Political News

ఇక్కడ పీ4… అక్కడ సన్నబియ్యం

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో రెండు కీలక సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో పబ్లిక్, ప్రవేట్, పీపుల్ పార్టనర్ షిప్ (పీ4) పేరిట నిరుపేదలను పేదరికం నుంచి బయటపడేసే కార్యక్రమానికి కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, జనసేన అదినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ప్రారంభించారు. అదే సమయంలో రేషన్ కార్డుల ద్వారా పేదలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేసే సరికొత్త కార్యక్రమానికి తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని తెలంగాణ మఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీ4 పథకానికి కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని సంపన్న కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి… పేదరికంలో మగ్గుతన్న నాలుగు కుటుంబాలను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పేద కుటుంబాలను పేదరికం నుంచి బయటపడేసే దిశగా సంపన్న కుటుంబాలు కృషి చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ సంపన్న కుటుంబంపైనా ఒత్తిడి ఉండదు. స్వచ్ఛందంగానే సంపన్న కుటుంబాలు ముందుకు రావాల్సి ఉంటుంది. సాయం తీసుకునే కుటుంబాలను బంగారు కుటంబాలుగా పిలిస్తే… సాయం చేసే సంపన్న కుటుంబాలను మార్గదర్శిగా పిలుస్తారు. ఈ పథకంలో మధ్యవర్తిత్వానికే ప్రభుత్వం పరిమితం కానుంది. ప్రభుత్వం నుంచి పేద కుటుంబాలకు ఎలాంటి సహాయం అందదు.

ఇక తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం విషయానికి వస్తే… రేషన్ కార్డులు ఉన్న అన్ని కుటుంబాలకు ఉచితంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున అందించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. మంత్రి ఉత్తమ్ కమార్ రెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ వేదికగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మల్ల భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేషన్ కార్డుదారులక దొడ్డ బియ్యం ఇస్తన్ననేపథ్యంలో వారు ఆ బియ్యాన్ని తినలేకపోతున్నారని రేవంత్ అన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు.. సంపన్నల మాదిరే పేదలు కూడా సన్నబియ్యం తినేలా చేసేందకే ఈ పథకానికి రూపకల్పన చేశామని ఆయన తెలిపారు. ఈ పథకం తమ ద్వారానే ప్రారంభమవుతున్నా… భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా రద్దు చేయలేని విధంగా దీనిని పకడ్బందీగా అమలు చేసి తీరతామని ఆయన పేర్కొన్నారు.

This post was last modified on March 31, 2025 7:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

37 minutes ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

1 hour ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

1 hour ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

2 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

3 hours ago

SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…

4 hours ago