Political News

మందే ముంచేసింది.. పాస్ట‌ర్ మృతిపై క్లారిటీ!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచ‌ల‌నం రేకెత్తించి.. అనేక అనుమానాల‌ను కూడా సృష్టించిన పాస్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ ప‌గ‌డాల మృతి వ్య‌వ‌హారంలో దాదాపు క్లారిటీ వ‌చ్చింది. తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ ర‌హ‌దారిపై గ‌త సోమ‌వారం.. అర్ధ‌రాత్రి జ‌రిగిన ప్ర‌మాదంలో ఆయ‌న మృతి చెందిన విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్ నుంచి రాజ‌మండ్రికి బుల్లెట్ పై వ‌స్తున్న ఆయ‌న‌.. కాకినాడ స‌మీపంలోని ఓ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న ర‌హ‌దారి ప‌క్క‌న ప‌డిపోయి ప్రాణాలు కోల్పోయారు.

అయితే.. ఆయ‌న మృతిపై అనేక అనుమానాలు త‌లెత్తాయి. ముఖం, చేతుల‌పై గాయాలు ఉండ‌డం.. పాస్ట‌ర్‌గా ఆయ‌న ఓ పార్టీ పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం వంటివి మ‌ర‌ణంపై అనుమానాలు వ‌చ్చేలా చేశాయి. దీనిపై పాస్ట‌ర్ల సంఘాలు కూడా.. ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. దీంతో ఏపీ స‌ర్కారు విచార‌ణ‌కు ఆదేశించింది. డీఎస్పీ ఆధ్వ‌ర్యంలో ఐదుగురు ఉన్న‌తాధికారుల‌తో కూడిన బృందం.. హైద‌రాబాద్ నుంచి కాకినాడ వ‌రకు ఆయ‌న ప్ర‌యాణించిన ర‌హ‌దారుల వెంబ‌డి ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ల‌ను చాలా ఓర్పుగా ప‌రిశీలించింది.

ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ దాటిన ద‌గ్గ‌ర నుంచి ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు.. ఎక్క‌డెక్క‌డ ఆగిందీ.. ఎవ‌రిని క‌లుసుకున్న‌దీ.. ఏం చేసింది కూడా.. విచార‌ణ బృందం తెలుసుకుంది. తాజాగా అందిన అన‌ధికార స‌మాచారం మేర‌కు.. గ‌త సోమ‌వారం హైదరాబాద్లో బ‌య‌లు దేరిన పాస్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ .. కోదాడ ద‌గ్గ‌ర నుంచి కాకినాడ వ‌ర‌కు మ‌ధ్య‌లో రెండు మ‌ద్యం బాటిళ్ల‌ను కొనుగోలు చేసిన‌ట్టు పోలీసులు గుర్తించారు. వీటికి ఆయ‌న కోదాడ‌లో 850 రూపాయ‌లు, కాకినాడ ఎంట్ర‌న్స్‌లో 350 రూపాయ‌ల‌ను ఫోన్ పే ద్వారా చెల్లించిన‌ట్టు గుర్తించారు.

ఇక‌, విజ‌య‌వాడ స‌మీపానికి వ‌చ్చే ముందే.. ఆయ‌న ప్ర‌మాదానికి గుర‌య్యార‌ని.. దీంతో బుల్లెట్ హెడ్‌లైట్ ప‌గిలిపోవ‌డంతోపాటు.. పాస్ట‌ర్ ధ‌రించిన హెల్మెట్‌కు సొట్ట‌లు కూడా ప‌డ్డాయ‌ని.. చేతులకు కూడా గీసుకు పోయిన గాయాలు అయ్యాయ‌ని గుర్తించారు. విజ‌య‌వాడ బెంజిస‌ర్కిల్ దాటే స‌రికి.. ఆయ‌న పూర్తిగా స్పృహ కోల్పోయి.. రోడ్డుపై ప‌డిపోయార‌ని, పోలీసు అధికారి స్పందించి.. ఆయ‌న ప‌క్క‌నే ఉన్న ప‌చ్చిక బ‌య‌ళ్ల‌లో ప‌డుకోబెట్టార‌ని సాక్ష్యాధారంగా న‌మోదు చేశారు.

అక్క‌డ నుంచి కొంత తేరుకుని.. కాకినాడ దిశ‌గా వెళ్లారు. అక్క‌డ కూడా.. మ‌ద్యం బాటిల్ కొనుగోలు చేయ‌డం.. అనంత‌రం.. కొద్ది దూరంలో మ‌ర‌ణించ‌డం గ‌మ‌నార్హం. అయితే. ఈ వ్య‌వ‌హారంపై అనుమానాలు దాదాపు తొలిగిపోయినా.. అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. అదేవిధంగా పోస్టు మార్టం రిపోర్టు కూడా రావాల్సి ఉంది.

This post was last modified on March 31, 2025 1:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

2 hours ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

3 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

3 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

3 hours ago

సీఎం విజయ్ కి బంపర్ ఆఫర్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…

4 hours ago

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

5 hours ago