తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండానే సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించిన ఏపీ… టీడీపీ నేతృత్వంలో అన్నీ సమకూరిపోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రానికి నూతన రాజధానిగా ఎంపిక అయిన అమరావతికి నిధులే కాదు… విద్యాలయాలు కూడా క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని ప్రసిద్ధ విద్యా సంస్థల్లో కొన్ని తమ క్యాంపస్ లను అమరావతిలో ఏర్పాటు చేశాయి. ఫలితంగా భవిష్యత్తులో అమరావతితో పాటుగా ఏపీ కూడా విద్యా కేంద్రంగా మారనుంది. ఈ విషయాన్ని ప్రసిద్ధ విద్యా సంస్థలూ గుర్తించినట్టున్నాయి. అందుకే ఆ సంస్థలూ ఏపీకి వచ్చేస్తున్నాయి. అందులో సోమవారం తొలి అడుగు పడింది. జార్జియన్ నేషనల్ వర్సిటీ ఏపీలో ఓ అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో జార్జియన్ నేషనల్ వర్సీటీ ప్రతినిధి బృందం..రాష్ట్ర విద్యా శాఖతో సోమవారం కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఏపీలోని ఉత్తరాంధ్రలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఓ అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. అందుకోసం ఆ వర్సిటీ ఏకంగా రూ.1,300 కోట్లను వెచ్చించనుంది. ఈ వర్సిటీ ద్వారా రాష్ట్రంలోని యువతకు 500 మేర ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. ఈ వర్సిటీ ద్వారా రాష్ట్ర విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలతో కూడిన విద్యాబోధన కూడా లభించనుంది. ఈ ఒప్పందంపై నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.
అమరావతిని నూతన రాజధానిగా తన గత పాలనలోనే చంద్రబాబు ప్రకటించారు. అదే సమయంలో ఉత్తరాంధ్రలోని సాగర నగరం విశాఖను రాష్ట్రానికి వాణిజ్య రాజధానిగా తీర్చిదిద్దేందుకు పకడ్బందీ చర్యలకూ శ్రీకారం చుట్టారు. విశాఖకు వెన్నుదన్నుగా నిలిచే దిశగా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టునూ అభివృద్ది చేస్తున్నారు. ఈ విషయాన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న నేపథ్యంలోనే జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ… ఉత్తరాంధ్రలో తన అంతర్జాతీయ స్థాయి విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసినట్లుగా సమాచారం. ఈ వర్సిటీ ప్రతిపాదనను స్వాగతించిన లోకేశ్… ఆ వర్సిటీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు.
This post was last modified on March 24, 2025 10:44 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…