ఏపీలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి రంగం సిద్ధం అయిపోయింది. 16 వేలకు పైగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ ఒకే దఫా భర్తీ చేసే దిశగా కూటమి సర్కారు ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసింది. ఈ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకూ రంగం సిద్ధం అయిపోయింది. ఈ విషయంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాటి కలెక్టర్ల సదస్సులో కీలక ప్రకటన చేశారు.
ఏప్రిల్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఇటివలే ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ ఆధారంగానే ఈ డీఎస్సీని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగానే నియామకాలు చేపడతామని వివరించారు. ఏది ఏమైనా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నూతన విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికి తప్పనిసరిగా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
వాస్తవానికి మార్చి నెలాఖరులోగానే డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి కూటమి సర్కారు రంగం సిద్ధం చేసింది. అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వివిధ వర్గాల నుంచి అందిన వినతులు, అదే సమయంలో వర్గీకరణపై నియమించిన కమిటీ నివేదిక అందజేత, అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలంగా ఆర్డినెన్స్ జారీ వంటి వరుస పరిణామాల కారణంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ తొలి వారానికి వాయిదా పడక తప్పలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినా కూడా కొత్త విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికే ఉపాధ్యాయ పోస్టుల భర్తీని పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత రాదనే చెప్పాలి.
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…