టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఒక్కసారి చెబితే నిజంగానే వంద సార్లు చెప్పినట్టే. అదేదో సినిమా డైలాగ్ లా స్ఫూరించినా…చంద్రబాబు మాట చెప్పారంటే అది జరిగి తీరుతుంది. ప్రభుత్వ పాలనలో కీలక భూమిక పోషిస్తున్న ఉద్యోగుల విషయంలో చంద్రబాబు మరింత శ్రద్ధగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా ఇట్టే స్పందిస్తున్న చంద్రబాబు.. గతంలో వారికి దక్కకుండాపోయిన సర్కారీ నిధులను కూడా విడుదల చేస్తున్నారు. ఉద్యోగులకు పలు పద్దుల్లో బకాయి పడ్డ నిధులను విడుదల చేసేశారు. ఆ నిధులు ఇఫ్పుడు ఉద్యోగుల ఖాతాల్లో పడుతున్నాయి. ఈ విషయాన్ని ఉద్యోగుల సంఘం ఏపీఎన్జీవో సోమవారం గర్వంగా తెలియజేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఉద్యోగులకు క్రమం తప్పకుండా చెల్లించాల్సిన సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ నిధులను విడుదలే చేయలేదు. ఫలితంగా ఈ పద్దుల్లో ఉద్యోగులకు ప్రభుత్వం భారీ ఎత్తున బకాయి పడింది. వైసీపీ అధికారం దిగిపోయే నాటికి ఈ బకాయిలు ఏకంగా రూ.7 వేల కోట్లను దాటిపోయాయి. ఉద్యోగులపై దాదాపుగా బెదిరింపులకు దిగుతూ పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇదేమిటని ప్రశ్నించే సాహసం ఎవరూ చేయలేకపోయారనే చెప్పాలి. అయితే ఉద్యోగుల మాటకు అత్యంత విలువ ఇచ్చే చంద్రబాబు సీఎం కాగానే… ఉద్యోగులంతా ఆయన వద్ద తమకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టారు.
ఉద్యోగుల కష్టాలను తెలుసుకున్న చంద్రబాబు చాలా వేగంగా స్పందించారు. సంక్రాంతి సందర్భంగా ఉద్యోగుల బకాయిల్లో రూ.1,033 కోట్లను చెల్లించి..ఉద్యోగుల కష్టాలను కొంతమేరకైనా తీర్చారు. అసలే నిధుల కొరతతో ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కరంగా ఉన్నప్పటికీ…వివిధ పద్దుల నుంచి సర్దుబాటు చేసి మరీ చంద్రబాబు వారి బకాయిలు విడుదల చేశారు. తాజాగా మిగిలిన బకాయిలను ఒకే దఫా విడుదల చేయాలని తీర్మానించారు. అందుకోసం ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసిన ఆయన మిగిలిపోయిన రూ.6,200 కోట్లను తక్షణమే ఉద్యోగులకు చెల్లించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో శుక్రవారమే ఆర్థిక శాఖ నిధులను విడుదల చేయగా…సోమవారం ఆ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో పడిపోయాయి.
This post was last modified on March 25, 2025 5:45 am
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…