Political News

జనసేన సత్తా.. కాకినాడ రూరల్ ఎంపీపీ కైవసం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటింది. వైసీపీకి గట్టి పట్టున్న కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) పదవిని జనసేన కైవసం చేసుకుంది. అది కూడా ఈ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసేలా వ్యూహం రచించి పక్కాగా అమలు చేసి సత్తా చాటింది. ఫలితంగా కాకినాడ రూరల్ ఎంపీపీగా జనసేనకు చెందిన అనంత లక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనసేన దెబ్బకు వైసీపీకి ఈ మండల పరిషత్ లో మెజారిటీ ఉన్నా గానీ… ఎంపీపీ ఎన్నికకు డుమ్మా కొట్టక తప్పలేదు.

వైసీపీ అధికారంలో ఉండగా.. 2021లో ఏపీ వ్యాప్తంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగగా… రాష్ట్రంలోని మెజారిటీ స్థానాలన్నీ వైసీపీ ఖాతాలోనే పడిపోయాయి. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి రావడంతో పరిస్థితి మారిపోయింది. ఎక్కడికక్కడ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధలు వైసీపీని వీడి కూటమి పార్టీల్లో చేరిపోయారు. ఇలాగే కాకినాడ రూరల్ మండల పరిధిలో ఏకంగా ఏడుగురు వైసీపీ ఎంపీటీసీలు జనసేన గూటికి చేరారు. అయినా వైసీపీకి ఇంకా 8 మంది ఎంపీటీసీలు ఉన్నారు.

ఈ క్రమంలో గురువారం కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నిక జరగగా… జనసేన రచించిన వ్యూహం వర్కవుట్ అయ్యింది. జనసేనకు చెందిన ఏడుగురు ఎంపీటీసీలు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకోగా… వైసీపీకి చెందిన ఎంపీటీసీలు ఆ ఛాయలకే రాలేకపోయారు. కారణమేమిటో తెలియదు గానీ… వైసీపీకి చెందిన ఎంపీటీసీలు ఈ ఎన్నికకు దూరంగా ఉండిపోయారు. దీంతో టీడీపీ ఎంపీటీసీల మద్దతుతో జనసేన అభ్యర్థి అనంత లక్ష్మీ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అదికారి కీలక ప్రకటన చేశారు.

వాస్తవంగా కాకినాడ రూరల్ వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు పట్టున్న నియోజకవర్గం.2009లో. ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కన్నబాబు… 2019లో వైసీపీ తరఫున కూడా ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఇక కాకినాడ సిటీ నుంచి వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కన్నబాబుకు చేదోడు వాదోడుగా ఉన్నారు. ఇద్దరు బలమైన నేతలు ఉన్న వైసీపీని కాకినాడ రూరల్ లో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తనదైైన వ్యూహంతో చిత్తు చేసిన తీరుపై ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on March 27, 2025 2:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

42 minutes ago

చావానే టార్గెట్… అంత సీన్ లేదు రాజా

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…

1 hour ago

తరుణ్ క్యాలికులేషన్ ఎక్కడ తప్పుతోంది

పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…

3 hours ago

ప్యాన్ ఇండియా ‘డెవిల్’ టాక్ ఏంటి

మనకు డెవిల్ అంటే ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ సినిమా గుర్తొస్తుంది కానీ ఇటీవలే కన్నడలో విడుదలైన భారీ…

4 hours ago

మెగా ఛాన్స్ వదిలేసిన విశ్వంభర

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ఫలితాన్ని విశ్వంభర క్యాష్ చేసుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడం అభిమానులను బాధ…

4 hours ago

హార్దిక్ పాండ్య ఏం సాధించాడు?

గత కొన్నేళ్లలో మోస్ట్ అన్ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా హార్దిక్ పాండ్య పేరు…

5 hours ago