Political News

వైసీపీలో.. చాలా మందే ఉన్నార‌ట‌.. !

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ వ్య‌వ‌హారం అంద‌రికీ తెలిసిందే. ఆయ‌నపై ఇప్ప‌టికి మూడు కేసులు న‌మో ద‌య్యాయి. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ జైల్లోనే ఉన్నారు. వ‌చ్చే నెల 9వ తేదీ వ‌ర‌కు కూడా ఆయ‌న జైల్లోనే ఉండ‌నున్నారు. అంతేకా దు.. ప్ర‌స్తుతం ఆయ‌న పెట్టుకున్న బెయిల్ పిటిష‌న్ కూడా ర‌ద్ద‌యింది. మ‌రోవైపు.. భూక‌బ్జా కేసులోనూ ఆయ‌న‌పై మ‌రో పిటిష‌న్ దాఖ‌లైంది. దీంతో పోలీసు క‌స్ట‌డీకి వంశీని అప్ప‌గించారు. దీంతో వంశీ ఏకంగా మూడు కేసుల్లో చిక్కుకున్న‌ట్టు అయింది. అయితే.. వంశీ ఒక్క‌రేనా.. వైసీపీలో ఉన్న‌ది అంటే.. కాద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌స్తుతం ఉన్న స‌మాచారం మేర‌కు.. ఇప్ప‌టి వ‌ర‌కు కేసులు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌, బోరుగ‌డ్డ అనిల్ వంటి వారిని ప‌క్క‌న పెడితే.. ఇక‌పై కేసులు న‌మోద‌య్యేవారి జాబితా కూడా పెద్ద‌దిగానే ఉంద‌ని తెలుస్తోంది. ఇలాంటి వారిలో మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి స‌హా.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. అసెంబ్లీలోనే బండ బూతుల‌తో విరుచుకుప‌డిన‌ట్టుగా మాజీ మంత్రి అనిల్‌పై టీడీపీనాయ‌కులు విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. నెల్లూరులో ఆయ‌న చేసిన అరాచ‌కాల‌పై టీడీపీ నాయ‌కులు పెద్ద జాబితాతోనేరెడీ అవుతున్న‌ట్టు తెలిసింది.

ఇక‌, కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డిపై ఇప్ప‌టికే నాలుగు కేసులు న‌మోదయ్యాయి. మ‌రో కీల‌క కేసును కూడా తిర‌గ‌దోడేందుకు పోలీసులు రెడీ అయ్యారు. దీంతో అటు కాకాని, ఇటు అనిల్‌పై కేసులు ఒక‌టి త‌ర్వాత ఒక‌టి న‌మోదు కావ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఇదిలావుంటే.. గుంటూరు జిల్లాకు చెందిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు క్వార్ట్జ్ దోపిడీ వ్య‌వ‌హారంపై ఎమ్మెల్యే, చీఫ్ విప్ ఆంజ‌నేయులు తాజాగా పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతోపాటు వైసీపీ నాయ‌కుల‌పై ఆయ‌న గ‌తంలో పెట్టించిన కేసుల ఆధారంగా.. వారితోనేరివ‌ర్స్ కేసులు పెట్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఒక్క బొల్లాపైనే కాకుండా..ఆయ‌న కుమారుడు గిరి పైనా కేసులు న‌మోద‌య్యే అవ‌కాశంఉంద‌ని తెలుస్తోంది. ఇలా.. ఒక కేసు కాకుండా..కేసుల ప‌రంప‌ర మొద‌లు కానుంద‌ని స‌మాచారం. అదేవిధంగా న‌ర‌సారావుపేట మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయ‌కుడి పైనా కేసులు పెట్టేందుకు రంగం రెడీ అయింది. ఇటీవ‌ల ఔష‌ధ దుకాణాల‌పై అధికారులు దాడులు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు చెందిన దుకాణాల‌పైనా దాడులు జ‌రిగాయి. వీటిని గోప్యంగా ఉంచిన అధికారులు ప్ర‌భుత్వం నుంచి సిగ్న‌ల్ రాగానే ఆయ‌నపైనా కేసులు న‌మోదు చేసేందుకు రెడీ అవుతున్నారు.

This post was last modified on March 29, 2025 12:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

3 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

4 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

5 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

5 hours ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

6 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

8 hours ago