Political News

నేను ‘డైలాగులు’ చెప్పే ర‌కం కాదు: జ‌గ‌న్ పై బాబు సెటైర్లు

“కొంద‌రు చెబుతారు.. మాట ఇచ్చాను.. అన్నీ చేసేస్తామ‌ని.. కానీ, వాళ్లు ఏం చేశారో.. అంద‌రికీ తెలుసు. మ‌డ‌మా.. కాలు అన్నీ తిప్పేశారు. కానీ.. నేను డైలాగులు చెప్పే ర‌కం కాదు.. చేసేది చెబుతాను.. చెప్పింది చేస్తాను. వాళ్ల మాదిరిగా రాష్ట్రాన్ని విధ్వంసం చేయ‌డానికి నేను రాలేదు. ప్ర‌జ‌లు ఇచ్చిన మ్యాండేట్‌తో రాష్ట్రాన్ని స‌మ‌గ్రంగా అభివృద్ది చేసేందుకు వ‌చ్చాను” అని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ప‌రోక్షంగా ఆయ‌న వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై సెటైర్లు సంధించారు.

పీపుల్ ఫ‌స్ట్ నినాదంతో తాము ముందుకు సాగుతున్న‌ట్టు చెప్పారు. “అభివృద్ది-సంక్షేమం.. రెండూ మాకు ముఖ్య‌మే. ప్ర‌జ‌ల‌కు సంక్షేమం ఇవ్వ‌డంతోపాటు.. ధ్వంస‌మైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్ర‌య‌త్ని స్తున్నారు. కొంత‌మేర‌కు స‌ఫ‌లం అయ్యాం. ఇంకా చేయాల్సి ఉంది చాలా ఉంది. అయినా.. ఎక్క‌డా విశ్ర‌మించ‌డం లేదు. ప‌నిచేస్తేనే ఫ‌లితం వ‌స్తుంది.” అని తేల్చి చెప్పారు. తాజాగా ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని చిన‌గంజాం మండ‌లంలో ముఖ్య‌మంత్రి ప‌ర్య‌టించారు.

దివ్యాంగురైనా సుభాషిణికి రూ.15 వేల పింఛ‌నును అందించారు. అనంత‌రం.. స్థానికంగా గొల్ల‌పాలెంలో నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడుతూ.. వైసీపీ నేత‌ల‌కు చుర‌క‌లు అంటించారు. “గ‌త పాల‌కులు చేసిన ధ్వంసాన్ని స‌రిదిద్ది.. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పా. ఆ మాట ప్రకారం ముందుకువెళ్తున్నా” అని తెలిపారు. రాష్ట్రంలో కోటిన్న‌ర కుటుంబాలు ఉన్నాయ‌ని.. వీరిలో 64 ల‌క్ష‌ల మందికి సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను పంపిణీ చేస్తున్న‌ట్టు వివ‌రించారు.

“ఒకప్పుడు నొక్కిన బటన్లన్నీ(అంటే..జ‌గ‌న్ ఇచ్చిన అన్ని ప‌థ‌కాలు క‌లిపి) నేను ఇచ్చే పింఛన్లతో సమానం. పింఛన్ల రూపంలో నెలకు 2,722 కోట్ల రూపాయ‌ల‌ను ఖర్చు చేస్తున్నాం. గతంలో ఒక నెల పింఛన్‌ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు అలా కాకుండా.. మూడు నెల‌ల వ‌ర‌కు ఎప్పుడైనా పింఛ‌ను తీసుకునే అవ‌కాశం క‌ల్పించాం. మేం డైలాగులు చెప్పం.. చేసి చూపిస్తాం” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. ఈ క్ర‌మంలోనే పీ4 కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించామ‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on April 1, 2025 3:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గ‌ద్ద‌ర్ అవార్డుల్లో గందరగోళం.. ఏం జరిగింది?

గ‌త ఏడాది ప్ర‌తిష్ఠాత్మ‌కంగా గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను మొద‌లుపెట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఒకేసారి చాలా ఏళ్ల‌కు క‌లిపి అవార్డులు ప్ర‌క‌టించిన సంగ‌తి…

1 hour ago

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

4 hours ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

8 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

8 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

8 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

9 hours ago