Political News

2027 జూన్ నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు… ఏపీకి జీవనాడి. జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం అలా కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత లేదు. కేంద్రం నుంచి ఇతోదిక సహకారం కూడా లబిస్తోంది. అయినా కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది. ఈ ప్రాజెక్టును టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం పరిశీలించారు. ప్రాజెక్టు అదికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ఓ కీలక ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టును 2007 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. 2019 ఎన్నికల్లో తిరిగి టీడీపీకే అధికారం దక్కి ఉండి ఉంటే… 2020లోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయి ఉండేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ ఎన్నికల్లో అదికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కారు నిష్క్రియాపరత్వం కారణంగాను 2025 వచ్చినా ప్రాజెక్టు ఇంకా నిర్మాణ దశలోనే ఉండిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాము అదికారంలోకి వచ్చిన ఈ 9 నెలల కాలంలో పలు రకాల చర్యలతో పోలవరం ప్రాజెక్టు పనులను తిరిగి గాడిలో పెట్టామని చంద్రబాబు అన్నారు. ఇకపై ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతాయన్నారు. కేంద్రం నుంచి కూడా ఆశించిన మేర సహకారం లబిస్తోందని ఆయన చెప్పారు. నిర్వాసితులకు ఇఫ్పటికే పరిహారం పంపిణీ చేశామన్నారు. వైసీపీ హయాంలో పరిహారంపై మాట మాత్రంగా చెప్పారని… అయితే పరిహారం మాత్రం పంపిణీ కాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో అన్నింటా నిబద్ధతతో వ్యవహరించింది తామేనని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా చంద్రబాబు ప్రాజెక్టు నిర్వాసితులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తమకు పరిహారం అందిన విషయాన్ని నిర్వాసితులు చంద్రబాబుకు తెలియజేశారు. పునరావాస కాలనీల్లోనూ అన్ని ఏర్నాట్లు అద్భుతంగా ఉన్నాయని వారు సంతోషం వెలిబుచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడే పోలవరం నిర్వాసితులకు టీడీపీ ప్రభుత్వం రూ.4,311 కోట్ల పరిహారాన్ని అందించింది. తాజాగా ఇటీవలే ఒకే ఒక్క రోజులో పోలవరం నిర్వాసితులకు రూ.830 కోట్లను వారి ఖాతాల్లో వేసింది. ఇవే విషయాలను ప్రస్తావించిన చంద్రబాబు… మిగిలిపోయిన పరిహారం నిధులను కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. పరిహారం పూర్తి అయ్యాకే ప్రాజెక్టును ప్రారంభిస్తానని కూడా చంద్రబాబు పేర్కొన్నారు.

This post was last modified on March 27, 2025 9:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

6 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

7 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

8 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

8 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

9 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

10 hours ago