“కొందరు చెబుతారు.. మాట ఇచ్చాను.. అన్నీ చేసేస్తామని.. కానీ, వాళ్లు ఏం చేశారో.. అందరికీ తెలుసు. మడమా.. కాలు అన్నీ తిప్పేశారు. కానీ.. నేను డైలాగులు చెప్పే రకం కాదు.. చేసేది చెబుతాను.. చెప్పింది చేస్తాను. వాళ్ల మాదిరిగా రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి నేను రాలేదు. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ది చేసేందుకు వచ్చాను” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఆయన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై సెటైర్లు సంధించారు.
పీపుల్ ఫస్ట్ నినాదంతో తాము ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. “అభివృద్ది-సంక్షేమం.. రెండూ మాకు ముఖ్యమే. ప్రజలకు సంక్షేమం ఇవ్వడంతోపాటు.. ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్ని స్తున్నారు. కొంతమేరకు సఫలం అయ్యాం. ఇంకా చేయాల్సి ఉంది చాలా ఉంది. అయినా.. ఎక్కడా విశ్రమించడం లేదు. పనిచేస్తేనే ఫలితం వస్తుంది.” అని తేల్చి చెప్పారు. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చినగంజాం మండలంలో ముఖ్యమంత్రి పర్యటించారు.
దివ్యాంగురైనా సుభాషిణికి రూ.15 వేల పింఛనును అందించారు. అనంతరం.. స్థానికంగా గొల్లపాలెంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. వైసీపీ నేతలకు చురకలు అంటించారు. “గత పాలకులు చేసిన ధ్వంసాన్ని సరిదిద్ది.. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పా. ఆ మాట ప్రకారం ముందుకువెళ్తున్నా” అని తెలిపారు. రాష్ట్రంలో కోటిన్నర కుటుంబాలు ఉన్నాయని.. వీరిలో 64 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్టు వివరించారు.
“ఒకప్పుడు నొక్కిన బటన్లన్నీ(అంటే..జగన్ ఇచ్చిన అన్ని పథకాలు కలిపి) నేను ఇచ్చే పింఛన్లతో సమానం. పింఛన్ల రూపంలో నెలకు 2,722 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాం. గతంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు అలా కాకుండా.. మూడు నెలల వరకు ఎప్పుడైనా పింఛను తీసుకునే అవకాశం కల్పించాం. మేం డైలాగులు చెప్పం.. చేసి చూపిస్తాం” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. ఈ క్రమంలోనే పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించామని వ్యాఖ్యానించారు.
This post was last modified on April 1, 2025 3:14 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…