Political News

ఉద్యోగార్థులకు రేవంత్ మార్క్ ఉగాది గిఫ్ట్!

తెలంగాణలో కొలువుల కోసం కోట్ల కళ్లతో ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం నిజంగానే అదిరిపోయే బహుమతి ఇచ్చారు. ఆదివారం తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు నేల వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సంబరాల వేళ గ్రూప్ 1 పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలు విడుదల చేసిన రేవంత్ సర్కారు..వారి సంబరాలను రెట్టింపు చేసిందని చెప్పాలి.

గతేడాది మొత్తం 563 పోస్టుల భర్తీ కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ను రేవంత్ సర్కారు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్షలు ముగియగా.. అందులో అర్హత సాధించిన అభ్యర్థులను మెుయిన్స్ పరీక్షకు ఎంపిక చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఇటీవలే మెయిన్స్ రాత పరీక్ష కూడా నిర్వహించింది. మెయిన్స్ పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థుల పేపర్ల వాల్యూయేషన్ ను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసిన టీజీపీఎస్సీ… ఇప్పటికే ప్రొవిజలన్ మార్క్ లిస్టులను విడుదల చేసింది. వీటిపై అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తాజాగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను విడుదల చేసింది.

జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో పెట్టినట్లుగా ఆ సంస్థ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇదివరకు విడుదల చేసిన ప్రొవిజనల్ మార్క్ లిస్టులను ఆధారం చేసుకునే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లను విడుదల చేశామన్న ఆయన త్వరలోనే కేటరిగీ వారిగా ర్యాంకింగ్ జాబితాను విడుదల చేస్తామని ప్రకటించారు. అప్పటిలోగా అభ్యర్థులు తమ మార్కులు, ర్యాంకులను సరిచూసుకుని అభ్యంతరాలంటే తెలిపాలని కోరారు. మొత్తంగా సరిగ్గా ఉగాది పర్వదినాన గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను విడుదల చేయడం ద్వారా రేవంత్ సర్కారు ఉద్యోగార్థులకు పండగ సంబరాలను అంబరాన్నంటేలా చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on March 30, 2025 12:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

50 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

2 hours ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago