Political News

హైద‌రాబాద్‌కు ప్ర‌పంచ‌స్థాయి గుర్తింపు: రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్‌కు ప్ర‌పంచ స్థాయి గుర్తింపు తెస్తామ‌ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గ‌త ప‌దేళ్ల‌లో రాష్ట్రాన్ని నాశ‌నం చేశార‌ని.. దీంతో అభివృద్ధి లేకుండా పోయింద‌న్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంత‌రం కృషి చేస్తున్న‌ట్టు తెలిపారు. శ్రీవిశ్వావ‌సు నామ నూత‌న సంవ‌త్స‌రాదిని పుర‌స్క‌రించు కుని.. హైద‌రాబాద్‌లోని ర‌వీంద్ర‌భార‌తిలో జ‌రిగిన వేడుక‌ల్లో సీఎం పాల్గొన్నారు. తొలుత పంచాంగ శ్ర‌వ ణం చేసిన ఆయ‌న‌.. అనంత‌రం ప్ర‌సంగించారు.

బ‌డ్జెట్ ఉగాది ప‌చ్చ‌డి!

ఇటీవ‌ల అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టిన 2025-26 వార్షిక బ‌డ్జ‌ట్‌ను ముఖ్య‌మంత్రి ఉగాది ప‌చ్చ‌డితో పోల్చారు. “ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌…ష‌డ్రుచుల స‌మ్మేళ‌మైన ఉగాది ప‌చ్చ‌డిగా ఉంది” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని వ‌ర్గాల‌కు స‌మాన ప్రాధాన్యం క‌ల్పించిన‌ట్టు తెలిపారు. ప్ర‌జ‌ల ఆదాయం పెంచేదిశ‌గా బ‌డ్జెట్‌లో కేటాయింపులు ఉన్నాయ‌న్న రేవంత్‌రెడ్డి.. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక నిధులు కేటాయించామ‌ని వివ‌రించారు.

ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా..

ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తాము కృషి చేస్తున్న‌ట్టు రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశానికే రాష్ట్రాన్ని ఆద‌ర్శంగా తీర్చిదిద్ద‌నున్న‌ట్టు తెలిపారు. “మూసీ ప్ర‌క్షాళ‌న అనేది ద‌శాబ్దాలుగా ఉన్న డిమాండ్‌. దీనిని మేం చేప‌ట్టాం. కానీ, కొంద‌రు సైంధ‌వుల్లా అడ్డుప‌డుతున్నారు. అయినా.. త‌గ్గేదేలేదు. మూసీ ప్ర‌క్షాళ‌న చేసి తీరుతాం” అని రేవంత్ ఉద్ఘాటించారు. పెట్టుబ‌డుల కోసం వ‌చ్చేవారిని కొంద‌రు అడ్డుకుంటున్నార‌ని బీఆర్ ఎస్‌పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.

అంద‌రికీ స‌న్న‌బియ్యం

పేద‌లు మాత్ర‌మే దొడ్డు బియ్యం తినాలా? వారికి స‌న్న‌బియ్యం సౌభాగ్యం వ‌ద్దా? అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. వారికి కూడా స‌న్న‌బియ్యం ఇచ్చేందుకు.. ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని అన్నారు. గతేడాది 1.56 లక్షల టన్నుల వరిని పండించాం. ఇది దేశంలోనే అధికం. సన్న బియ్యం పండిస్తే బోనస్‌ కూడా ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 60-65 శాతం మంది సన్నబియ్యం పండిస్తున్నారు. ఆ బియ్యాన్ని పేద‌ల‌కు పంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం.. అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

This post was last modified on March 30, 2025 2:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

2 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

3 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

3 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

3 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

4 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

5 hours ago