Political News

ఏపీపై అమిత్ షా ఫోకస్ పెరిగినట్టే

వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ అదే ఎన్డీఏనే అధికారం కొనసాగిస్తోంది. నాడు కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బీజేపీ అగ్ర నేత అమిత్ షా ఇప్పుడు కూడా అదే పదవిలో ఉన్నారు. నాడు సీఎం హోదాలో వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అమిత్ షా అపాయింట్ మెంట్ అంత ఈజీగా దొరికేది కాదు. ఎప్పుడో ఒకసారి అమిత్ షా కరుణించినా హడావిడిగా చెప్పాలనుకున్న నాలుగు ముక్కలు చెప్పేసి జగన్ బయట పడిపోయేవారు. ఇప్పుడలా కాదు. ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన టీడీపీ యువ ఎంపీలకు అమిత్ షా ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. టీడీపీ ఎంపీలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. వెరసి ఏపీపై అమిత్ షా ఫోకస్ ఓ రేంజిలో పెరిగిపోయిందనే చెప్పాలి.

ఇటీవలే టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు… ఏపీలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణంపై లోక్ సభలో అదిరేటి ప్రసంగం వినిపించినంతనే.. అమిత్ షా స్వయంగా ఆయనను తన కార్యాలయానికి పిలిపించుకుని మరీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం గురించి ఎంపీ లావు చెబుతుంటే… అమిత్ షా అమితాసక్తితో విన్నారు. లావు ఇచ్చిన వివరాలను ఆయన ఒకంత లోతుగానే పరిశీలించారు. వైసీపీ జమానాలో గుట్టుగా ఇన్నేసి అక్రమాలు.. ఇంత పబ్లిగ్గా జరిగాయా? అంటూ అమిత్ షా ఆ తర్వాత ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా లావు అందించిన మద్యం కుంభకోణం వివరాలను అమిత్ షా తన సిబ్బందికి అందజేసి వాటిని భద్రపరచినట్టుగా సమాచారం. సమయం వచ్చినప్పుడు వాటిని బయటకు తీయడంతో పాటుగా వైసీపీతో పాటు జగన్ భరతం పట్టేందుకు షా సదా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక తాజాగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ కుమార్ మంగళవారం అమిత్ షాతో బేటీ అయ్యారు. వాస్తవానికి లావుకు ఒకింత రాజకీయ అనుభవం ఉన్నా… సానాకు మాత్రం అంతగా రాజకీయ అనుభవం లేదనే చెప్పాలి. మొన్నటి దాకా వ్యాపారవేత్తగా సాగిన సానా… తెర వెనుకే ఉండి టీడీపీకి చేదోడువాదోడుగా నిలిచారు. అంతేకాకుండా టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ కు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఇటీవలే వైసీపీ ఎంపీ ల రాజీనామాలతో ఖాళీ అయిన రాజ్యసభ సీట్ల ద్వారా సతీష్ కు అవకాశం దక్కింది. ఈ క్రమంలో సతీశ్ అడిగారో, లేదంటే… అమిత్ షానే పిలిపించారో తెలియదు గానీ… మంగళవారం అమిత్ షా కార్యాలయంలో ఆయనతో పాటు కలిసి కూర్చుని చర్చలు జరుపుతూ సానా కనిపించారు. ఈ భేటీలో పార్లమెంటులో వ్యవహరించాల్సిన పలు అంశాలపై చర్చలు జరిగాయని సానా తెలిపారు గానీ.. అంతకుమించిన అంశాలపైనే చర్చలు జరిగినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.

ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో కొనసాగుతున్నదంటే… ఏపీ ద్వారా కూటమికి అందిన ఎంపీ సీట్లే కారణమని చెప్పక తప్పదు. ఉత్తరాదిన బొటాబొటీ మెజారిటీ వచ్చిన బీజేపీకి దక్షిణాదిన… అది కూడా ఏపీలో నుంచి కూటమి ద్వారా వచ్చిన 21 ఎంపీ సీట్లు అత్యంత కీలకంగా మారాయి. ఇప్పటికిప్పుడు టీడీపీ మద్దతు ఉపసంహరించినా.. ఎన్డీఏ కుప్పకూలిపోవడం ఖాయమేనని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో ఇటు టీడీపీతో పాటు అటు జనసేనకు కూడా ఎన్డీఏ పెద్దల నుంచి ఎనలేని ప్రాధాన్యం లభిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఏపీపై మరింత ఫోకస్ పెంచి…ఏపీపై పూర్తి అవగాహన పెంచుకుంటే… ఎఫ్పటికైనా అవసరపడుతుందన్న భావనలో అమిత్ షా ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే తన వద్దకు వస్తున్న టీడీపీ ఎంపీలను ఆయన బాగా చూసుకుంటూ ఉండటంతో పాటుగా వారితో మనసు విప్పి మాట్లాడుతున్నారని చెప్పాలి.

This post was last modified on April 1, 2025 5:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏడు ఫ్లాపుల తర్వాతైనా హిట్టు వరించేనా

ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…

22 minutes ago

ప్యారడైజ్ పరుగులు పెట్టాల్సిందే

పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…

1 hour ago

రజినీకాంత్ భయపడ్డాడా? జాగ్రత్తపడ్డాడా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…

3 hours ago

వాషింగ్టన్ డీసీని… మనమ్మాయి శాసిస్తుందా?

ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…

3 hours ago

పార్టీ పేరుతో పాటు గుర్తుతోనూ స్ట్రోక్ ఇవ్వనున్న కవిత?

బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయ‌కురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌విత త‌న దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వ‌రలోనే…

4 hours ago

భానుప్రియ మతిస్థిమితం కోల్పోయిందా?

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…

4 hours ago