తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. ప్రభుత్వ వాదనలకు విపక్షాల నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి. ఆ కౌంటర్లకు అధికార పక్షం నుంచి కూడా రీ కౌంటర్లు పడిపోతున్నాయి. చర్చలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాటి సమావేశాల్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అది కూడా భాషా సంబంధిత అంశం కావడం గమనార్హం. మంత్రి సీతక్క, మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీల మధ్య ఓ మోస్తరు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అక్బరుద్దీన్.. ”సీతక్కకు ఉర్దూ రాదు, నాకు తెలుగు రాదు”అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తెలుగు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశాయని చెప్పాలి.
మజ్లిస్ పార్టీ హైదరాబాదులోని పాతబస్తీ కేంద్రంగా రాజకీయం చేస్తోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా…హైదరాబాద్ లోక్ సభ సీటుతో పాటుగా దాని పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో ఆ పార్టీనే విజయం సాధిస్తూ వస్తోంది. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ తో పాటు అక్బరుద్దీన్ లు ఉన్నత విద్యావంతులు. ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ లలో వారు అనర్గళంగా మాట్లాడతారు. ఏ అంశంపై అయినా వారు ఈ మూడు బాషల్లో మాట్లాడుతుంటే… ఇట్టే చెవులు అప్పగించి మరీ వినాలనిపిస్తుంది. అలాంటిది ఆ ఇద్దరు నేతలతో పాటుగా మజ్లిస్ కు చెందిన చాలా మంది నేతలకు తెలుగు రాదు. ఈ విషయంలో అసదుద్దీన్ ఒకింత ఫరవా లేదనిపించినా… అక్బరుద్దీన్ మాత్రం తెలుగు అస్సలు మాట్లాడలేరు. తెలుగును అర్థం చేసుకోనూ లేరు.
ఇక బుధవారం నాటి ఘటన విషయానికి వస్తే…ప్రభుత్వ పథకాల గురించి అక్బరుద్దీన్ పలు అంశాలను లేవనెత్తారు. ఈ సందర్బంగా ఆయన ప్రశ్నలకు మంత్రి సీతక్క నుంచి అంతగా సరైన సమాధానం రాలేదే, ఏమో తెలియదు గానీ… సీతక్క తీరును అక్బర్ నిరసించారు. తాను ఒకటి అడిగితే..మంత్రిగారు ఇంకొకటి చెబుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగానే ఆయన ”సీతక్కకు ఉర్దూ రాదు, నాకు తెలుగు రాదు”అంటూ వ్యాఖ్యానిచారు. ఈ వ్యాఖ్యలకు సీతక్క కూడా స్పాంటేనియస్ గా స్పందించారు. తనకు ఇంగ్లీష్ రాదని, ఉర్దూ కూడా రాదని తేల్చి చెప్పారు. ఎక్కడో అడవుల్లో, గూడేంలో పుట్టి పెరిగిన తనకు తెలుగు మాత్రమే వచ్చునని ఆమె తెలిపారు. అయినంత మాత్రాన ఆయా విషయాలు తనకు తెలియవా? అంటూ ఆమె అక్బర్ కు కౌంటర్ ఇచ్చారు. ఇక ఈ సంభాషణలను విన్న నెటిజన్లు… అక్బర్ కు తెలుగు రాని విషయాన్ని ఒకింత లైటర్ వేలో ప్రశ్నించారు.
This post was last modified on March 26, 2025 9:52 pm
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడైన హరీష్ శంకర్.. ఇంటర్వ్యూల్లో సినిమా సంగతులు చాలా మాట్లాడతారు కానీ.. వ్యక్తిగత విషయాల గురించి…
హైదరాబాద్కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తామని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని.. దీంతో…
శ్రీవిశ్వావసు నామ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించారు.…
ఇవాళ సల్మాన్ ఖాన్ సికందర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ప్రమోషనల్ కంటెంట్ బజ్ ని పెంచలేకపోయినా కండల వీరుడి మాస్…
ఏపీ సీఎం చంద్రబాబు ఉగాదిని పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు వారి పండుగలలో ప్రధంగా వచ్చే ఉగాదిని పురస్కరించుకుని…
నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఇకపై ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశమే లేదు. అంతేనా… అమరావతిని ఏపీకి రాజధానిగా…