Political News

తెలంగాణ గ్రూప్-1 పరీక్షల్లో భారీ స్కాం?

తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. పరీక్ష మొదలైన పది నిమిషాలకే పేపర్లు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో రేవంత్ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో భారీ స్కాం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.

గ్రూప్-1 టాపర్లంతా ఒకే గదిలో పరీక్ష రాశారని, డబ్బులకు ర్యాంకులను అమ్ముకున్నారని కొందరు అభ్యర్థులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రెండు హాల్ టికెట్ నంబర్ల తేడాతో 44 మందికి ఒకేరకంగా మార్కులు వచ్చాయని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని, ఆన్సర్ షీట్లను బయటపెట్టాలని సదరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఒక పరీక్షా కేంద్రంలో 563 నుంచి 565 మధ్య హాల్ టికెట్ నెంబర్లు ఉన్నవారికి 348.5 మార్కులు.. 800-803 మధ్య ఉన్నవారికి 351.0 మార్కులు రావడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.

ఇంకో పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్ నెంబర్లు 276-278 ఉన్నవారికి 441.0 మార్కులు.. 240-243 మధ్య హాల్ టికెట్ నంబర్లున్నవారికి 430.0 మార్కులు వచ్చాయని ఆరోపిస్తున్నారు.

This post was last modified on April 2, 2025 7:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

3 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

5 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

10 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

11 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

11 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

11 hours ago