Political News

హెచ్‌సీయూ భూముల గొడవ.. ఉపాసన, రేణు గళం

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తరచుగా పెద్ద పెద్ద వివాదాలే చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాదంతా ఆక్రమణ మీద హైడ్రా ఉక్కుపాదం మోపడంతో రగడ తప్పలేదు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా.. దశాబ్దాల నుంచి జరిగిన తప్పుల మీద దృష్టిసారించకుండా, సమస్యకు మూలమేంటో గుర్తించకుండా ఉన్నపళంగా ఇళ్లు కూల్చేసి అనేక కుటుంబాలను రోడ్డు పాలు చేయడం మీద విమర్శలు వచ్చాయి. వ్యతిరేకత బాగా పెరిగిపోవడంతో ఈ మధ్య హైడ్రా కొంచెం దూకుడు తగ్గించింది.

ఇప్పుడేమో కంచ గచ్చిబౌలిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని రియల్ ఎస్టేట్‌ కార్యకలాపాలకు వాడుకోవాలని రేవంత్ సర్కారు నిర్ణయించడం తీవ్ర దుమారమే రేపుతోంది. పచ్చని చెట్లు, జంతుజాలానికి నెలవుగా ఉన్న ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నారంటూ పర్యావరణ ప్రేమికులు గళం విప్పుతున్నారు. దీనిపై హెచ్‌సీయూ స్టూడెంట్స్ పెద్ద ఎత్తునే నిరసన చేస్తున్నారు. వారికి బీఆర్ఎస్, బీజేపీ మద్దతుగా నిలుస్తున్నాయి.

రోజు రోజుకూ నిరసన గళాలు పెరుగుతుండగా.. సినిమా వాళ్లు కూడా వాళ్లకు తోడవుతున్నారు. ఇప్పటికే ఈ భూముల వివాదంపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించాడు. ఇది మన కర్మ అంటూ గొడవ పెద్దది కాకముందే అతను పెట్టిన సోషల్ మీడియా పోస్టు చర్చనీయాంశం అయింది. ఇప్పుడు మరి కొందరు సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా వాయిస్ వినిపిస్తున్నారు. రామ్ చరణ్ సతీమణి.. ఈ వ్యవహారంపై ఒక పోస్టు పెట్టారు. ఇక్కడున్న జంతువులు, పక్షులను మరోచోటికి తరలిస్తున్నారు. చెట్లను మరో చోట నాటుతున్నారా అని ఆమె ప్రశ్నించారు.

మరోవైపు రేణు తన పోస్టులో కొంచెం గట్టిగానే మాట్లాడారు. తాను రేపో మాపో చనిపోవచ్చని, కానీ భవిష్యత్ తరాల కోసం ఆ భూములను నాశనం చేయొద్దని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చేయడానికి వేరే భూములు చాలా ఉంటాయని ఆమె అన్నారు. ఇంకోవైపు ప్రకాష్ రాజ్ సైతం ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. సమంత, ఈషా రెబ్బా, రష్మి లాంటి వాళ్లు కూడా ఈ భూములను, ఇక్కడున్న జంతువులు, చెట్లను కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు. చూస్తుంటే ఈ భూముల వ్యవహారం రేవంత్ సర్కారుకు చాలా చెడ్డ పేరే తెచ్చేలా ఉంది.

This post was last modified on April 2, 2025 7:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

3 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

6 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

34 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago