“కొందరు చెబుతారు.. మాట ఇచ్చాను.. అన్నీ చేసేస్తామని.. కానీ, వాళ్లు ఏం చేశారో.. అందరికీ తెలుసు. మడమా.. కాలు అన్నీ తిప్పేశారు. కానీ.. నేను డైలాగులు చెప్పే రకం కాదు.. చేసేది చెబుతాను.. చెప్పింది చేస్తాను. వాళ్ల మాదిరిగా రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి నేను రాలేదు. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ది చేసేందుకు వచ్చాను” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఆయన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై సెటైర్లు సంధించారు.
పీపుల్ ఫస్ట్ నినాదంతో తాము ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. “అభివృద్ది-సంక్షేమం.. రెండూ మాకు ముఖ్యమే. ప్రజలకు సంక్షేమం ఇవ్వడంతోపాటు.. ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్ని స్తున్నారు. కొంతమేరకు సఫలం అయ్యాం. ఇంకా చేయాల్సి ఉంది చాలా ఉంది. అయినా.. ఎక్కడా విశ్రమించడం లేదు. పనిచేస్తేనే ఫలితం వస్తుంది.” అని తేల్చి చెప్పారు. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చినగంజాం మండలంలో ముఖ్యమంత్రి పర్యటించారు.
దివ్యాంగురైనా సుభాషిణికి రూ.15 వేల పింఛనును అందించారు. అనంతరం.. స్థానికంగా గొల్లపాలెంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. వైసీపీ నేతలకు చురకలు అంటించారు. “గత పాలకులు చేసిన ధ్వంసాన్ని సరిదిద్ది.. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పా. ఆ మాట ప్రకారం ముందుకువెళ్తున్నా” అని తెలిపారు. రాష్ట్రంలో కోటిన్నర కుటుంబాలు ఉన్నాయని.. వీరిలో 64 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్టు వివరించారు.
“ఒకప్పుడు నొక్కిన బటన్లన్నీ(అంటే..జగన్ ఇచ్చిన అన్ని పథకాలు కలిపి) నేను ఇచ్చే పింఛన్లతో సమానం. పింఛన్ల రూపంలో నెలకు 2,722 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాం. గతంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు అలా కాకుండా.. మూడు నెలల వరకు ఎప్పుడైనా పింఛను తీసుకునే అవకాశం కల్పించాం. మేం డైలాగులు చెప్పం.. చేసి చూపిస్తాం” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. ఈ క్రమంలోనే పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించామని వ్యాఖ్యానించారు.
This post was last modified on April 1, 2025 3:14 pm
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…