Political News

2 వేల కోట్ల‌తో వారి క‌న్నీరు తుడిచిన చంద్ర‌బాబు!

వారంతా చిన్న చిత‌కా కాంట్రాక్ట‌ర్లు. చిన్న‌పాటి ప‌నులు చేసుకుని త‌మ జీవితాలను, త‌మ‌పై ఆధార‌ప‌డిన కూలీల జీవితాల‌ను న‌డిపిస్తున్నారు. వీరంతా ప్ర‌భుత్వంపైనే ఆధార‌ప‌డ్డారు. అయితే.. వైసీపీ హ‌యాంలో చేసిన ప‌నుల‌కు అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌.. వీరిని క‌నిక‌రించ‌లేదు. వారు ప‌నులు పూర్తి చేసినా.. బిల్లులు తొక్కి పెట్టారు. క‌నీసం చేసిన ప‌నుల‌కు కూడా బిల్లులు ఇవ్వ‌లే దు. చివ‌రు చిన్న స్థాయి కాంట్రాక్ట‌ర్లు.. కూట‌మి క‌ట్టి.. హైకోర్టుకువెళ్లారు. దీంతో హైకోర్టు సొమ్ములు చెల్లించాల‌ని ఆదేశించింది. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ స‌ర్కారు క‌నిక‌రించ‌క‌పోగా..ఎద‌రు నాణ్య‌త లేద‌ని కేసులు పెట్టించింది.

ఇలా.. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఏకంగా 17 వేల మందికి పైగా కాంట్రాక్ట‌ర్లు చిక్కుల్లో ప‌డ్డారు. ఇంత‌లో స‌ర్కారు మారింది. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. దీంతో వీరంతా .. ప్ర‌భుత్వానికి ప‌లు రూపాల్లో మొర‌వినిపించారు. ఈ నేప‌థ్యంలో ఆయా కాంట్రాక్ట‌ర్ల ప‌నితీరుపై అధ్య‌య‌నం చేయించిన సర్కారు.. కాంట్రాక్ట‌ర్లు చేసిన ప‌నుల‌పై ఆడిట్ నిర్వ‌హించి.. వారు చేసిన ప‌నుల‌పై రికార్డులు తెప్పించుకుంది. వారంతా స‌వ్యంగానే ప‌నులు చేశార‌ని.. ఎక్క‌డా అవినీతి అక్ర‌మాలు లేవ‌ని.. నిర్ధారించుకుంది. దీంతో స‌ద‌రు 17 వేల మందికిపైగా చిన్న త‌ర‌హా కాంట్రాక్ట‌ర్ల‌కు ఉగాది ని పుర‌స్క‌రించుకుని శుభవార్త చెప్పింది.

ఆదివారం రాత్రి పొద్దు పోయిన త‌ర్వాత‌.. 17 వేల మందికి వైసీపీ హ‌యాంలో రెండుమూడేళ్లుగా పెండింగులో పెట్టిన సుమారు రూ2 వేల కోట్ల కు పైగా మొత్తాన్ని విడుద‌ల చేసేందుకు అంగీకరించింది. ఈ మొత్తాల‌ను వెనువెంట‌నే అంటే.. సోమ‌వారం నుంచే ప్రాధాన్యం బేస్ చేసుకుని చెల్లించాల‌ని ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్‌కు సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు. దీంతో ఆదివారం రాత్రంతా ప‌య్యావుల కేశ‌వ్ ఇదే ప‌నిపై రాజ‌ధానిలో ఉండిపోయారు. సోమ‌వారం బ్యాంకులు తీసే స‌మ‌యానికి క‌నీసం స‌గం మందికైనా చెల్లింపులు ప్రారంభం కావాల‌ని అధికారుల‌ను ఆయన ఆదేశించారు.

ఇక‌, ప్ర‌భుత్వం తీసుకున్న యుద్ధ‌ప్రాతిప‌దిక నిర్ణ‌యంప‌ట్ల‌ చిన్న‌త‌ర‌హా కాంట్రాక్ట‌ర్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. సీఎం చంద్ర‌బాబు త‌మ క‌న్నీరు తుడిచార‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఏళ్ల త‌ర‌బ‌డి పేరుకుపోయిన బిల్లులు ఇక రావేమోన‌ని భావించామ‌ని.. కానీ, చంద్ర‌బాబు విడుద‌ల‌కు ప‌చ్చ‌జెండా ఊపార‌ని తెలిపారు. అంతేకాదు.. రాజకీయ క‌క్ష‌లు ఎక్క‌డా చూపించ‌లేద‌ని ప‌లువు రు మీడియాతో వ్యాఖ్యానించారు. తాము అప్పులు చేసి మ‌రీ ప‌నులు చేప‌ట్టామ‌ని.. అయినా.. కూడా వైసీపీ ప్ర‌భుత్వం క‌నిక‌రించ‌లేద‌ని అన్నారు.

This post was last modified on March 31, 2025 10:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

1 hour ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

2 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

2 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

3 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

4 hours ago