Political News

మోహన రంగా అరెస్టు.. వంశీకి ఇక కష్టమే

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ ఇక ఇప్పుడప్పుడే జైలు నుంచి బయటపడే అవకాశాలే లేదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం దళిత యువకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసులోనే అరెస్టు అయిన వంశీ. ఇకపై గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో పీలకల్లోతు కూరుకుపోయినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఓలుపల్లి మోహన రంగా అరెస్టు కావడమేనని చెప్పక తప్పదు. గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో మోహన రంగా ఏ1గా ఉన్నారు. రంగాను మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి.

వాస్తవంగా గన్నవరం టీడీపీ కార్యాలయం ద్వంసం కేసులో వంశీ నిందితుల జాబితాలో ఎక్కడో చివర ఉన్నారు. అంతే కాకుండా ఈ కేసు నమోదు అయినప్పుడు వంశీ అసలు నిందితుల జాబితాలోనే లేరు. ఆ తర్వాత ఆయన ప్రమేయాన్ని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు ఆయన పేరును చేర్చారు. ఈ కేేసులో తనను ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో వంశీ… కేసునే కొట్టివేయించే దిశగా అడుగులు వేశారు. ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుగా ఉన్న దళిత యువకుడు సత్యవర్ధన్ ను అపహరించి.. బెదిరించి, డబ్బులు ఇస్తామని మభ్యపెట్టి కేసు వాపస్ తీసుకునేలా ఒప్పించారు. అయితే ఈ విషయం బయటపడటంతో సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపల కేసులోనే వంశీ అరెస్టు ఆయ్యారు.

ఓ వైపు ఈ కిడ్నాప్ కేసును అలా నడిపిస్తూనే పోలీసులు గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసును బిగించే దిశగా వ్యూహాత్మకంగా సాగారు. కిడ్నాప్ కేసులో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సాగుతున్న పోలీసులు టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నిందితులను వరుసబెట్టి అరెస్టు చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రధాన నిందితుడు మోహన రంగాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగానే కాకుండా వంశీ కుడి భుజంగానూ వ్యవహరించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ లెక్కన మోహన రంగా అరెస్టుతో వంశీకి చెందిన దాదాపుగా అన్ని వ్యవహారాలకు సంబంధించిన కీలక సమాచారం తమకు లభించినట్టేనని పోలీసులు భావిస్తున్నారు.

ఇక టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసు కేంద్రంగాన వంశీ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. టీడీపీ నుంచే రాజకీయ ఓనమాలు నేర్చుకున్న వంశీ అదే కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఓ రేంజిలో ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వంశీ టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారుకు మెయిన్ టార్గెట్ గా మారిపోగా… ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన కీలక నిందితుడు అరెస్టు కావడం వంశీకి మరిన్ని చిక్కులు తప్పేలా లేవన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలన్న వంశీ పిటిషన్ పై వాదనలు ముగియగా… తీర్పు వాయిదా పడింది. ఇక కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ పై బుధవారం కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో మోహన రంగా అరెస్టుతో వంశీకి కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చినా… టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో మాత్రం బెయిల్ రావడం కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Satya

Recent Posts

‘దారులున్నాయి’ మాటలో అంత అర్థముందా

పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…

2 hours ago

హత్యలు చేసే డాక్టర్… చూసినట్టు ఉందే

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…

2 hours ago

సత్యదేవ్ ఆశలన్నీ బహదూర్ మీదే

ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…

2 hours ago

గూండా ఎమోషన్ గుర్తు చేసిన మెగాస్టార్

నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…

3 hours ago

పేరు చెబితే ల‌క్ష… స‌ర్కారు బంప‌ర్ ఆఫ‌ర్‌!

ప్ర‌భుత్వాలు చేప‌ట్టే కీల‌క కార్య‌క్ర‌మాల‌కు పేర్లు సూచించే వారికి బ‌హుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుక‌లు కూడా ఇస్తాయి. గ‌తంలో స్వ‌చ్ఛ…

6 hours ago

జ‌గ‌న్ నాన్చారు.. చంద్ర‌బాబు తేల్చారు: ఉద్యోగుల‌కు పండ‌గ‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో ఐదేళ్లు పాలించిన జ‌గ‌న్‌.. నానుస్తూ వ‌చ్చి.. చివ‌ర‌కు త‌న‌కు సాధ్యంకాద‌ని…

6 hours ago