Political News

తెలంగాణ అసెంబ్లీలో ‘క‌మీష‌న్ కే’ దుమారం.. ఏం జ‌రిగింది?

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో అధికార, విప‌క్షాల మ‌ధ్య మాటల యుద్ధం సాగుతున్న విష‌యం తెలిసిందే. అనేక అంశాల‌పై ఇరు ప‌క్షాలు స‌వాళ్లు-ప్ర‌తిస‌వాళ్లు రువ్వుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత దుమారం రేపాయి. మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి.. ఆయ‌న ‘క‌మీష‌న్ కే’ అని సంబోధించారు. కేసీఆర్ పేరును పైకి చెప్ప‌కపోయినా.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ నాయ‌కులు నిప్పులు చెరిగారు.

స‌భ‌లో బీఆర్ఎస్ వ్య‌వ‌హార శైలిపై స్పందించిన ఆది శ్రీనివాస్‌.. త‌మ త‌మ స్థానాల్లో నిల‌బ‌డి నిర‌స‌న తెలిపే అవ‌కాశం ఉన్నా.. బీఆర్ ఎస్ స‌భ్యులు మాత్రం వెల్‌లోకి దూసుకు వెళ్లార‌ని ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఇదేం సంప్ర‌దాయ‌మ‌ని ప్ర‌శ్నించారు. ప‌దేళ్ల‌పాటు స‌భ‌ను న‌డిపిన బీఆర్ఎస్‌కు ఇంగితం లేదా? అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దీంతో బీఆర్ఎస్ స‌భ్యులు మ‌రింత రెచ్చిపోయారు. ఈ స‌మ‌యంలో కొంద‌రు ఆది వ్యాఖ్య‌ల‌ను త‌మ సెల్ ఫోన్ల‌లో రికార్డు చేసే ప్ర‌య‌త్నం చేశారు.

దీనిని తీవ్రంగా ఖండించిన ఆది.. స‌భ‌లో ఫొటోలు, వీడియోలు తీయ‌రాద‌న్న విష‌యాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావించారు. స‌భ‌లో ఫొటోలు తీసిన వారిని బ‌య‌ట‌కు పంపించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. అదేస‌మ‌యంలో క‌మీష‌న్‌-కే అంటూ.. ఆది ప్ర‌స్తావించారు. “అధ్య‌క్షా.. బీఆర్ఎస్ పాల‌న‌లో కొన్ని కోడ్ భాష‌లు ఉండేవి. క‌మీష‌న్ – కే అంటే.. కాళేశ్వ‌రం” అని వ్యాఖ్యానించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు కాద‌ని.. అది క‌మీష‌న్ ప్రాజెక్టు అని చాలా మంది చెప్పిన‌ట్టు తెలిపారు.

అంతేకాదు.. ‘క‌మీష‌న్ – కే.. అంటే క‌రెంటు కొనుగోళ్లు’ అని కూడా ఆదిఅన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పం దాల్లోనూ తినేశార‌ని అన్నారు. అదేవిదంగా క‌మీష‌న్ – కే అంటే కాక‌తీయ అని చెప్పారు. దీంతో బీఆర్ ఎస్ నాయ‌కులు ఎదురు దాడి చేశారు. ఫ‌లితంగా స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళం చెల‌రేగింది. స్పీక‌ర్ ప‌దే ప‌దే చెప్పినా.. బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ స‌భ్యులు ఒక‌రిపై ఒక‌రు నినాదాలు అరుపుల‌తో హోరెత్తించారు.

This post was last modified on March 26, 2025 6:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

3 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

5 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

5 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

5 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

7 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

8 hours ago