ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేయడం.. పీ-4 విధానం ద్వారా పేదలను ఉన్నత స్థాయికి తీసుకువచ్చే ప్రయత్నం చేయడం వంటివి ప్రముఖులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మహింద్రా కంపెనీ అధిపతి ఆనంద్ మహీంద్ర స్పందించారు. చందబాబు ఆలోచన అద్భుతః అని ఆయన ప్రశంసించారు.
“ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి” అని ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. గిరిజనులు పండించే కాఫీ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు తీసుకువచ్చేందుకు చంద్రబాబు చేస్తున్న కృషి బాగుందని కొనియా డారు. పారిస్ కేఫ్ల్లోని ఎలక్ట్రానిక్ స్క్రీన్లపై అరకులోని గిరిజనుల జీవనశైలికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
ఇక్కడి కాఫీ ప్యాకేజింగ్ని గిరిజనుల వేషధారణ, భారతదేశంలోని వైవిధ్యమైన రంగుల స్ఫూర్తితో రూపొం దించినట్లు ఆనంద్ మహీంద్రా వివరించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీ ఘుమఘుమలు విస్తరించే రోజులు కొద్ది దూరంలో ఉన్నాయని పేర్కొన్నారు. గిరిజనులకు మంచి ఆదాయంతోపాటు.. రాష్ట్రానికి మంచి పేరు వస్తున్నాయని మహీంద్రా తెలిపారు. ఇదిలావుంటే పీ-4 విధానంపైనా పలువురు పారిశ్రామిక వేత్తలు.. హర్షం వ్యక్తంచేశారు. ఇలాంటి కార్యక్రమం తొలిసారి అమలు చేయడం బాగుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on March 31, 2025 8:52 pm
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…
స్టార్ హీరోల కుటుంబాల నుంచి అబ్బాయిలు హీరోలుగా మారడం మామూలే. అమ్మాయిలు మాత్రం హీరోయిన్లు కావడం అరుదు. ఐతే సినీ…
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…