Political News

గీతం’ వెంటపడిన వైసీపీ ఎంపి

వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటి యాజమాన్యం వెంట పడ్డారు. 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వివాదంలో యాజమాన్యం బాగా వివాదాస్పదమైన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కేసులో ఇరుక్కున్న యాజమాన్యంపై ఎంపి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో ఆగని ఎంపి తాజాగా కేంద్రం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్, యూజీసీ ఛైర్యన్ ధీరేంద్ర పాల్ సింగ్ కు కూడా ఫిర్యాదు చేయటం సంచలనంగా మారింది.

డీమ్డ్ యూనివర్సిటీగా కొనసాగుతున్న యూనివర్సిటి గుర్తింపును వెంటనే రద్దు చేయాలంటూ ఎంపి తన ఫిర్యాదులో కోరారు. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గీతం విద్యాసంస్ధను ఆంధ్రా యూనివర్సిటికీ అఫిలియేట్ ఇప్పించాలని సూచించారు. యూనివర్సిటి గ్రాంట్స్ కమీషన్ నిబంధనలను ఉల్లంఘించి యాజమాన్యం డీమ్డ్ హోదా తెచ్చుకుందంటూ తీవ్రంగా ఆరోపించారు. ఇన్ని సంవత్సరాల్లో గీతం యాజమాన్యం పాల్పడిన అక్రమాలకు, తప్పుడు మార్గాలు అంటూ ఒక జాబితాను విజయసాయి తన ఫిర్యాదులో వివరంగా చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గీతం విద్యాసంస్ధల యాజమాన్యం చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడైన దివంగత ఎంఎల్సీ ఎంవివిఎస్ మూర్తి దన్న విషయం తెలిసిందే. మూర్తి మనవడు, నారా లోకేష్ తోడల్లుడైన శ్రీ భరత్ మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున విశాఖపట్నం ఎంపిగా పోటి చేసి ఓడిపోయారు.

గీతం భూకబ్జా వివాదం చివరకు రాజకీయంగా ఇటు వైసీపీ అటు టీడీపీ నేతల మధ్య మంటలు పుట్టిస్తోంది. గీతం వ్యవస్థాపకుడు ఉత్తరాంధ్రలోని సినియర్ నేతల్లో ఒకరు, పైగా చంద్రబాబుకు దగ్గరి బంధువు కావటంతో విజయసాయి కూడా గీతం యాజమాన్యం వెంట పట్టువదలని విక్రమార్కుడులాగ తగులుకున్నారు. దేశంలో పాపులర్ యూనివర్సిటీల్లో ఒకటిగా ఎదిగిన ఈ విద్యాసంస్థ గురించి ఎంపీ ఫిర్యాదు కేంద్రం లెక్కలోకి తీసుకుంటుందా… లేక ఉద్దేశపూర్వక ఆరోపణలు అంటూ పక్కన పెట్టేస్తుందా అన్నది చూడాలి.

This post was last modified on October 30, 2020 1:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

2 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

5 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

6 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

6 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

8 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

8 hours ago