తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. పరీక్ష మొదలైన పది నిమిషాలకే పేపర్లు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో రేవంత్ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో భారీ స్కాం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.
గ్రూప్-1 టాపర్లంతా ఒకే గదిలో పరీక్ష రాశారని, డబ్బులకు ర్యాంకులను అమ్ముకున్నారని కొందరు అభ్యర్థులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రెండు హాల్ టికెట్ నంబర్ల తేడాతో 44 మందికి ఒకేరకంగా మార్కులు వచ్చాయని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని, ఆన్సర్ షీట్లను బయటపెట్టాలని సదరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఒక పరీక్షా కేంద్రంలో 563 నుంచి 565 మధ్య హాల్ టికెట్ నెంబర్లు ఉన్నవారికి 348.5 మార్కులు.. 800-803 మధ్య ఉన్నవారికి 351.0 మార్కులు రావడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.
ఇంకో పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్ నెంబర్లు 276-278 ఉన్నవారికి 441.0 మార్కులు.. 240-243 మధ్య హాల్ టికెట్ నంబర్లున్నవారికి 430.0 మార్కులు వచ్చాయని ఆరోపిస్తున్నారు.
This post was last modified on April 2, 2025 7:37 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…