Political News

‘వర్గీకరణ’తోనే డీఎస్సీ… ఏప్రిల్ తొలివారంలో నోటిఫికేషన్

ఏపీలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి రంగం సిద్ధం అయిపోయింది. 16 వేలకు పైగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ ఒకే దఫా భర్తీ చేసే దిశగా కూటమి సర్కారు ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసింది. ఈ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకూ రంగం సిద్ధం అయిపోయింది. ఈ విషయంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాటి కలెక్టర్ల సదస్సులో కీలక ప్రకటన చేశారు.

ఏప్రిల్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఇటివలే ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ ఆధారంగానే ఈ డీఎస్సీని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగానే నియామకాలు చేపడతామని వివరించారు. ఏది ఏమైనా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నూతన విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికి తప్పనిసరిగా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

వాస్తవానికి మార్చి నెలాఖరులోగానే డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి కూటమి సర్కారు రంగం సిద్ధం చేసింది. అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వివిధ వర్గాల నుంచి అందిన వినతులు, అదే సమయంలో వర్గీకరణపై నియమించిన కమిటీ నివేదిక అందజేత, అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలంగా ఆర్డినెన్స్ జారీ వంటి వరుస పరిణామాల కారణంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ తొలి వారానికి వాయిదా పడక తప్పలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినా కూడా కొత్త విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికే ఉపాధ్యాయ పోస్టుల భర్తీని పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత రాదనే చెప్పాలి.

This post was last modified on March 25, 2025 11:20 am

Share
Show comments
Published by
Satya
Tags: mega DSC

Recent Posts

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

8 seconds ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

29 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

5 hours ago