Political News

ఇక్కడ పీ4… అక్కడ సన్నబియ్యం

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో రెండు కీలక సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో పబ్లిక్, ప్రవేట్, పీపుల్ పార్టనర్ షిప్ (పీ4) పేరిట నిరుపేదలను పేదరికం నుంచి బయటపడేసే కార్యక్రమానికి కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, జనసేన అదినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ప్రారంభించారు. అదే సమయంలో రేషన్ కార్డుల ద్వారా పేదలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేసే సరికొత్త కార్యక్రమానికి తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని తెలంగాణ మఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీ4 పథకానికి కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని సంపన్న కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి… పేదరికంలో మగ్గుతన్న నాలుగు కుటుంబాలను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పేద కుటుంబాలను పేదరికం నుంచి బయటపడేసే దిశగా సంపన్న కుటుంబాలు కృషి చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ సంపన్న కుటుంబంపైనా ఒత్తిడి ఉండదు. స్వచ్ఛందంగానే సంపన్న కుటుంబాలు ముందుకు రావాల్సి ఉంటుంది. సాయం తీసుకునే కుటుంబాలను బంగారు కుటంబాలుగా పిలిస్తే… సాయం చేసే సంపన్న కుటుంబాలను మార్గదర్శిగా పిలుస్తారు. ఈ పథకంలో మధ్యవర్తిత్వానికే ప్రభుత్వం పరిమితం కానుంది. ప్రభుత్వం నుంచి పేద కుటుంబాలకు ఎలాంటి సహాయం అందదు.

ఇక తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం విషయానికి వస్తే… రేషన్ కార్డులు ఉన్న అన్ని కుటుంబాలకు ఉచితంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున అందించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. మంత్రి ఉత్తమ్ కమార్ రెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ వేదికగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మల్ల భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేషన్ కార్డుదారులక దొడ్డ బియ్యం ఇస్తన్ననేపథ్యంలో వారు ఆ బియ్యాన్ని తినలేకపోతున్నారని రేవంత్ అన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు.. సంపన్నల మాదిరే పేదలు కూడా సన్నబియ్యం తినేలా చేసేందకే ఈ పథకానికి రూపకల్పన చేశామని ఆయన తెలిపారు. ఈ పథకం తమ ద్వారానే ప్రారంభమవుతున్నా… భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా రద్దు చేయలేని విధంగా దీనిని పకడ్బందీగా అమలు చేసి తీరతామని ఆయన పేర్కొన్నారు.

This post was last modified on March 31, 2025 7:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

21 minutes ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

38 minutes ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

1 hour ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

2 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

2 hours ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

4 hours ago