Political News

ఉద్యోగార్థులకు రేవంత్ మార్క్ ఉగాది గిఫ్ట్!

తెలంగాణలో కొలువుల కోసం కోట్ల కళ్లతో ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం నిజంగానే అదిరిపోయే బహుమతి ఇచ్చారు. ఆదివారం తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు నేల వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సంబరాల వేళ గ్రూప్ 1 పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలు విడుదల చేసిన రేవంత్ సర్కారు..వారి సంబరాలను రెట్టింపు చేసిందని చెప్పాలి.

గతేడాది మొత్తం 563 పోస్టుల భర్తీ కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ను రేవంత్ సర్కారు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్షలు ముగియగా.. అందులో అర్హత సాధించిన అభ్యర్థులను మెుయిన్స్ పరీక్షకు ఎంపిక చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఇటీవలే మెయిన్స్ రాత పరీక్ష కూడా నిర్వహించింది. మెయిన్స్ పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థుల పేపర్ల వాల్యూయేషన్ ను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసిన టీజీపీఎస్సీ… ఇప్పటికే ప్రొవిజలన్ మార్క్ లిస్టులను విడుదల చేసింది. వీటిపై అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తాజాగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను విడుదల చేసింది.

జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో పెట్టినట్లుగా ఆ సంస్థ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇదివరకు విడుదల చేసిన ప్రొవిజనల్ మార్క్ లిస్టులను ఆధారం చేసుకునే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లను విడుదల చేశామన్న ఆయన త్వరలోనే కేటరిగీ వారిగా ర్యాంకింగ్ జాబితాను విడుదల చేస్తామని ప్రకటించారు. అప్పటిలోగా అభ్యర్థులు తమ మార్కులు, ర్యాంకులను సరిచూసుకుని అభ్యంతరాలంటే తెలిపాలని కోరారు. మొత్తంగా సరిగ్గా ఉగాది పర్వదినాన గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను విడుదల చేయడం ద్వారా రేవంత్ సర్కారు ఉద్యోగార్థులకు పండగ సంబరాలను అంబరాన్నంటేలా చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Satya

Recent Posts

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

32 minutes ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

6 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

7 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

9 hours ago

నేను హోమ్ మినిస్టర్ కాకపోవడమే నేరస్తుల అదృష్టం: పవన్

ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…

10 hours ago

సెన్సార్ చిక్కులు చిన్న సినిమాలకేనా

వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…

11 hours ago