Political News

ఆ నలుగురి కోసం రంగంలోకి జానా రెడ్డి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఓ కొలిక్కి వచ్చిందని అంతా అనుకుంటున్నారు గానీ… చూస్తుంటే ఇంకా చాలా కసరత్తే జరుగుతున్నట్లుగా ఉంది. అంతేకాకుండా ఇంకా విస్తరణకు సంబంధించిన జాబితా కూడా సిద్ధం కాలేదన్న వాదనలకూ బలం చేకూరుతోంది. ప్రస్తుతానికి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ లో ఇంకో ఆరు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఓ నాలుగు స్థానాల భర్తీకి కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా… ఆ నలుగురూ వీరేనంటూ ఓ జాబితా సర్కులేట్ అవుతోంది. ఇలాంటి సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కనీసం ఒక్కరికైనా అవకాశం కల్పించాలని పార్టీ కురువృద్ధుడు కుందూరు జానారెడ్డి ఇప్పుడు అధిష్ఠానానికి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

హైదరాబాద్ చుట్టూరా విస్తరించి ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో మొన్నటి ఎన్నికల్లో కేవలం నలుగురు కాంగ్రెస్ నేతలే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వారిలో స్పీకర్ గా కొనసాగుతున్న గెడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఒకరు. వికారాబాద్ నుంచి ప్రసాద్ కుమార్ గెలిచారు. ఇక మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో పార్టీ సీనియర్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), మనోహర్ రెడ్డి (తాండూరు), టి.రామ్మోహన్ రెడ్డి (పరిగి) ఉన్నారు. వీరిలో మల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఒకింత గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకుని తీరాల్సిందేనన్న భావనతోనే ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ కేబినెట్ ఇప్పటిదాకా లేనే లేదన్న వాదనను బయటకు తీసుకుని వచ్చారు.

ఈ లెక్కన మల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేస్తే… మనోహర్ రెడ్డి గానీ, రామ్మోహన్ రెడ్డి గానీ మంత్రి పదవి కూడా అడిగే పరిస్థితి లేదనే చెప్పాలి. ఇక గెడ్డం ప్రసాద్ కుమార్ ఆల్రెడీ స్పీకర్ గా ఉన్న నేపథ్యంలో ఆయన అసలు మంత్రి పదవి గురించి అడిగే ప్రసక్తే లేదని చెప్పొచ్చు. వెరసి జానారెడ్డి కూడా మల్ రెడ్డి కోసమే రంగంలోకి దిగినట్లుగా వార్తలు వినిపిస్తగున్నాయి. వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి కాలం నుంచి కూడా మంత్రి పదవి కోసం మల్ రెడ్డి చేయని యత్నమంటూ లేదనే చెప్పాలి. అంతేకాకుండా పార్టీకి నమ్మినబంటుగా సాగుతున్న మల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా పార్టీ శ్రేణులకు మంచి సందేశం పంపినట్లే అవుతుందన్నది నేతల వాదన.

ఇలా అన్నీ ఆలోచించుకున్న తర్వాతే జానా రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి అంటూ రంగంలోకి దిగారు. ఈ దిశగా ఆయన ఈ నలుగురిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేతో పాటుగా ఏఐసీపీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లకు ఏకంగా లేఖలే రాశారు. ఇటీవలే పార్టీలో యాక్టివేట్ అయిన జానా మాటకు పార్టీ విలువైతే ఇస్తుంది గానీ… ఇప్పటి కేబినెట్ విస్తరణలో ఆయన మాటకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో తమ నలుగురిలోఎవరికో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలంటూ ఈ నలుగురు ఉమ్మడిగా పార్టీ అధిష్ఠానానికి లేఖ రాశారట.

This post was last modified on April 1, 2025 3:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

1 hour ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

2 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

2 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

4 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

4 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

6 hours ago