ఏపీ సీఎం చంద్రబాబు ఉగాదిని పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు వారి పండుగలలో ప్రధంగా వచ్చే ఉగాదిని పురస్కరించుకుని పేదలకు ఆర్థిక సహాయం అందించేలా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు.. 3 వేల మందికి పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సొమ్ములు అందించే ఫైలుపై ఆయన ఉగాది సందర్భంగా తొలి సంతకం చేశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఉగాదిని పురస్కరించుకుని పేదలకు మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఇదే తొలిసారి అని సీఎం పేర్కొన్నారు. మొత్తంగా 38 కోట్ల రూపాయలకు పైగానే.. సొమ్మును పేదలకు అందించే సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబం ధించి సీఎం సంతకం చేశారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల కు చెందిన పేదలకు ఈ ఫండ్స్ ద్వారా మేలు జరగనుందని.. ఆపద, అనారోగ్యం, ఇతర సమస్యలలో ఉన్న వారికి ఈ నిధులు ఎంతగానో దోహద పడతాయని చంద్రబాబు పేర్కొన్నారు.
38 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేసేలా అధికారులను కూడా ఆదేశించినట్టు సీఎం చంద్రబా బు పేర్కొన్నారు. 3456 మందికి ఈ నిధులను అందించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా పేదల భవిష్య త్తును బంగారు మయం చేసే పీ-4 కార్యక్రమానికి కూడా ఉగాది సందర్భంగానే శ్రీకారం చుడుతున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీంతో వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల మందికిపైగా పేదలు పేదరికం నుంచి బయటపడతారని.. తద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన యజ్ఞం సాకారం అవుతుందని తెలిపారు.
This post was last modified on March 30, 2025 4:06 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…