ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేయడం.. పీ-4 విధానం ద్వారా పేదలను ఉన్నత స్థాయికి తీసుకువచ్చే ప్రయత్నం చేయడం వంటివి ప్రముఖులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మహింద్రా కంపెనీ అధిపతి ఆనంద్ మహీంద్ర స్పందించారు. చందబాబు ఆలోచన అద్భుతః అని ఆయన ప్రశంసించారు.
“ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి” అని ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. గిరిజనులు పండించే కాఫీ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు తీసుకువచ్చేందుకు చంద్రబాబు చేస్తున్న కృషి బాగుందని కొనియా డారు. పారిస్ కేఫ్ల్లోని ఎలక్ట్రానిక్ స్క్రీన్లపై అరకులోని గిరిజనుల జీవనశైలికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
ఇక్కడి కాఫీ ప్యాకేజింగ్ని గిరిజనుల వేషధారణ, భారతదేశంలోని వైవిధ్యమైన రంగుల స్ఫూర్తితో రూపొం దించినట్లు ఆనంద్ మహీంద్రా వివరించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీ ఘుమఘుమలు విస్తరించే రోజులు కొద్ది దూరంలో ఉన్నాయని పేర్కొన్నారు. గిరిజనులకు మంచి ఆదాయంతోపాటు.. రాష్ట్రానికి మంచి పేరు వస్తున్నాయని మహీంద్రా తెలిపారు. ఇదిలావుంటే పీ-4 విధానంపైనా పలువురు పారిశ్రామిక వేత్తలు.. హర్షం వ్యక్తంచేశారు. ఇలాంటి కార్యక్రమం తొలిసారి అమలు చేయడం బాగుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on March 31, 2025 8:52 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…