Political News

హైద‌రాబాద్‌కు ప్ర‌పంచ‌స్థాయి గుర్తింపు: రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్‌కు ప్ర‌పంచ స్థాయి గుర్తింపు తెస్తామ‌ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గ‌త ప‌దేళ్ల‌లో రాష్ట్రాన్ని నాశ‌నం చేశార‌ని.. దీంతో అభివృద్ధి లేకుండా పోయింద‌న్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంత‌రం కృషి చేస్తున్న‌ట్టు తెలిపారు. శ్రీవిశ్వావ‌సు నామ నూత‌న సంవ‌త్స‌రాదిని పుర‌స్క‌రించు కుని.. హైద‌రాబాద్‌లోని ర‌వీంద్ర‌భార‌తిలో జ‌రిగిన వేడుక‌ల్లో సీఎం పాల్గొన్నారు. తొలుత పంచాంగ శ్ర‌వ ణం చేసిన ఆయ‌న‌.. అనంత‌రం ప్ర‌సంగించారు.

బ‌డ్జెట్ ఉగాది ప‌చ్చ‌డి!

ఇటీవ‌ల అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టిన 2025-26 వార్షిక బ‌డ్జ‌ట్‌ను ముఖ్య‌మంత్రి ఉగాది ప‌చ్చ‌డితో పోల్చారు. “ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌…ష‌డ్రుచుల స‌మ్మేళ‌మైన ఉగాది ప‌చ్చ‌డిగా ఉంది” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని వ‌ర్గాల‌కు స‌మాన ప్రాధాన్యం క‌ల్పించిన‌ట్టు తెలిపారు. ప్ర‌జ‌ల ఆదాయం పెంచేదిశ‌గా బ‌డ్జెట్‌లో కేటాయింపులు ఉన్నాయ‌న్న రేవంత్‌రెడ్డి.. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక నిధులు కేటాయించామ‌ని వివ‌రించారు.

ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా..

ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తాము కృషి చేస్తున్న‌ట్టు రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశానికే రాష్ట్రాన్ని ఆద‌ర్శంగా తీర్చిదిద్ద‌నున్న‌ట్టు తెలిపారు. “మూసీ ప్ర‌క్షాళ‌న అనేది ద‌శాబ్దాలుగా ఉన్న డిమాండ్‌. దీనిని మేం చేప‌ట్టాం. కానీ, కొంద‌రు సైంధ‌వుల్లా అడ్డుప‌డుతున్నారు. అయినా.. త‌గ్గేదేలేదు. మూసీ ప్ర‌క్షాళ‌న చేసి తీరుతాం” అని రేవంత్ ఉద్ఘాటించారు. పెట్టుబ‌డుల కోసం వ‌చ్చేవారిని కొంద‌రు అడ్డుకుంటున్నార‌ని బీఆర్ ఎస్‌పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.

అంద‌రికీ స‌న్న‌బియ్యం

పేద‌లు మాత్ర‌మే దొడ్డు బియ్యం తినాలా? వారికి స‌న్న‌బియ్యం సౌభాగ్యం వ‌ద్దా? అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. వారికి కూడా స‌న్న‌బియ్యం ఇచ్చేందుకు.. ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని అన్నారు. గతేడాది 1.56 లక్షల టన్నుల వరిని పండించాం. ఇది దేశంలోనే అధికం. సన్న బియ్యం పండిస్తే బోనస్‌ కూడా ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 60-65 శాతం మంది సన్నబియ్యం పండిస్తున్నారు. ఆ బియ్యాన్ని పేద‌ల‌కు పంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం.. అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

This post was last modified on March 30, 2025 2:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

20 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago