తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. పరీక్ష మొదలైన పది నిమిషాలకే పేపర్లు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో రేవంత్ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో భారీ స్కాం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.
గ్రూప్-1 టాపర్లంతా ఒకే గదిలో పరీక్ష రాశారని, డబ్బులకు ర్యాంకులను అమ్ముకున్నారని కొందరు అభ్యర్థులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రెండు హాల్ టికెట్ నంబర్ల తేడాతో 44 మందికి ఒకేరకంగా మార్కులు వచ్చాయని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని, ఆన్సర్ షీట్లను బయటపెట్టాలని సదరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఒక పరీక్షా కేంద్రంలో 563 నుంచి 565 మధ్య హాల్ టికెట్ నెంబర్లు ఉన్నవారికి 348.5 మార్కులు.. 800-803 మధ్య ఉన్నవారికి 351.0 మార్కులు రావడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.
ఇంకో పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్ నెంబర్లు 276-278 ఉన్నవారికి 441.0 మార్కులు.. 240-243 మధ్య హాల్ టికెట్ నంబర్లున్నవారికి 430.0 మార్కులు వచ్చాయని ఆరోపిస్తున్నారు.
This post was last modified on April 2, 2025 7:37 pm
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…