రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేకెత్తించి.. అనేక అనుమానాలను కూడా సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి వ్యవహారంలో దాదాపు క్లారిటీ వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రహదారిపై గత సోమవారం.. అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్ పై వస్తున్న ఆయన.. కాకినాడ సమీపంలోని ఓ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న రహదారి పక్కన పడిపోయి ప్రాణాలు కోల్పోయారు.
అయితే.. ఆయన మృతిపై అనేక అనుమానాలు తలెత్తాయి. ముఖం, చేతులపై గాయాలు ఉండడం.. పాస్టర్గా ఆయన ఓ పార్టీ పాలనపై విమర్శలు గుప్పించడం వంటివి మరణంపై అనుమానాలు వచ్చేలా చేశాయి. దీనిపై పాస్టర్ల సంఘాలు కూడా.. ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ఏపీ సర్కారు విచారణకు ఆదేశించింది. డీఎస్పీ ఆధ్వర్యంలో ఐదుగురు ఉన్నతాధికారులతో కూడిన బృందం.. హైదరాబాద్ నుంచి కాకినాడ వరకు ఆయన ప్రయాణించిన రహదారుల వెంబడి ఉన్న సీసీ టీవీ ఫుటేజ్లను చాలా ఓర్పుగా పరిశీలించింది.
ఈ క్రమంలో హైదరాబాద్ దాటిన దగ్గర నుంచి ఆయన వ్యవహరించిన తీరు.. ఎక్కడెక్కడ ఆగిందీ.. ఎవరిని కలుసుకున్నదీ.. ఏం చేసింది కూడా.. విచారణ బృందం తెలుసుకుంది. తాజాగా అందిన అనధికార సమాచారం మేరకు.. గత సోమవారం హైదరాబాద్లో బయలు దేరిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ .. కోదాడ దగ్గర నుంచి కాకినాడ వరకు మధ్యలో రెండు మద్యం బాటిళ్లను కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. వీటికి ఆయన కోదాడలో 850 రూపాయలు, కాకినాడ ఎంట్రన్స్లో 350 రూపాయలను ఫోన్ పే ద్వారా చెల్లించినట్టు గుర్తించారు.
ఇక, విజయవాడ సమీపానికి వచ్చే ముందే.. ఆయన ప్రమాదానికి గురయ్యారని.. దీంతో బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోవడంతోపాటు.. పాస్టర్ ధరించిన హెల్మెట్కు సొట్టలు కూడా పడ్డాయని.. చేతులకు కూడా గీసుకు పోయిన గాయాలు అయ్యాయని గుర్తించారు. విజయవాడ బెంజిసర్కిల్ దాటే సరికి.. ఆయన పూర్తిగా స్పృహ కోల్పోయి.. రోడ్డుపై పడిపోయారని, పోలీసు అధికారి స్పందించి.. ఆయన పక్కనే ఉన్న పచ్చిక బయళ్లలో పడుకోబెట్టారని సాక్ష్యాధారంగా నమోదు చేశారు.
అక్కడ నుంచి కొంత తేరుకుని.. కాకినాడ దిశగా వెళ్లారు. అక్కడ కూడా.. మద్యం బాటిల్ కొనుగోలు చేయడం.. అనంతరం.. కొద్ది దూరంలో మరణించడం గమనార్హం. అయితే. ఈ వ్యవహారంపై అనుమానాలు దాదాపు తొలిగిపోయినా.. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అదేవిధంగా పోస్టు మార్టం రిపోర్టు కూడా రావాల్సి ఉంది.
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…