రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేకెత్తించి.. అనేక అనుమానాలను కూడా సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి వ్యవహారంలో దాదాపు క్లారిటీ వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రహదారిపై గత సోమవారం.. అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్ పై వస్తున్న ఆయన.. కాకినాడ సమీపంలోని ఓ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న రహదారి పక్కన పడిపోయి ప్రాణాలు కోల్పోయారు.
అయితే.. ఆయన మృతిపై అనేక అనుమానాలు తలెత్తాయి. ముఖం, చేతులపై గాయాలు ఉండడం.. పాస్టర్గా ఆయన ఓ పార్టీ పాలనపై విమర్శలు గుప్పించడం వంటివి మరణంపై అనుమానాలు వచ్చేలా చేశాయి. దీనిపై పాస్టర్ల సంఘాలు కూడా.. ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ఏపీ సర్కారు విచారణకు ఆదేశించింది. డీఎస్పీ ఆధ్వర్యంలో ఐదుగురు ఉన్నతాధికారులతో కూడిన బృందం.. హైదరాబాద్ నుంచి కాకినాడ వరకు ఆయన ప్రయాణించిన రహదారుల వెంబడి ఉన్న సీసీ టీవీ ఫుటేజ్లను చాలా ఓర్పుగా పరిశీలించింది.
ఈ క్రమంలో హైదరాబాద్ దాటిన దగ్గర నుంచి ఆయన వ్యవహరించిన తీరు.. ఎక్కడెక్కడ ఆగిందీ.. ఎవరిని కలుసుకున్నదీ.. ఏం చేసింది కూడా.. విచారణ బృందం తెలుసుకుంది. తాజాగా అందిన అనధికార సమాచారం మేరకు.. గత సోమవారం హైదరాబాద్లో బయలు దేరిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ .. కోదాడ దగ్గర నుంచి కాకినాడ వరకు మధ్యలో రెండు మద్యం బాటిళ్లను కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. వీటికి ఆయన కోదాడలో 850 రూపాయలు, కాకినాడ ఎంట్రన్స్లో 350 రూపాయలను ఫోన్ పే ద్వారా చెల్లించినట్టు గుర్తించారు.
ఇక, విజయవాడ సమీపానికి వచ్చే ముందే.. ఆయన ప్రమాదానికి గురయ్యారని.. దీంతో బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోవడంతోపాటు.. పాస్టర్ ధరించిన హెల్మెట్కు సొట్టలు కూడా పడ్డాయని.. చేతులకు కూడా గీసుకు పోయిన గాయాలు అయ్యాయని గుర్తించారు. విజయవాడ బెంజిసర్కిల్ దాటే సరికి.. ఆయన పూర్తిగా స్పృహ కోల్పోయి.. రోడ్డుపై పడిపోయారని, పోలీసు అధికారి స్పందించి.. ఆయన పక్కనే ఉన్న పచ్చిక బయళ్లలో పడుకోబెట్టారని సాక్ష్యాధారంగా నమోదు చేశారు.
అక్కడ నుంచి కొంత తేరుకుని.. కాకినాడ దిశగా వెళ్లారు. అక్కడ కూడా.. మద్యం బాటిల్ కొనుగోలు చేయడం.. అనంతరం.. కొద్ది దూరంలో మరణించడం గమనార్హం. అయితే. ఈ వ్యవహారంపై అనుమానాలు దాదాపు తొలిగిపోయినా.. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అదేవిధంగా పోస్టు మార్టం రిపోర్టు కూడా రావాల్సి ఉంది.
This post was last modified on March 31, 2025 1:26 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…