ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియాలో బుధవారం సాయంత్రం ఓ వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అంతేనా దానిని చూసిన వారంతా ఏపీ పోలీసు శాఖ తీరును అభినందించకుండా ఉండలేకపోతున్నారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందుబాటులోకి తీసుకువచ్చిన డ్రోన్ టెక్నాలజీని పోలీసు శాఖ ఇంత బాగా వినియోగించుకుంటుందా? అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫలితంగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయినా అనిత పోస్టు చేసిన ఈ వీడియోలో ఏముందన్న విషయానికి వస్తే… అది విజయనగరం జిల్లా కేంద్రంలోని ఓ మారుమూల ప్రాంతం. వాహనాల గ్యారేజీ. పని లేని లారీలను పార్క్ చేసిన ప్రాంతమది. పోలీసుల కళ్లుగప్పి పేకాట ఆడేందుకు అక్కడి పేకాటరాయుళ్లు.. ఆ ప్రాంతంలో నిలిపిన లారీని తమ వేదిక చేసుకున్నారు. పార్క్ చేసిన లారీని వారంతా ఎక్కారు. చుట్టూ లారీకున్న ట్రాలీ అంచులు వారిని బయటి వారికి కనిపించకుండా చేశాయి. ఇంకేముంది… తమను ఎవరూ గుర్తించలేరని బావించిన పేకాటరాయుళ్లు ఆటలో మునిగిపోయారు.
అయితే ఏపీ పోలీసులు ఇప్పుడు ఎక్కడికక్కడ అసాంఘీక కార్యకలాపాలకు చెక్ పెట్టే దిశగా డ్రోన్ లను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అందులో బాగంగా ఈ లారీలో పేకాటరాయుళ్లను డ్రోన్లు గుర్తించాయి. అంతే… ఓ జీపులో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వచ్చీరావడంతోనే ఏదో ఆపరేషన్ కు వెళ్లినట్లుగా చకచకా జీపులో నుంచి దిగిపోయి… లారీని చుట్టుముట్టారు. నలుదిక్కుల నుంచి లారీ ట్రాలీని ఎక్కేశారు. అయినా కూడా పేకాటరాయుళ్లు తమ క్రీడావిలాసంలో మునిగే ఉన్నారు. పోలీసులంతా చుట్టుముట్టిన తర్వాత గానీ.. తాము పట్టుబడిపోయామని వారు గుర్తించలేకపోయారు.
పేకాటరాయుళ్లను ఎంచక్కా ఒక్కొక్కరిగానే కిందకు దించిన పోలీసులు వారిని జాగ్రత్తగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆపై కేసులూ నమోదు చేశారు. మొన్నామధ్య పొలాల్లో, నిర్జన ప్రదేశాల్లో మద్యం తాగుతూ సేద దీరిన వారు డ్రోన్లను చూసి పరుగులు పెట్టిన దృశ్యాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పేకాటరాయుళ్లకూ డ్రోన్ల సహాయంతోనే పోలీసులు చెక్ పెడుతున్న తీరును అభినందించిన మంత్రి… ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంటే.. ఇక ఎలాంటి ప్రదేశంలో పేకాట ఆడాలన్నా కూడా పేకాటరాయుళ్లు జడుసుకుని తీరాల్సిందే.
This post was last modified on March 26, 2025 9:56 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…