నిన్నగాక మొన్న గ్రాడ్యుయేట్ సహా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తెలంగాణలో తాజాగా మరో ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ‘హైదరాబాద్ స్థానిక సంస్థల’ కోటాలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఈ నెల 28న పూర్తిస్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల ఘట్టం.. ఆ రోజు నుంచే ప్రారంభం కానుంది.
ఇక, ఎన్నికల పోలింగ్ మాత్రం ఏప్రిల్ 23వ తేదీన జరగనుంది. నామినేషన్ల దాఖలుకు.. ఏప్రిల్ 4వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణకు గడువును ఏప్రిల్ 9వ తేదీ గా నిర్ణయించారు. అదేనెల 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏప్రిల్ 25న జరుగుతుంది. అదే రోజు ఫలితం వెల్లడించనున్నారు.
ఎలా ఖాళీ అయింది?
ప్రస్తుతం ఎం.ఎస్. ప్రభాకర్ రావు హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే.. ప్రభాకర్రావు పదవీ కాలం మే 1తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ లో సభ్యులుగా ఉన్న కార్పొరేటర్లు, మేయర్ సహా.. స్టాండింగ్ కమిటీ సభ్యులు ఓటర్లుగా ఉంటారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు ఆధిక్యం ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అటు ప్రభుత్వ పక్షానికి, ఇటు బీజేపీ, బీఆర్ ఎస్, ఎంఐఎం వంటి విపక్షాలకు కూడా.. కీలకంగా మారింది.
This post was last modified on March 24, 2025 2:29 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…