వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం ఓ కొత్త అవతారంలో కనిపించారు. ఫక్తు రాజకీయ నేతగా కనిపించిన అంబటి… బుధవారం మాత్రం న్యాయవాదిగా కనిపించారు. ఎంచక్కా న్యాయవాదులు వేసుకునే డ్రెస్ కోడ్ లోకి మారిపోయిన అంబటి.. హైకోర్టులో తాను దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను తానే వాదించుకునేందుకు రంగంలోకి దిగారు. కోర్టు అనుమతితోనే న్యాయవాది రూపంలో వచ్చిన అంబటి…తన పిటిషన్ విచారణ వాయిదా పడటంతో తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్బంగా తాను కోర్టుకు వచ్చిన విషయం, దాని వివరాలు ఇవీ అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
గతేడాది నవంబరులో అంబటిపైనా, ఆయన కుటుంబంపైనా, ఆయన కుమార్తెలపైనా సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అసభ్యకరమైన పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేశారట. దీనిపై గుంటూరు పరిధిలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన అంబటి… గతేడాది నవంబర్ 11న ఐదు ఫిర్యాదులు చేశారట. వీటిలో నాలుగు కేసులు తన కుటుంబంపై అసభ్య పోస్టులకు సంబంధించినవి అయితే… మరొకటి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులకు సంబంధించిన ఫిర్యాదు అట. ఈ ఫిర్యాదులను తీసుకున్న పోలీసులు కేసులు మాత్రం నమోదు చేయలేదట. దీంతో అంబటి అదే నెల 25న గుంటూరు జిల్లా ఎస్పీని కలిసి అవే ఫిర్యాదులను అందజేశారట. అయినా కూడా కేసులు నమోదు కాలేదట.
ఇలాగైతే కాదనుకుని భావించిన అంబటి… తన ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని తెలుపుతూ జనవరిలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారట. దీంతో అంబటి ఇచ్చిన నాలుగు ఫిర్యాదులపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారట. అయితే జగన్, జగన్ ఫ్యామిలీపై అసభ్య పోస్టుల వ్యవహారంలో మాత్రం కేసు నమోదు చేయలేదట. ఇక నమోదు చేసిన కేసుల్లోనూ తాను ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా కొనసాగుతున్న చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరును ప్రస్తావిస్తే… ఆ పేరు లేకుండానే కేసు నమోదు చేశారట. ఇక జగన్, జగన్ ఫ్యామిలీపై మార్ఫింగ్ ఫొటోలతో కూడిన పోస్టులు ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టారట. దీంతో లోకేశ్ పై కేసు నమోదు చేయాలని తాను కోరితే… పోలీసులు ఇప్పటిదాకా స్పందించలేదని అంబటి వాపోయారు.
ఇటీవల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో పెద్ద గొడవ జరిగి అది మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ…
బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…
గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…
భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…
ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ హయాంలో రాష్ట్రం…
త్వరలో ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలోని ఆశావహులకు అందరికీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని జనసేన ముఖ్య…