తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. ప్రభుత్వ వాదనలకు విపక్షాల నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి. ఆ కౌంటర్లకు అధికార పక్షం నుంచి కూడా రీ కౌంటర్లు పడిపోతున్నాయి. చర్చలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాటి సమావేశాల్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అది కూడా భాషా సంబంధిత అంశం కావడం గమనార్హం. మంత్రి సీతక్క, మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీల మధ్య ఓ మోస్తరు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అక్బరుద్దీన్.. ”సీతక్కకు ఉర్దూ రాదు, నాకు తెలుగు రాదు”అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తెలుగు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశాయని చెప్పాలి.
మజ్లిస్ పార్టీ హైదరాబాదులోని పాతబస్తీ కేంద్రంగా రాజకీయం చేస్తోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా…హైదరాబాద్ లోక్ సభ సీటుతో పాటుగా దాని పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో ఆ పార్టీనే విజయం సాధిస్తూ వస్తోంది. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ తో పాటు అక్బరుద్దీన్ లు ఉన్నత విద్యావంతులు. ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ లలో వారు అనర్గళంగా మాట్లాడతారు. ఏ అంశంపై అయినా వారు ఈ మూడు బాషల్లో మాట్లాడుతుంటే… ఇట్టే చెవులు అప్పగించి మరీ వినాలనిపిస్తుంది. అలాంటిది ఆ ఇద్దరు నేతలతో పాటుగా మజ్లిస్ కు చెందిన చాలా మంది నేతలకు తెలుగు రాదు. ఈ విషయంలో అసదుద్దీన్ ఒకింత ఫరవా లేదనిపించినా… అక్బరుద్దీన్ మాత్రం తెలుగు అస్సలు మాట్లాడలేరు. తెలుగును అర్థం చేసుకోనూ లేరు.
ఇక బుధవారం నాటి ఘటన విషయానికి వస్తే…ప్రభుత్వ పథకాల గురించి అక్బరుద్దీన్ పలు అంశాలను లేవనెత్తారు. ఈ సందర్బంగా ఆయన ప్రశ్నలకు మంత్రి సీతక్క నుంచి అంతగా సరైన సమాధానం రాలేదే, ఏమో తెలియదు గానీ… సీతక్క తీరును అక్బర్ నిరసించారు. తాను ఒకటి అడిగితే..మంత్రిగారు ఇంకొకటి చెబుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగానే ఆయన ”సీతక్కకు ఉర్దూ రాదు, నాకు తెలుగు రాదు”అంటూ వ్యాఖ్యానిచారు. ఈ వ్యాఖ్యలకు సీతక్క కూడా స్పాంటేనియస్ గా స్పందించారు. తనకు ఇంగ్లీష్ రాదని, ఉర్దూ కూడా రాదని తేల్చి చెప్పారు. ఎక్కడో అడవుల్లో, గూడేంలో పుట్టి పెరిగిన తనకు తెలుగు మాత్రమే వచ్చునని ఆమె తెలిపారు. అయినంత మాత్రాన ఆయా విషయాలు తనకు తెలియవా? అంటూ ఆమె అక్బర్ కు కౌంటర్ ఇచ్చారు. ఇక ఈ సంభాషణలను విన్న నెటిజన్లు… అక్బర్ కు తెలుగు రాని విషయాన్ని ఒకింత లైటర్ వేలో ప్రశ్నించారు.
This post was last modified on March 26, 2025 9:52 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…