తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం దేశ రాజధాని డిల్లీ చేరుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి బయలుదేరిన రేవంత్…ఇప్పటికే ఢిల్లీలో ఉన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కూడా తమ బృందంతో కలుపుకుని కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలతో భేటీ కానున్నారు. ఈ భేటీపై కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కేబినెట్ లో ఇంకో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారైనా ఈ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా? అన్న దిశగా ఆసక్తికర చర్చ నడుస్తోంది.
కేబినెట్ లో విద్య హోం శాఖ వంటి ఆరు మంత్రిత్వ శాఖలన్నీ సీఎం రేవంత్ వద్దే ఉన్నాయి. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఖాళీగానే ఉంది. అదే సమయంలో టీపీసీసీ కార్యవర్గం కూర్పుకూడా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. వాటితో పాటుగా అసెంబ్లీలో చీఫ్ విప్ పదవి కూడా ఖాళీగానే ఉంది. ఇక నామినేటెడ్ పోస్టుల సంగతి తెలిసిందే. అయితే ఈ దఫా అధిష్ఠానం నుంచే ఢిల్లీ రావాలంటూ రేవంత్ కు సమాచారం వచ్చిన నేపథ్యంలో…ఖాళీగా ఉన్న మంత్రి పదవులతో పాటుగా మిగిలిన దాదాపుగా అన్ని పదవుల భర్తీకి అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అధిష్ఠానంతో రేవంత్ బృందం చర్చల్లో భాగంగా తొలి విడతగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో రేవంత్ భేటీ కానున్నారు. ఈ భేటీలో తెలంగాణలో పోస్టుల భర్తీపై అధిష్ఠానం వైఖరేమిటన్నది రేవంత్ బృందానికి తెలియనున్నట్లుగా సమాచారం. అధిష్ఠానం ఆలోచన తెలిసిన తర్వాత ఎలా ముందుకు సాగాలన్న దానిపై రేవంత్ సమాచాలోచనలు చేయ నున్నట్లు సమాచారం. వాస్తవానికి అందుబాటులో ఉన్న పోస్టులు వేళ్లపై లెక్కపెట్టేంతగా ఉంటే… పదవులను ఆశిస్తున్న వారు మాత్రం వందలు, వేల సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికీ అసంతృప్తి లేకుండా ఉండేలా అడుగులు వేయాలన్న దిశగా అటు అధిష్టానం, ఇటు రేవంత్ వర్గం జాగ్రత్తగా చర్యలు చేపట్టనుంది. ఈ లెక్కన ప్రస్తుతానికి నాలుగు మంత్రి పదవులను మాత్రం భర్తీ చేసేందుకు అనుమతి లబించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 24, 2025 6:13 pm
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…