Political News

వైసీపీలో.. చాలా మందే ఉన్నార‌ట‌.. !

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ వ్య‌వ‌హారం అంద‌రికీ తెలిసిందే. ఆయ‌నపై ఇప్ప‌టికి మూడు కేసులు న‌మో ద‌య్యాయి. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ జైల్లోనే ఉన్నారు. వ‌చ్చే నెల 9వ తేదీ వ‌ర‌కు కూడా ఆయ‌న జైల్లోనే ఉండ‌నున్నారు. అంతేకా దు.. ప్ర‌స్తుతం ఆయ‌న పెట్టుకున్న బెయిల్ పిటిష‌న్ కూడా ర‌ద్ద‌యింది. మ‌రోవైపు.. భూక‌బ్జా కేసులోనూ ఆయ‌న‌పై మ‌రో పిటిష‌న్ దాఖ‌లైంది. దీంతో పోలీసు క‌స్ట‌డీకి వంశీని అప్ప‌గించారు. దీంతో వంశీ ఏకంగా మూడు కేసుల్లో చిక్కుకున్న‌ట్టు అయింది. అయితే.. వంశీ ఒక్క‌రేనా.. వైసీపీలో ఉన్న‌ది అంటే.. కాద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌స్తుతం ఉన్న స‌మాచారం మేర‌కు.. ఇప్ప‌టి వ‌ర‌కు కేసులు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌, బోరుగ‌డ్డ అనిల్ వంటి వారిని ప‌క్క‌న పెడితే.. ఇక‌పై కేసులు న‌మోద‌య్యేవారి జాబితా కూడా పెద్ద‌దిగానే ఉంద‌ని తెలుస్తోంది. ఇలాంటి వారిలో మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి స‌హా.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. అసెంబ్లీలోనే బండ బూతుల‌తో విరుచుకుప‌డిన‌ట్టుగా మాజీ మంత్రి అనిల్‌పై టీడీపీనాయ‌కులు విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. నెల్లూరులో ఆయ‌న చేసిన అరాచ‌కాల‌పై టీడీపీ నాయ‌కులు పెద్ద జాబితాతోనేరెడీ అవుతున్న‌ట్టు తెలిసింది.

ఇక‌, కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డిపై ఇప్ప‌టికే నాలుగు కేసులు న‌మోదయ్యాయి. మ‌రో కీల‌క కేసును కూడా తిర‌గ‌దోడేందుకు పోలీసులు రెడీ అయ్యారు. దీంతో అటు కాకాని, ఇటు అనిల్‌పై కేసులు ఒక‌టి త‌ర్వాత ఒక‌టి న‌మోదు కావ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఇదిలావుంటే.. గుంటూరు జిల్లాకు చెందిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు క్వార్ట్జ్ దోపిడీ వ్య‌వ‌హారంపై ఎమ్మెల్యే, చీఫ్ విప్ ఆంజ‌నేయులు తాజాగా పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతోపాటు వైసీపీ నాయ‌కుల‌పై ఆయ‌న గ‌తంలో పెట్టించిన కేసుల ఆధారంగా.. వారితోనేరివ‌ర్స్ కేసులు పెట్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఒక్క బొల్లాపైనే కాకుండా..ఆయ‌న కుమారుడు గిరి పైనా కేసులు న‌మోద‌య్యే అవ‌కాశంఉంద‌ని తెలుస్తోంది. ఇలా.. ఒక కేసు కాకుండా..కేసుల ప‌రంప‌ర మొద‌లు కానుంద‌ని స‌మాచారం. అదేవిధంగా న‌ర‌సారావుపేట మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయ‌కుడి పైనా కేసులు పెట్టేందుకు రంగం రెడీ అయింది. ఇటీవ‌ల ఔష‌ధ దుకాణాల‌పై అధికారులు దాడులు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు చెందిన దుకాణాల‌పైనా దాడులు జ‌రిగాయి. వీటిని గోప్యంగా ఉంచిన అధికారులు ప్ర‌భుత్వం నుంచి సిగ్న‌ల్ రాగానే ఆయ‌నపైనా కేసులు న‌మోదు చేసేందుకు రెడీ అవుతున్నారు.

This post was last modified on March 29, 2025 12:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అస్సీలో అంత మ్యాటర్ ఉందంటారా

గత కొన్ని రోజులుగా ఇంటర్వ్యూలతో హీరోయిన్ తాప్సీ తెగ హడావుడి చేస్తోంది. కారణం తన బాలీవుడ్ మూవీ అస్సీ ఇటీవలే…

2 hours ago

టాక్సిక్ ఇష్టం మనోళ్లకే ఎక్కువ ఉంది

ఇటీవలే విడుదలైన టాక్సిక్ టీజర్ మీద పాజిటివ్, నెగటివ్ రెండు రకాల రియాక్షన్లు సోషల్ మీడియాలో కనిపించాయి. వయొలెన్స్ ఎక్కువయ్యిందని…

2 hours ago

విశ్వక్ అర్థం చేసుకున్న ట్రెండ్ నిజమేనా

నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…

5 hours ago

సాయిపల్లవి బరిలో ఉంటే అవార్డ్ ఇవ్వాల్సిందే

హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…

5 hours ago

‘పవన్ హఠావో’ రచయిత మృతి కేసు మిస్టరీ వీడింది

“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…

6 hours ago

విన్యాసం మీదే బాక్సాఫీస్ ఆశలు

గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…

6 hours ago