Political News

మంత్రివ‌ర్గంలో మాకు చోటేదీ: కాంగ్రెస్‌లో కొత్త‌ చిచ్చు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో కొత్త చిచ్చు తెర‌మీదికి వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గాన్ని విస్తరించాల‌ని పార్టీ అధిష్టానం నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. దీనిపై ఇప్ప‌టికే ప‌క్కా క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఏప్రిల్ 3వ తేదీన ముహూర్తం పెట్టిన‌ట్టు కూడా చ‌ర్చ‌సాగుతోంది. దీంతో రేవంత్ రెడ్డి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఖాయంగా మారింది. అయితే.. ఈ విస్త‌ర‌ణ‌లో చోటు ద‌క్కించుకునేందుకు అనేక మంది ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే.. తాజాగా మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌లువురు నాయ‌కులు.. త‌మ‌కు కూడా చోటు ఇవ్వాలంటూ.. పార్టీ అధిష్టానానికి నేరుగా లేఖ సంధించారు. మాదిగ సామాజిక వ‌ర్గానికి అన్యాయం జ‌రుగుతోందని.. త‌మ‌కు న్యాయం చేయాల‌ని వారు ఆలేఖ‌లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన 32 ల‌క్ష‌ల మందికి పైగా ప్ర‌జ‌లు ఉన్నార‌ని.. వారికి అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఇత‌ర సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రులు త‌మ స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తెలిపారు.

ఈ నేప‌థ్యంలో త‌మ‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కాంగ్రెస్ అధిష్టానానికి మొర పెట్టుకున్నారు. వాస్త‌వానికి ప్ర‌స్తుతం ఒక‌రిద్ద‌రు మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు. మ‌రోవైపు.. ఇదే ఎస్సీ వ‌ర్గానికి చెందిన వివేక్ వెంక‌ట‌స్వామి పేరు కూడా మంత్రివ‌ర్గ జాబితాలో ఉన్న‌ట్టు స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ.. మాదిగ వ‌ర్గం ఎమ్మెల్యేలు ఇలా లేఖ రాయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. దీనివెనుక‌.. వివేక్ ఒత్తిడి ఉన్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

This post was last modified on March 26, 2025 6:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago