ఏపీ సీఎం చంద్రబాబు ఉగాదిని పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు వారి పండుగలలో ప్రధంగా వచ్చే ఉగాదిని పురస్కరించుకుని పేదలకు ఆర్థిక సహాయం అందించేలా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు.. 3 వేల మందికి పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సొమ్ములు అందించే ఫైలుపై ఆయన ఉగాది సందర్భంగా తొలి సంతకం చేశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఉగాదిని పురస్కరించుకుని పేదలకు మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఇదే తొలిసారి అని సీఎం పేర్కొన్నారు. మొత్తంగా 38 కోట్ల రూపాయలకు పైగానే.. సొమ్మును పేదలకు అందించే సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబం ధించి సీఎం సంతకం చేశారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల కు చెందిన పేదలకు ఈ ఫండ్స్ ద్వారా మేలు జరగనుందని.. ఆపద, అనారోగ్యం, ఇతర సమస్యలలో ఉన్న వారికి ఈ నిధులు ఎంతగానో దోహద పడతాయని చంద్రబాబు పేర్కొన్నారు.
38 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేసేలా అధికారులను కూడా ఆదేశించినట్టు సీఎం చంద్రబా బు పేర్కొన్నారు. 3456 మందికి ఈ నిధులను అందించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా పేదల భవిష్య త్తును బంగారు మయం చేసే పీ-4 కార్యక్రమానికి కూడా ఉగాది సందర్భంగానే శ్రీకారం చుడుతున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీంతో వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల మందికిపైగా పేదలు పేదరికం నుంచి బయటపడతారని.. తద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన యజ్ఞం సాకారం అవుతుందని తెలిపారు.
This post was last modified on March 30, 2025 4:06 pm
మన దగ్గర మిడ్ రేంజ్ హీరోల మీద వంద కోట్ల బడ్జెట్లు పెట్టేస్తున్నారు నిర్మాతలు. తీరా చూస్తే తెర మీద…
తెలుగు టీవీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన షోగా జబర్దస్త్ను చెప్పొచ్చు. అందులో డబుల్ మీనింగ్లు, బాడీ షేమింగ్ల గురించి అభ్యంతరాలు…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాను నటించకుండా నిర్మించిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. సుమారు నలభైకి పైగా కొత్తవాళ్లను పరిచయం…
ఆదిత్య ధర్.. గత నాలుగు నెలలుగా దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. దురంధర్, దురంధర్-2 చిత్రాలతో అతను రేపిన సంచలనం అంతా…
ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…
వైసీపీ అధినేత జగన్ను అధికారంలోకి రాకుండా చేస్తానని.. అవసరమైతే.. చంద్రబాబు ఓకే అంటే.. తాను కూడా పాదయాత్రకు రెడీ అంటూ..…