Political News

విశాఖలో లోకేశ్… జై షాతో కలిసి ఐపీఎల్ మ్యాచ్ వీక్షణ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం సాగర నగరం విశాఖపట్టణం వెళ్లారు. ఆదివారం తెలుగు సంవత్సరాది సందర్భంగా ఇంటిలో పూజాధికాల అనంతరం విశాఖకు బయలుదేరిన లోకేశ్… అక్కడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను వీక్షించారు. ఈ మ్యాచ్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు, అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీపీ) చైర్మన్ జై షా కూడా హాజరయ్యారు.

విశాఖలోని క్రికెట్ స్టేడియం చేరుకున్న తర్వాత జై షాతో లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనతో పాటు స్టేడియానికి వచ్చిన టీడీపీ నేతలు సానా సతీశ్, బండారు సత్యనారాయణ మూర్తి, గంటా శ్రీనివాసరావు తదితరులను జై షాకు లోకేశ్ పరిచయం చేశారు. అనంతరం జై షాతో లోకేశ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అమరావతిలో నిర్మించతలపెట్టిన క్రికెట్ స్టేడియం, ఏపీలో క్రికెట్ క్రీడాకారులకు ప్రోత్సాహం, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యకలాపాలను మరింతగా విస్తరించే అంశాలపై ఆయనతో లోకేశ్ చర్చించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే… గతంలో ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్థాన్ ల మధ్య దుబాయిలో జరిగిన క్రికెట్ మ్యాచ్ ను కూడా లోకేశ్ ప్రత్యక్షంగా వీక్షించిన సంగతి తెలిసిందే. తన కుమారుడు దేవాన్ష్ తో కలిసి దుబాయి వెళ్లిన లోకేశ్… దాయాదుల పోరును తిలకించారు. నాడు కూడా ఆ మ్యాచ్ కు వచ్చిన జై షాతో లోకేశ్ భేటీ అయ్యారు. ఆ తర్వాత జై షాతో తాను ఏమేం అంశాలు చర్చించానన్న విషయాన్ని లోకేశే స్వయంగా వెల్లడించారు. తాజాగా ఆదివారం విశాఖలో జై షా, లోకేశ్ లు పక్కపక్కనే కూర్చని ఐపీఎల్ మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగానూ వారిద్దరి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి.

This post was last modified on March 30, 2025 6:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

52 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago