బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యవహారం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రభుత్వం కోల్పోయారు. అయినప్పటికీ.. ప్రజలు ఆయనకు గజ్వేల్ నియోజకవర్గంలో బ్రహ్మరథం పట్టారు. కానీ, 15 మాసాలుగా కేసీఆర్.. అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్, ఇంటికే పరిమితం అవుతున్నారు. ఒకే ఒక్కసారి గత ఏడాది జరిగిన బడ్జెట్ సమావేశాల రోజు సభకు వచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత.. ఆయన అసెంబ్లీ ముఖం కూడా చూడలేదు.
ఇటీవల ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కూడా కేసీఆర్ డుమ్మా కొడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు మూడు రోజుల కిందట సీఎం రేవంత్రెడ్డి కూడా.. సభలో కేసీఆర్కు ఇస్తున్న జీతం, భత్యాల వివరాలను ఉటంకించారు. పనిచేయకుండానే జీతం తీసుకుంటున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరేనని రేవంత్రెడ్డి దుయ్యబట్టారు. ఏకంగా ఆయన 57 లక్షల వరకు జీతం రూపంలో ఇచ్చామని.. ఇవికాకుండా.. భత్యాలు, సెక్యూరిటీ ఖర్చు అదనంగా ఉందన్నారు.
ఇదిలావుంటే.. తాజాగా కేసీఆర్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ.. కాంగ్రెస్ నాయకులు ఉద్యమించారు. సభకురాకుండా వేతనం తీసుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాదు.. ఎన్నోఆశలతో గజ్వేల్ ప్రజలు కేసీఆర్ను గెలిపించారని, కానీ, ఆయన వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని,.. సమస్యలు చెప్పుకోవాలన్నా అందుబాటులో లేరని.. ప్రజల సమస్యలపై సభలో ప్రశ్నించడం కూడా లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమారు 50 మందికి పైగా పాదయాత్రగా వచ్చారు. తొలుత సీఎం రేవంత్రెడ్డిని కలుసుకుని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం.. గవర్నర్ను కలుసుకుని.. కేసీఆర్ సభ్యత్వం రద్దు చేయాలన్న వినతి పత్రం ఇవ్వనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్సారెడ్డి ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. మరోవైపు బీజేపీ నాయకులు కూడా.. కేసీఆర్ వ్యవహారంపై కోర్టుకు వెళ్లనున్నట్టు తెలిసింది.
This post was last modified on March 24, 2025 2:57 pm
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…