Political News

బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సీరియస్ విచారణకు సిట్ సిద్ధం!

తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కలకలం కొనసాగుతూనే ఉంది. యువతను ఫైనాన్స్ దోపిడీ దిశగా నెట్టేసిన ఈ యాప్స్ కారణంగా ఇప్పటికే ఎంతో మంది జీవితాలు నాశనమవుతున్నాయి. సెలబ్రిటీల ప్రమోషన్లు, యూట్యూబర్ల స్వార్థపు లాభాల కోసం జరుగుతున్న ఈ ప్రకటనల వలన అమాయకులు బలవుతుండటంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు జరిపించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్‌ పరిధిలో పలువురు ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. 11 మంది ప్రొమోటర్లపై కేసులు నమోదు కాగా, 25 మంది సెలబ్రిటీలపై సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. యూట్యూబ్ యాంకర్లు, సినిమా నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుఎన్సర్లపై విచారణ వేగంగా సాగుతోంది. కొంతమంది ఇప్పటికే పోలీసులు విచారణకు హాజరయ్యారు. మరికొంతమంది విదేశాలకు పారిపోయిన విషయం బయటపడటంతో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ పైన సీరియస్ గా చూస్తున్న ప్రభుత్వం, ఇకపై ఇలాంటి యాప్స్‌ను రూట్ లెవెల్ నుంచే అడ్డుకోవాలని నిర్ణయించింది. గతంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు ఈ యాప్స్ కారణం కావడం, యువత అప్పుల ఊబిలో చిక్కుకోవడం వంటి సంఘటనలు ప్రభుత్వ దృష్టికి వచ్చాయి. ఇందువల్లే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. టెక్నాలజీ, ఆర్థిక నేరాలపై అనుభవం ఉన్న అధికారులతో ఈ ప్రత్యేక బృందాన్ని రూపొందించనున్నారు.

ఇకపై బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన ప్రకటనలపై పక్కాగా నిఘా ఉంటుందని తెలుస్తోంది. పబ్లిక్ ఫిగర్స్ చేసే ప్రమోషన్లకు నియమాలు విధించే అవకాశం ఉంది. కేంద్రం, గూగుల్ వంటి సంస్థలతో కూడ సంబంధిత కమ్యూనికేషన్ జరిగేలా చర్యలు ప్రారంభమయ్యాయి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు, యాప్ వెనుక ఉన్న సంస్థల డిటైల్స్‌ను అన్వేషించేలా సిట్ దర్యాప్తు సాగనుంది. ఈ చర్యలతో బెట్టింగ్ మాఫియా అరాచకాలకు అడ్డుకట్ట పడుతుందనే నమ్మకంతో ప్రజలు చూస్తున్నారు.

Kumar

Recent Posts

టాలీవుడ్‌పై బాలీవుడ్ ఏడుపుకిది నిదర్శనం

ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…

46 minutes ago

జగన్ అటాక్ మోడ్ లోకి వచ్చినట్టేనా…?

ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…

1 hour ago

సీబీఎన్ @ 361 డిగ్రీస్..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పాల‌న‌, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగులు, భ‌విష్య‌త్తు ఆంధ్ర ప్ర‌దేశ్ నిర్మాణం.. వంటి ప‌లు…

2 hours ago

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

4 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

4 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

4 hours ago