తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. పరీక్ష మొదలైన పది నిమిషాలకే పేపర్లు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో రేవంత్ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో భారీ స్కాం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.
గ్రూప్-1 టాపర్లంతా ఒకే గదిలో పరీక్ష రాశారని, డబ్బులకు ర్యాంకులను అమ్ముకున్నారని కొందరు అభ్యర్థులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రెండు హాల్ టికెట్ నంబర్ల తేడాతో 44 మందికి ఒకేరకంగా మార్కులు వచ్చాయని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని, ఆన్సర్ షీట్లను బయటపెట్టాలని సదరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఒక పరీక్షా కేంద్రంలో 563 నుంచి 565 మధ్య హాల్ టికెట్ నెంబర్లు ఉన్నవారికి 348.5 మార్కులు.. 800-803 మధ్య ఉన్నవారికి 351.0 మార్కులు రావడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.
ఇంకో పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్ నెంబర్లు 276-278 ఉన్నవారికి 441.0 మార్కులు.. 240-243 మధ్య హాల్ టికెట్ నంబర్లున్నవారికి 430.0 మార్కులు వచ్చాయని ఆరోపిస్తున్నారు.
This post was last modified on April 2, 2025 7:37 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…