వైసీపీలో అందగాళ్లంతా కూటమి సర్కారుకు టార్గెట్ గా మారుతున్నారంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను విజయవాడ జైలులో పరామర్శించిన తర్వాత జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యల మాటేమిటో గానీ…దళిత యువకుడు కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టై జైలులో కాలం వెళ్లదీస్తున్న వంశీ… నెల తిరక్కుండానే పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయారు.
తాజాగా మంగళవారం కోర్టు వాయిదాకు జైలు నుంచి బయటకు వచ్చిన వంశీ మరింత నీరసించినట్టుగా కనిపించారు. అంతేకాకుండా ఆయన ముక్కుపై ఓ గాయం కూడా కనిపించింది. ముక్కుపై భాగంలో ఏ మేర గాయం అయిందో తెలియదెు గానీ… దానిపై ఓ తెలుగు రంగ ఆయింట్ మెంట్ అయితే పూసుకున్నట్లుగా స్ఫష్టంగా కనిపించింది. జైలులో ఉంటున్న వంశీకి పెద్దగా పనులేమీ ఉండవు కదా. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను భద్రతా కారణాల రీత్యా ఆయనను ప్రత్యేకంగా ఓ బ్యారక్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో ఆయనపై జైలులో దాడి జరగడానికే ఆస్కారం లేదు. అయినా గానీ ఆయన ముక్కుపై ఆయింట్ మెంట్ కనిపించిన తీరు ఆసక్తి రేకెత్తించింది.
బయట తిరిగినంత కాలం ఆరోగ్యంగా కనిపించిన వంశీ… జైలులోకి వెళ్లగానే తనకున్న అనారోగ్య సమస్యలన్నింటినీ ఆయన బయటపెట్టక తప్పలేదు. జైలులో ప్రత్యేక వసతుల కోసం పిటిషన్ వేసిన సందర్బంగా ఆయన తన అనారోగ్య సమస్యలను కోర్టు ముందు పెట్టారు ఓ మోస్తరుగా ప్రత్యేక వసతులను కూడా పొందారు. అయినా గానీ… ఆయన ముక్కుకు ఏమైందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on March 26, 2025 9:46 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…