Political News

ఆ నలుగురి కోసం రంగంలోకి జానా రెడ్డి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఓ కొలిక్కి వచ్చిందని అంతా అనుకుంటున్నారు గానీ… చూస్తుంటే ఇంకా చాలా కసరత్తే జరుగుతున్నట్లుగా ఉంది. అంతేకాకుండా ఇంకా విస్తరణకు సంబంధించిన జాబితా కూడా సిద్ధం కాలేదన్న వాదనలకూ బలం చేకూరుతోంది. ప్రస్తుతానికి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ లో ఇంకో ఆరు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఓ నాలుగు స్థానాల భర్తీకి కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా… ఆ నలుగురూ వీరేనంటూ ఓ జాబితా సర్కులేట్ అవుతోంది. ఇలాంటి సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కనీసం ఒక్కరికైనా అవకాశం కల్పించాలని పార్టీ కురువృద్ధుడు కుందూరు జానారెడ్డి ఇప్పుడు అధిష్ఠానానికి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

హైదరాబాద్ చుట్టూరా విస్తరించి ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో మొన్నటి ఎన్నికల్లో కేవలం నలుగురు కాంగ్రెస్ నేతలే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వారిలో స్పీకర్ గా కొనసాగుతున్న గెడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఒకరు. వికారాబాద్ నుంచి ప్రసాద్ కుమార్ గెలిచారు. ఇక మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో పార్టీ సీనియర్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), మనోహర్ రెడ్డి (తాండూరు), టి.రామ్మోహన్ రెడ్డి (పరిగి) ఉన్నారు. వీరిలో మల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఒకింత గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకుని తీరాల్సిందేనన్న భావనతోనే ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ కేబినెట్ ఇప్పటిదాకా లేనే లేదన్న వాదనను బయటకు తీసుకుని వచ్చారు.

ఈ లెక్కన మల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేస్తే… మనోహర్ రెడ్డి గానీ, రామ్మోహన్ రెడ్డి గానీ మంత్రి పదవి కూడా అడిగే పరిస్థితి లేదనే చెప్పాలి. ఇక గెడ్డం ప్రసాద్ కుమార్ ఆల్రెడీ స్పీకర్ గా ఉన్న నేపథ్యంలో ఆయన అసలు మంత్రి పదవి గురించి అడిగే ప్రసక్తే లేదని చెప్పొచ్చు. వెరసి జానారెడ్డి కూడా మల్ రెడ్డి కోసమే రంగంలోకి దిగినట్లుగా వార్తలు వినిపిస్తగున్నాయి. వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి కాలం నుంచి కూడా మంత్రి పదవి కోసం మల్ రెడ్డి చేయని యత్నమంటూ లేదనే చెప్పాలి. అంతేకాకుండా పార్టీకి నమ్మినబంటుగా సాగుతున్న మల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా పార్టీ శ్రేణులకు మంచి సందేశం పంపినట్లే అవుతుందన్నది నేతల వాదన.

ఇలా అన్నీ ఆలోచించుకున్న తర్వాతే జానా రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి అంటూ రంగంలోకి దిగారు. ఈ దిశగా ఆయన ఈ నలుగురిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేతో పాటుగా ఏఐసీపీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లకు ఏకంగా లేఖలే రాశారు. ఇటీవలే పార్టీలో యాక్టివేట్ అయిన జానా మాటకు పార్టీ విలువైతే ఇస్తుంది గానీ… ఇప్పటి కేబినెట్ విస్తరణలో ఆయన మాటకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో తమ నలుగురిలోఎవరికో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలంటూ ఈ నలుగురు ఉమ్మడిగా పార్టీ అధిష్ఠానానికి లేఖ రాశారట.

This post was last modified on April 1, 2025 3:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

5 hours ago

మోనాలిసా పెళ్లి… లవ్ జిహాద్ కాదట

గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన…

7 hours ago

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

9 hours ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

12 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

13 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

14 hours ago