Political News

2027 జూన్ నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు… ఏపీకి జీవనాడి. జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం అలా కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత లేదు. కేంద్రం నుంచి ఇతోదిక సహకారం కూడా లబిస్తోంది. అయినా కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది. ఈ ప్రాజెక్టును టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం పరిశీలించారు. ప్రాజెక్టు అదికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ఓ కీలక ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టును 2007 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. 2019 ఎన్నికల్లో తిరిగి టీడీపీకే అధికారం దక్కి ఉండి ఉంటే… 2020లోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయి ఉండేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ ఎన్నికల్లో అదికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కారు నిష్క్రియాపరత్వం కారణంగాను 2025 వచ్చినా ప్రాజెక్టు ఇంకా నిర్మాణ దశలోనే ఉండిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాము అదికారంలోకి వచ్చిన ఈ 9 నెలల కాలంలో పలు రకాల చర్యలతో పోలవరం ప్రాజెక్టు పనులను తిరిగి గాడిలో పెట్టామని చంద్రబాబు అన్నారు. ఇకపై ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతాయన్నారు. కేంద్రం నుంచి కూడా ఆశించిన మేర సహకారం లబిస్తోందని ఆయన చెప్పారు. నిర్వాసితులకు ఇఫ్పటికే పరిహారం పంపిణీ చేశామన్నారు. వైసీపీ హయాంలో పరిహారంపై మాట మాత్రంగా చెప్పారని… అయితే పరిహారం మాత్రం పంపిణీ కాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో అన్నింటా నిబద్ధతతో వ్యవహరించింది తామేనని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా చంద్రబాబు ప్రాజెక్టు నిర్వాసితులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తమకు పరిహారం అందిన విషయాన్ని నిర్వాసితులు చంద్రబాబుకు తెలియజేశారు. పునరావాస కాలనీల్లోనూ అన్ని ఏర్నాట్లు అద్భుతంగా ఉన్నాయని వారు సంతోషం వెలిబుచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడే పోలవరం నిర్వాసితులకు టీడీపీ ప్రభుత్వం రూ.4,311 కోట్ల పరిహారాన్ని అందించింది. తాజాగా ఇటీవలే ఒకే ఒక్క రోజులో పోలవరం నిర్వాసితులకు రూ.830 కోట్లను వారి ఖాతాల్లో వేసింది. ఇవే విషయాలను ప్రస్తావించిన చంద్రబాబు… మిగిలిపోయిన పరిహారం నిధులను కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. పరిహారం పూర్తి అయ్యాకే ప్రాజెక్టును ప్రారంభిస్తానని కూడా చంద్రబాబు పేర్కొన్నారు.

This post was last modified on March 27, 2025 9:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

20 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago