Political News

ఇక్కడ పీ4… అక్కడ సన్నబియ్యం

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో రెండు కీలక సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో పబ్లిక్, ప్రవేట్, పీపుల్ పార్టనర్ షిప్ (పీ4) పేరిట నిరుపేదలను పేదరికం నుంచి బయటపడేసే కార్యక్రమానికి కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, జనసేన అదినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ప్రారంభించారు. అదే సమయంలో రేషన్ కార్డుల ద్వారా పేదలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేసే సరికొత్త కార్యక్రమానికి తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని తెలంగాణ మఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీ4 పథకానికి కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని సంపన్న కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి… పేదరికంలో మగ్గుతన్న నాలుగు కుటుంబాలను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పేద కుటుంబాలను పేదరికం నుంచి బయటపడేసే దిశగా సంపన్న కుటుంబాలు కృషి చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ సంపన్న కుటుంబంపైనా ఒత్తిడి ఉండదు. స్వచ్ఛందంగానే సంపన్న కుటుంబాలు ముందుకు రావాల్సి ఉంటుంది. సాయం తీసుకునే కుటుంబాలను బంగారు కుటంబాలుగా పిలిస్తే… సాయం చేసే సంపన్న కుటుంబాలను మార్గదర్శిగా పిలుస్తారు. ఈ పథకంలో మధ్యవర్తిత్వానికే ప్రభుత్వం పరిమితం కానుంది. ప్రభుత్వం నుంచి పేద కుటుంబాలకు ఎలాంటి సహాయం అందదు.

ఇక తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం విషయానికి వస్తే… రేషన్ కార్డులు ఉన్న అన్ని కుటుంబాలకు ఉచితంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున అందించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. మంత్రి ఉత్తమ్ కమార్ రెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ వేదికగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మల్ల భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేషన్ కార్డుదారులక దొడ్డ బియ్యం ఇస్తన్ననేపథ్యంలో వారు ఆ బియ్యాన్ని తినలేకపోతున్నారని రేవంత్ అన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు.. సంపన్నల మాదిరే పేదలు కూడా సన్నబియ్యం తినేలా చేసేందకే ఈ పథకానికి రూపకల్పన చేశామని ఆయన తెలిపారు. ఈ పథకం తమ ద్వారానే ప్రారంభమవుతున్నా… భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా రద్దు చేయలేని విధంగా దీనిని పకడ్బందీగా అమలు చేసి తీరతామని ఆయన పేర్కొన్నారు.

This post was last modified on March 31, 2025 7:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

12 minutes ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

25 minutes ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

7 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

8 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

9 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

9 hours ago