Political News

పోల‌వ‌రం – చంద్ర‌బాబు – ఈ విష‌యాలు ఇంపార్టెంట్ ..!

రాష్ట్రానికి కీల‌క‌మైన సాగు, తాగు నీటిని అందించే బ‌హుళార్థ సాధ‌క ప్రాజెక్టు పోల‌వ‌రం ప్రాజెక్టును మ‌రో రెండేళ్ల‌లోనే పూర్తిచేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు తాజాగా మ‌రోసారి ప్ర‌క‌టించారు. 2026-27 ఆర్థిక సంవ‌త్సరం పూర్త‌య్యేనాటికి దానిని సాకారం చేస్తామ‌ని కూడా చెప్పారు. ఇది మంచిదే. ఆయ‌న నిర్ణ‌యం, ప్ర‌ణాళి క‌ల‌ను కూడా త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. అలా సాధించేందుకు ఉన్న మార్గాలేంటి? అన్న ది ప‌రిశీలిస్తే.. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో స‌హ‌కారం అవ‌స‌రం.

కానీ, కేంద్రం నుంచి అలాంటి పూర్తి మ‌ద్ద‌తు ల‌భిస్తుందా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ప్ర‌స్తుతం రెండు విష‌యాల‌ను కేంద్రం రాష్ట్రానికి వ‌దిలేసింది. 1) నిర్వాసితుల‌కు ఇచ్చే ప‌రిహారం. 2) పున‌రావాసం. ఈ రెండు విష‌యాల‌ను కూడా.. కేంద్రం చేయ‌లేమ‌ని చెప్పింది. వాస్త‌వానికి ఈ రెండు విష‌యాలే పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్త‌య్యేందుకు ప్ర‌ధాన ప్ర‌తిబంధ‌కంగా మారాయి. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం తొలిద‌శ‌లో 6 వేల కోట్ల‌ను కేటాయిస్తున్న‌ట్టు చెప్పింది.

కానీ.. ఈనిధుల‌ను బడ్జ‌ట్‌లో ప్ర‌క‌టించ‌లేదు. దీంతో పున‌రావాసానికి తొలిద‌శలో చేసే సాయంపై ప్ర‌క‌ట‌న‌లే మిగులుతున్నాయి. మ‌రోవైపు.. ఇప్ప‌టికే ఆల‌స్య‌మైనందున 12 శాతం వ‌డ్డీతో క‌లిపి త‌మ‌కు న‌ష్ట ప‌రిహారం ఇవ్వాల‌ని నిర్వాసితులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై ఇంకా ప‌రిష్కారం ల‌భించ‌లేదు. ఇదిలావుంటే.. పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో కేంద్రం రెండు ర‌కాల వ్యూహాలు అనుస‌రిస్తోంది. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాలు పోల‌వ‌రంపై అభ్యంత‌రం తెలిపాయి.

తెలంగాణ ప్ర‌భుత్వం.. పోల‌వ‌రంలోని విలీన మండ‌లాల‌ను త‌మ‌కు ఇచ్చేయాల‌ని సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఇది బీఆర్ ఎస్ హ‌యాంలోనే వేసిన పిటిష‌న్‌. దీనిపైకేంద్రం ఇప్ప‌టికీఅఫిడ‌విట్ వేయ‌లేదు. పైగా.. విచార‌ణ కూడా ప్రారంభం కాలేదు. మ‌రోవైపు ఒడిశా ప్ర‌భుత్వం ముంపు ప్రాంతాల అంశాన్ని, ఛ‌త్తీస్‌గ‌ఢ్ కూడా.. త‌మ ప్రాంతాలు మునిగిపోతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ రెండు స‌మ‌స్య‌లు తెర‌మీద‌క నిపిస్తున్న ప్ర‌ధాన అంశాలు.

వీటిపై కేంద్రం జోక్యం చేసుకుని ప‌రిష్క‌రించాల్సి ఉంది. ఇదే విష‌యాన్ని గతంలో వైసీపీ స‌ర్కారు కూడా ప్ర‌స్తావించింది. కానీ.. ప‌రిష్కారం కాలేదు. ఇప్ప‌డు కూడా అదే స‌మ‌స్య వెంటాడుతోంది. సో.. ఎలా చూసుకున్నా.. పోల‌వ‌రం పూర్త‌వ‌డం మంచిదే అయినా.. ఈ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాకుండా.. అడుగులు ముందుకు ప‌డ‌డం అనేది సాధ్య‌మేనా? అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

This post was last modified on March 29, 2025 5:16 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

1 hour ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

9 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

10 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

10 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

12 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

12 hours ago