Political News

సిసలైన ప్రజాస్వామ్యానికి ప్రతీక తెలంగాణ అసెంబ్లీ

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. గతంలో ఎన్నడూ లేనంత వాడీవేడీగా సాగిన ఈ సమావేశాల్లో చాలా అంశాలపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై అసెంబ్లీలో కూలంకష చర్చలు జరిగాయి. పలు జాతీయ అంశాలపైనా అసెంబ్లీ తీర్మానాలను ఆమోదించింది. అదే సమయంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ల మద్య మాటల తూటాలు పేలాయి. ఇక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ దిశగానూ వాగ్వాదాలూ చోటుచేసుకున్నాయి. ఇన్నేసి చర్చలు, పోట్లాటలు జరిగినా…తమను ఎన్నుకున్న ప్రజల సమస్యల కోసం ఆయా పార్టీ సభ్యులు యత్నిస్తే… వారి యత్నాలను పార్టీలను పక్కనపెట్టి మరీ కాంగ్రెస్ కూడా స్వాగతించింది. ఫలితంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయన్న మాట ఒకింత గట్టిగానే వినిపిస్తోంది.

దేశ రాజకీయాల్లో ఆది నుంచి కమ్మూనిస్టులు, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది. అయితే తెలంగాణ అసెంబ్లీలో ఈ రాజకీయ వైరుధ్యాన్ని పక్కనపెట్టేసిన సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావుతో బీజేపీ సభ్యుడు ఏలేటి మహేశ్వరరెడ్డి ముచ్చట్లలో మునిగిపోయారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య నిత్యం అటు బయటా, ఇటు సభ లోపలా మాటల యుద్దం జరుగుతున్నా… తన నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం పార్టీని, పార్టీతో పాటు వచ్చిన వైరధ్యాన్ని పక్కనపెట్టేసిన బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ నేరుగా మంత్రి సీతక్క పక్కకెళ్లి మరీ కూర్చుని తన సమస్యలను ఏకరువు పెట్టారు. తన వద్దకు వచ్చిన శంకర్ పార్టీని చూడని సీతక్క కూడా… శంకర్ చెప్పిన అంశాలను నోట్ చేసుకుంటూ… వాటిని పరిశీలిస్తూ కనిపించారు.

ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యల మధ్య ఈ సమావేశాల్లో ఏ స్థాయిలో మాటల యుద్ధం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, రేవంత్ వర్సెస్ హరీశ్, కేటీఆర్ వర్సెస్ మంత్రులు.. ఇలా ఇరు పార్టీల మధ్య ఆయా అంశాలపై ఓ రేంజిలో మాటల యద్ధం జరిగింది. చివరి రోజు సమావేశాల్లో రేవంత్, కేటీఆర్ ల మధ్య సాగిన వాదోపవాదాలు బిగ్ ఫైట్ ను తలపించాయి. అయితే ఇవేవీ తమ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి అడ్డు రాకూడదన్న భావనతో బీఆర్ఎస్, అందుకు తాము కూడా రెడీనేనని కాంగ్రెస్ ముందుకు సాగడంతో పలు ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి.

సీతక్కతో పల్లా రాజేశ్వరరెడ్డి కలిసి కూర్చుని మాట్లాడితే.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నవ్వుతూ తుళ్లుతూ హుషారుగా కనిపించారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావుతో బీఆర్ఎస్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో గంగుల కమలాకర్ కనిపించారు. ఇక హరీశ్ రావు అయితే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రి శ్రీధర్ బాబతోనూ కలిసి చర్చలు జరుపుతూ కనిపించారు. ఈ భేటీల్లో ఆయా నేతల మధ్య ఎలాంటి భేషజాలు గానీ..వీరెందుకు తన వద్దకు వచ్చారని మంత్రులు గానీ, వీరి వద్దకు రావాల్సివచ్చిందన్న భావన ఆయా పార్టీల సభ్యులకు గానీ అనిపించిన దాఖలానే కనిపించలేదు.

This post was last modified on March 28, 2025 8:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

42 minutes ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

1 hour ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

1 hour ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

2 hours ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

2 hours ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

4 hours ago