్రెస్ కోడ్ లోకి మారిపోయిన అంబటి.. హైకోర్టులో తాను దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను తానే వాదించుకునేందుకు రంగంలోకి దిగారు. కోర్టు అనుమతితోనే న్యాయవాది రూపంలో వచ్చిన అంబటి…తన పిటిషన్ విచారణ వాయిదా పడటంతో తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్బంగా తాను కోర్టుకు వచ్చిన విషయం, దాని వివరాలు ఇవీ అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
గతేడాది నవంబరులో అంబటిపైనా, ఆయన కుటుంబంపైనా, ఆయన కుమార్తెలపైనా సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అసభ్యకరమైన పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేశారట. దీనిపై గుంటూరు పరిధిలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన అంబటి… గతేడాది నవంబర్ 11న ఐదు ఫిర్యాదులు చేశారట. వీటిలో నాలుగు కేసులు తన కుటుంబంపై అసభ్య పోస్టులకు సంబంధించినవి అయితే… మరొకటి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులకు సంబంధించిన ఫిర్యాదు అట. ఈ ఫిర్యాదులను తీసుకున్న పోలీసులు కేసులు మాత్రం నమోదు చేయలేదట. దీంతో అంబటి అదే నెల 25న గుంటూరు జిల్లా ఎస్పీని కలిసి అవే ఫిర్యాదులను అందజేశారట. అయినా కూడా కేసులు నమోదు కాలేదట.
ఇలాగైతే కాదనుకుని భావించిన అంబటి… తన ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని తెలుపుతూ జనవరిలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారట. దీంతో అంబటి ఇచ్చిన నాలుగు ఫిర్యాదులపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారట. అయితే జగన్, జగన్ ఫ్యామిలీపై అసభ్య పోస్టుల వ్యవహారంలో మాత్రం కేసు నమోదు చేయలేదట. ఇక నమోదు చేసిన కేసుల్లోనూ తాను ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా కొనసాగుతున్న చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరును ప్రస్తావిస్తే… ఆ పేరు లేకుండానే కేసు నమోదు చేశారట. ఇక జగన్, జగన్ ఫ్యామిలీపై మార్ఫింగ్ ఫొటోలతో కూడిన పోస్టులు ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టారట. దీంతో లోకేశ్ పై కేసు నమోదు చేయాలని తాను కోరితే… పోలీసులు ఇప్పటిదాకా స్పందించలేదని అంబటి వాపోయారు.
This post was last modified on April 3, 2025 10:23 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…