ఏపీ సీఎం చంద్రబాబు ఉగాదిని పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు వారి పండుగలలో ప్రధంగా వచ్చే ఉగాదిని పురస్కరించుకుని పేదలకు ఆర్థిక సహాయం అందించేలా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు.. 3 వేల మందికి పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సొమ్ములు అందించే ఫైలుపై ఆయన ఉగాది సందర్భంగా తొలి సంతకం చేశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఉగాదిని పురస్కరించుకుని పేదలకు మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఇదే తొలిసారి అని సీఎం పేర్కొన్నారు. మొత్తంగా 38 కోట్ల రూపాయలకు పైగానే.. సొమ్మును పేదలకు అందించే సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబం ధించి సీఎం సంతకం చేశారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల కు చెందిన పేదలకు ఈ ఫండ్స్ ద్వారా మేలు జరగనుందని.. ఆపద, అనారోగ్యం, ఇతర సమస్యలలో ఉన్న వారికి ఈ నిధులు ఎంతగానో దోహద పడతాయని చంద్రబాబు పేర్కొన్నారు.
38 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేసేలా అధికారులను కూడా ఆదేశించినట్టు సీఎం చంద్రబా బు పేర్కొన్నారు. 3456 మందికి ఈ నిధులను అందించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా పేదల భవిష్య త్తును బంగారు మయం చేసే పీ-4 కార్యక్రమానికి కూడా ఉగాది సందర్భంగానే శ్రీకారం చుడుతున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీంతో వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల మందికిపైగా పేదలు పేదరికం నుంచి బయటపడతారని.. తద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన యజ్ఞం సాకారం అవుతుందని తెలిపారు.
This post was last modified on March 30, 2025 4:06 pm
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు…
ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…
జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…
మేం ఫేమస్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ నటుడు సుమంత్ ప్రభాస్. షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ…
ఇప్పుడు టాలీవుడ్లో ఏ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పరిస్థితీ అంత బాగా లేదు. సక్సెస్ రేట్ అంతకంతకూ పడిపోతోంది. జనాలు థియేటర్లకు…