హైదరాబాద్కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తామని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని.. దీంతో అభివృద్ధి లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్టు తెలిపారు. శ్రీవిశ్వావసు నామ నూతన సంవత్సరాదిని పురస్కరించు కుని.. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. తొలుత పంచాంగ శ్రవ ణం చేసిన ఆయన.. అనంతరం ప్రసంగించారు.
బడ్జెట్ ఉగాది పచ్చడి!
ఇటీవల అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జట్ను ముఖ్యమంత్రి ఉగాది పచ్చడితో పోల్చారు. “ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్…షడ్రుచుల సమ్మేళమైన ఉగాది పచ్చడిగా ఉంది” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం కల్పించినట్టు తెలిపారు. ప్రజల ఆదాయం పెంచేదిశగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయన్న రేవంత్రెడ్డి.. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక నిధులు కేటాయించామని వివరించారు.
ఎన్ని ఇబ్బందులు వచ్చినా..
ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తాము కృషి చేస్తున్నట్టు రేవంత్రెడ్డి తెలిపారు. దేశానికే రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. “మూసీ ప్రక్షాళన అనేది దశాబ్దాలుగా ఉన్న డిమాండ్. దీనిని మేం చేపట్టాం. కానీ, కొందరు సైంధవుల్లా అడ్డుపడుతున్నారు. అయినా.. తగ్గేదేలేదు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం” అని రేవంత్ ఉద్ఘాటించారు. పెట్టుబడుల కోసం వచ్చేవారిని కొందరు అడ్డుకుంటున్నారని బీఆర్ ఎస్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
అందరికీ సన్నబియ్యం
పేదలు మాత్రమే దొడ్డు బియ్యం తినాలా? వారికి సన్నబియ్యం సౌభాగ్యం వద్దా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వారికి కూడా సన్నబియ్యం ఇచ్చేందుకు.. ప్రయత్నిస్తున్నామని అన్నారు. గతేడాది 1.56 లక్షల టన్నుల వరిని పండించాం. ఇది దేశంలోనే అధికం. సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 60-65 శాతం మంది సన్నబియ్యం పండిస్తున్నారు. ఆ బియ్యాన్ని పేదలకు పంచేందుకు ప్రయత్నిస్తున్నాం.. అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
This post was last modified on March 30, 2025 2:31 pm
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…