Political News

2 వేల కోట్ల‌తో వారి క‌న్నీరు తుడిచిన చంద్ర‌బాబు!

వారంతా చిన్న చిత‌కా కాంట్రాక్ట‌ర్లు. చిన్న‌పాటి ప‌నులు చేసుకుని త‌మ జీవితాలను, త‌మ‌పై ఆధార‌ప‌డిన కూలీల జీవితాల‌ను న‌డిపిస్తున్నారు. వీరంతా ప్ర‌భుత్వంపైనే ఆధార‌ప‌డ్డారు. అయితే.. వైసీపీ హ‌యాంలో చేసిన ప‌నుల‌కు అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌.. వీరిని క‌నిక‌రించ‌లేదు. వారు ప‌నులు పూర్తి చేసినా.. బిల్లులు తొక్కి పెట్టారు. క‌నీసం చేసిన ప‌నుల‌కు కూడా బిల్లులు ఇవ్వ‌లే దు. చివ‌రు చిన్న స్థాయి కాంట్రాక్ట‌ర్లు.. కూట‌మి క‌ట్టి.. హైకోర్టుకువెళ్లారు. దీంతో హైకోర్టు సొమ్ములు చెల్లించాల‌ని ఆదేశించింది. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ స‌ర్కారు క‌నిక‌రించ‌క‌పోగా..ఎద‌రు నాణ్య‌త లేద‌ని కేసులు పెట్టించింది.

ఇలా.. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఏకంగా 17 వేల మందికి పైగా కాంట్రాక్ట‌ర్లు చిక్కుల్లో ప‌డ్డారు. ఇంత‌లో స‌ర్కారు మారింది. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. దీంతో వీరంతా .. ప్ర‌భుత్వానికి ప‌లు రూపాల్లో మొర‌వినిపించారు. ఈ నేప‌థ్యంలో ఆయా కాంట్రాక్ట‌ర్ల ప‌నితీరుపై అధ్య‌య‌నం చేయించిన సర్కారు.. కాంట్రాక్ట‌ర్లు చేసిన ప‌నుల‌పై ఆడిట్ నిర్వ‌హించి.. వారు చేసిన ప‌నుల‌పై రికార్డులు తెప్పించుకుంది. వారంతా స‌వ్యంగానే ప‌నులు చేశార‌ని.. ఎక్క‌డా అవినీతి అక్ర‌మాలు లేవ‌ని.. నిర్ధారించుకుంది. దీంతో స‌ద‌రు 17 వేల మందికిపైగా చిన్న త‌ర‌హా కాంట్రాక్ట‌ర్ల‌కు ఉగాది ని పుర‌స్క‌రించుకుని శుభవార్త చెప్పింది.

ఆదివారం రాత్రి పొద్దు పోయిన త‌ర్వాత‌.. 17 వేల మందికి వైసీపీ హ‌యాంలో రెండుమూడేళ్లుగా పెండింగులో పెట్టిన సుమారు రూ2 వేల కోట్ల కు పైగా మొత్తాన్ని విడుద‌ల చేసేందుకు అంగీకరించింది. ఈ మొత్తాల‌ను వెనువెంట‌నే అంటే.. సోమ‌వారం నుంచే ప్రాధాన్యం బేస్ చేసుకుని చెల్లించాల‌ని ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్‌కు సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు. దీంతో ఆదివారం రాత్రంతా ప‌య్యావుల కేశ‌వ్ ఇదే ప‌నిపై రాజ‌ధానిలో ఉండిపోయారు. సోమ‌వారం బ్యాంకులు తీసే స‌మ‌యానికి క‌నీసం స‌గం మందికైనా చెల్లింపులు ప్రారంభం కావాల‌ని అధికారుల‌ను ఆయన ఆదేశించారు.

ఇక‌, ప్ర‌భుత్వం తీసుకున్న యుద్ధ‌ప్రాతిప‌దిక నిర్ణ‌యంప‌ట్ల‌ చిన్న‌త‌ర‌హా కాంట్రాక్ట‌ర్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. సీఎం చంద్ర‌బాబు త‌మ క‌న్నీరు తుడిచార‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఏళ్ల త‌ర‌బ‌డి పేరుకుపోయిన బిల్లులు ఇక రావేమోన‌ని భావించామ‌ని.. కానీ, చంద్ర‌బాబు విడుద‌ల‌కు ప‌చ్చ‌జెండా ఊపార‌ని తెలిపారు. అంతేకాదు.. రాజకీయ క‌క్ష‌లు ఎక్క‌డా చూపించ‌లేద‌ని ప‌లువు రు మీడియాతో వ్యాఖ్యానించారు. తాము అప్పులు చేసి మ‌రీ ప‌నులు చేప‌ట్టామ‌ని.. అయినా.. కూడా వైసీపీ ప్ర‌భుత్వం క‌నిక‌రించ‌లేద‌ని అన్నారు.

This post was last modified on March 31, 2025 10:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

38 minutes ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

1 hour ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

1 hour ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

2 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

3 hours ago

SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…

4 hours ago