తెలంగాణలో కొలువుల కోసం కోట్ల కళ్లతో ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం నిజంగానే అదిరిపోయే బహుమతి ఇచ్చారు. ఆదివారం తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు నేల వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సంబరాల వేళ గ్రూప్ 1 పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలు విడుదల చేసిన రేవంత్ సర్కారు..వారి సంబరాలను రెట్టింపు చేసిందని చెప్పాలి.
గతేడాది మొత్తం 563 పోస్టుల భర్తీ కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ను రేవంత్ సర్కారు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్షలు ముగియగా.. అందులో అర్హత సాధించిన అభ్యర్థులను మెుయిన్స్ పరీక్షకు ఎంపిక చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఇటీవలే మెయిన్స్ రాత పరీక్ష కూడా నిర్వహించింది. మెయిన్స్ పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థుల పేపర్ల వాల్యూయేషన్ ను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసిన టీజీపీఎస్సీ… ఇప్పటికే ప్రొవిజలన్ మార్క్ లిస్టులను విడుదల చేసింది. వీటిపై అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తాజాగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను విడుదల చేసింది.
జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో పెట్టినట్లుగా ఆ సంస్థ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇదివరకు విడుదల చేసిన ప్రొవిజనల్ మార్క్ లిస్టులను ఆధారం చేసుకునే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లను విడుదల చేశామన్న ఆయన త్వరలోనే కేటరిగీ వారిగా ర్యాంకింగ్ జాబితాను విడుదల చేస్తామని ప్రకటించారు. అప్పటిలోగా అభ్యర్థులు తమ మార్కులు, ర్యాంకులను సరిచూసుకుని అభ్యంతరాలంటే తెలిపాలని కోరారు. మొత్తంగా సరిగ్గా ఉగాది పర్వదినాన గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను విడుదల చేయడం ద్వారా రేవంత్ సర్కారు ఉద్యోగార్థులకు పండగ సంబరాలను అంబరాన్నంటేలా చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 30, 2025 12:49 pm
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…