ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియాలో బుధవారం సాయంత్రం ఓ వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అంతేనా దానిని చూసిన వారంతా ఏపీ పోలీసు శాఖ తీరును అభినందించకుండా ఉండలేకపోతున్నారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందుబాటులోకి తీసుకువచ్చిన డ్రోన్ టెక్నాలజీని పోలీసు శాఖ ఇంత బాగా వినియోగించుకుంటుందా? అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫలితంగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయినా అనిత పోస్టు చేసిన ఈ వీడియోలో ఏముందన్న విషయానికి వస్తే… అది విజయనగరం జిల్లా కేంద్రంలోని ఓ మారుమూల ప్రాంతం. వాహనాల గ్యారేజీ. పని లేని లారీలను పార్క్ చేసిన ప్రాంతమది. పోలీసుల కళ్లుగప్పి పేకాట ఆడేందుకు అక్కడి పేకాటరాయుళ్లు.. ఆ ప్రాంతంలో నిలిపిన లారీని తమ వేదిక చేసుకున్నారు. పార్క్ చేసిన లారీని వారంతా ఎక్కారు. చుట్టూ లారీకున్న ట్రాలీ అంచులు వారిని బయటి వారికి కనిపించకుండా చేశాయి. ఇంకేముంది… తమను ఎవరూ గుర్తించలేరని బావించిన పేకాటరాయుళ్లు ఆటలో మునిగిపోయారు.
అయితే ఏపీ పోలీసులు ఇప్పుడు ఎక్కడికక్కడ అసాంఘీక కార్యకలాపాలకు చెక్ పెట్టే దిశగా డ్రోన్ లను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అందులో బాగంగా ఈ లారీలో పేకాటరాయుళ్లను డ్రోన్లు గుర్తించాయి. అంతే… ఓ జీపులో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వచ్చీరావడంతోనే ఏదో ఆపరేషన్ కు వెళ్లినట్లుగా చకచకా జీపులో నుంచి దిగిపోయి… లారీని చుట్టుముట్టారు. నలుదిక్కుల నుంచి లారీ ట్రాలీని ఎక్కేశారు. అయినా కూడా పేకాటరాయుళ్లు తమ క్రీడావిలాసంలో మునిగే ఉన్నారు. పోలీసులంతా చుట్టుముట్టిన తర్వాత గానీ.. తాము పట్టుబడిపోయామని వారు గుర్తించలేకపోయారు.
పేకాటరాయుళ్లను ఎంచక్కా ఒక్కొక్కరిగానే కిందకు దించిన పోలీసులు వారిని జాగ్రత్తగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆపై కేసులూ నమోదు చేశారు. మొన్నామధ్య పొలాల్లో, నిర్జన ప్రదేశాల్లో మద్యం తాగుతూ సేద దీరిన వారు డ్రోన్లను చూసి పరుగులు పెట్టిన దృశ్యాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పేకాటరాయుళ్లకూ డ్రోన్ల సహాయంతోనే పోలీసులు చెక్ పెడుతున్న తీరును అభినందించిన మంత్రి… ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంటే.. ఇక ఎలాంటి ప్రదేశంలో పేకాట ఆడాలన్నా కూడా పేకాటరాయుళ్లు జడుసుకుని తీరాల్సిందే.
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…
కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…
జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…
కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…