వైసీపీ కీలక నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్టు సమాచారం. గతవారం ఏదో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కడుపు నొప్పి అంటూ హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన నాని.. ఆ తర్వాత గుండె సంబంధిత రోగాలతో సతమతం అవుతున్నట్లుగా నిర్ధారణ అయ్యింది. తాజాగా కుటుంబ సభ్యులు ఆయనను సోమవారం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇందుకోసం వారు ఓ ప్రత్యేక విమానాన్ని వినియోగించారు. ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసుకున్న నాని కుటుంబం… నానిని అందులో ఎక్కించుకుని…ఆయనతో దాదాపుగా 8 మంది కుటుంబ సభ్యులు ముంబై వెళ్లారు.
హైదరాబాద్ నుంచి సోమవారం స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరిన నాని… నేరుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చేరారు. వాస్తవానికి నాని గుండెలో మూడు వాల్వ్ లు మూసుకుపోయాయని ఏఐజీ వైద్యులే నిర్ధారించారు. దీంతో నాని సమస్య స్టెంట్ లతో సరిపెట్టేది కాదని తేల్చిన వైద్యులు.. నానికి బైైపాస్ సర్జరీ తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనని తేల్చారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఏదో ఒక ప్రముఖ ఆసుపత్రిలోనే నానికి బైపాస్ సర్జరీ జరుగుతుందని, అంతటితోనే ఆయన అనారోగ్యం సెట్ అయిపోతుందని అంతా భావించారు. అయితే ఉన్నట్టుంది సోమవారం నానిని ఆయన ఫ్యామిలీ స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసుకుని మరీ ముంబైకి హుటాహుటీన తరలించడం చూస్తుంటే నాని ఆరోగ్యం ఒకింత క్రిటికల్ గానే ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ముంబైలో నానికి బైపాస్ సర్జరీ కాకుండా ఓపెన్ హార్ట్ సర్జరీజరగనుందని సమాచారం. ఈ ఆపరేషన్ చేసే వైద్యుడు ఎవరన్న విషయంపై ఆసక్తికర అంశాలు వినిపిస్తున్నాయి. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ లకు బైపాస్ సర్జరీలు చేసిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ పాండా.. నానికి సర్జరీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. డాక్టర్ పాండా సేవల కోసమే నానిని ఆయన కుటుంబం ముంబైై తరలించి నట్లగా తెలుస్తోంది. ఓపెన్ హార్ట్ సర్జరీల్లో ఆరితేరిన పాండాతో ఆపరేషన్ చేయిస్తే…ముప్పు ఉండదన్న భావనతోనే నాని కుటుంబం ఆయనను ముంబై తరలించిందని, అందుకోసం ఎంత ఖర్చుకైనా ఆ ఫ్యామిలీ వెనుకాడలేదని సమాచారం. డాక్టర్ పాండా చేతిలో సర్జరీ చేయించుకుని నాని ఆరోగ్యంగా తిరిగి వస్తారని ఆయన అనుచరులు భావిస్తున్నారు.
This post was last modified on March 31, 2025 6:41 pm
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…