Political News

ఏపీకి అంతర్జాతీయ వర్సిటీ వచ్చేసింది!

తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండానే సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించిన ఏపీ… టీడీపీ నేతృత్వంలో అన్నీ సమకూరిపోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రానికి నూతన రాజధానిగా ఎంపిక అయిన అమరావతికి నిధులే కాదు… విద్యాలయాలు కూడా క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని ప్రసిద్ధ విద్యా సంస్థల్లో కొన్ని తమ క్యాంపస్ లను అమరావతిలో ఏర్పాటు చేశాయి. ఫలితంగా భవిష్యత్తులో అమరావతితో పాటుగా ఏపీ కూడా విద్యా కేంద్రంగా మారనుంది. ఈ విషయాన్ని ప్రసిద్ధ విద్యా సంస్థలూ గుర్తించినట్టున్నాయి. అందుకే ఆ సంస్థలూ ఏపీకి వచ్చేస్తున్నాయి. అందులో సోమవారం తొలి అడుగు పడింది. జార్జియన్ నేషనల్ వర్సిటీ ఏపీలో ఓ అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో జార్జియన్ నేషనల్ వర్సీటీ ప్రతినిధి బృందం..రాష్ట్ర విద్యా శాఖతో సోమవారం కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఏపీలోని ఉత్తరాంధ్రలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఓ అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. అందుకోసం ఆ వర్సిటీ ఏకంగా రూ.1,300 కోట్లను వెచ్చించనుంది. ఈ వర్సిటీ ద్వారా రాష్ట్రంలోని యువతకు 500 మేర ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. ఈ వర్సిటీ ద్వారా రాష్ట్ర విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలతో కూడిన విద్యాబోధన కూడా లభించనుంది. ఈ ఒప్పందంపై నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.

అమరావతిని నూతన రాజధానిగా తన గత పాలనలోనే చంద్రబాబు ప్రకటించారు. అదే సమయంలో ఉత్తరాంధ్రలోని సాగర నగరం విశాఖను రాష్ట్రానికి వాణిజ్య రాజధానిగా తీర్చిదిద్దేందుకు పకడ్బందీ చర్యలకూ శ్రీకారం చుట్టారు. విశాఖకు వెన్నుదన్నుగా నిలిచే దిశగా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టునూ అభివృద్ది చేస్తున్నారు. ఈ విషయాన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న నేపథ్యంలోనే జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ… ఉత్తరాంధ్రలో తన అంతర్జాతీయ స్థాయి విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసినట్లుగా సమాచారం. ఈ వర్సిటీ ప్రతిపాదనను స్వాగతించిన లోకేశ్… ఆ వర్సిటీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు.

This post was last modified on March 24, 2025 10:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గ‌ద్ద‌ర్ అవార్డుల్లో గందరగోళం.. ఏం జరిగింది?

గ‌త ఏడాది ప్ర‌తిష్ఠాత్మ‌కంగా గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను మొద‌లుపెట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఒకేసారి చాలా ఏళ్ల‌కు క‌లిపి అవార్డులు ప్ర‌క‌టించిన సంగ‌తి…

17 minutes ago

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

3 hours ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

7 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

7 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

7 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

8 hours ago