Political News

చంద్ర‌బాబుకు ‘ఆద‌ర‌ణ’ జోష్ .. !

ఏపీ సీఎం చంద్ర‌బాబు చేప‌డుతున్న వినూత్న ప‌థ‌కాలు.. కార్య‌క్ర‌మాలు ఆయ‌న‌తోపాటు రాష్ట్రంలో పార్టీకి, ప్ర‌భుత్వానికి కూడా జోష్ పెంచుతున్నాయి. ఇప్ప‌టికే చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు.. ఇస్తున్న పింఛ‌న్లు, ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు వంటివి స‌ర్కారు గ్రాఫ్‌ను పైపైకి తీసుకువెళ్లాయి. ఇక‌, అన్నా క్యాంటెన్ల నిర్వ‌హ‌ణ‌తో స‌ర్కారు దూకుడుకు మ‌రిన్ని మంచి మార్కులు సైతం ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ప్ర‌జ‌ల నుంచి రెండు ర‌కాల డిమాండ్లు వినిపిస్తున్నాయి.

1) కులాల వారీగా వృత్తుల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం సాయం చేయ‌డం. 2) ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాల‌ను మంజూరు చేయడం. ఈ రెండు విష‌యాలు కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. త‌ర‌చుగా టీడీపీ నాయ‌కులు నిర్వహిస్తున్న ప్ర‌జాద‌ర్బార్‌లోనూ ఈ విష‌యాలపై విన‌తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా ప్ర‌భుత్వం ఆద‌ర‌ణ ప‌థ‌కంపై దృష్టి పెట్టింది. వృత్తుల్లో ఉన్న వివిధ సామాజిక వ‌ర్గాల‌కు సాయం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

2014-19 మ‌ధ్య ఆద‌ర‌ణ ప‌థ‌కాన్ని అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేసింది. ఏయే వృత్తుల్లో ఉన్న వారికి ఆయా వృత్తుల వారీగా సాయం అందించింది. ప‌నిముట్లు సైతం కొనిపెట్టింది. ఈ కార్య‌క్ర‌మానికి అప్పట్లో మంచి స్పంద‌న కూడా వ‌చ్చింది. ల‌క్ష‌లాది మంది వృత్తులు చేసుకునే వారికి ప్ర‌భుత్వం రూ. కోట్ల‌ను ఖ‌ర్చు పెట్టి వారికి అవ‌స‌ర‌మైన ప‌నిముట్లు, ప‌రిక‌రాలు, కార్లు కూడా అందించింది. కొన్నింటికి రుణాన్ని స‌మ‌కూర్చ‌గా.. మ‌రికొన్నింటిని నేరుగానే అందించింది.

ఇప్పుడు ఆ ప‌థ‌కాల‌నే ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఆద‌ర‌ణ‌-2 ప‌థ‌కాన్ని తిరిగి అమ‌లు చేయాల‌ని భావిస్తోంది. త్వ‌ర‌లోనే దీనిపై స‌మ‌గ్ర ప్రాజెక్టును రూపొందించి.. ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేయా ల‌ని నిర్ణ‌యించింది. త‌ద్వారా మెజారిటీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చడంతోపాటు.. గ‌తంలో అమ‌లు చేసిన ప‌థ‌కాన్ని కొన‌సాగించ‌డం ద్వారా ఓటు బ్యాంకును సైతం సుస్థిరం చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా దీనిని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

This post was last modified on March 24, 2025 11:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

42 minutes ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

2 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

5 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

5 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

6 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

6 hours ago