Political News

జగన్ పెద్దమ్మ సుశీలమ్మ మృతి

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య కారణాల రీత్యా జగన్ పెద్దమ్మ సుశీలమ్మ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 85 ఏళ్ల వయసున్న సుశీలమ్మ వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా సతమతమవుతున్నారు. చాలా కాలంగా ఆమె పులివెందులలోని ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితమే సుశీలమ్మను పరామర్శించే నిమిత్తం ఆమె చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రికి వెళ్లి మరీ ఆమెను పలకరించారు.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నయ్య ఆనంద్ రెడ్డి సతీమణే సుశీలమ్మ. ఆనంద్ రెడ్డి ఇదివరకే మృతి చెందారు. తాజాగా సుశీలమ్మ మృతి చెందారు. గురువారం పులివెందులలోనే ఆమె అంత్యక్రియలు జరిగే అవకాశాలున్నాయి. సుశీలమ్మ అంత్యక్రియలకు జగన్ కూడా హాజరు కానున్నారు. దీంతో గురువారం మరోమారు ఆయన పులివెందుల వెళ్లనున్నారు. ఇటీవలే తన దగ్గరి బంధువు చనిపోవడంతో బెంగళూరు నుంచి నేరుగా పులివెందుల వచ్చిన జగన్.. పనిలో పనిగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించారు.

ఇటీవలి కాలంలో జగన్ బంధువర్గంలో వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది చివరలో జగన్ సోదరుడు అభిషేక్ రెడ్డి చనిపోయిన సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే అభిషేక్ రెడ్డి మృతి చెందడం వైఎస్ ఫ్యామిలీని తీవ్ర విషాధంలో ముంచేసింది. తాజాగా ఇటీవలే జగన్ బాబాయి, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ మృతి చెందిన సంగతి తెలిసిందే. పిచ్చమ్మ భౌతిక కాయానికి నివాళి అర్పించేందుకు జగన్ ఇటీవలే ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు సమీపంలోని మేదరమెట్లకు వెళ్లిన సంగతి తెలిసిందే.

This post was last modified on March 27, 2025 12:22 am

Share

Recent Posts

కల్ట్ మూవీ… ఏదో అనుకుంటే

కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…

8 hours ago

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం…

9 hours ago

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

10 hours ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

10 hours ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

11 hours ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

11 hours ago