నిన్నగాక మొన్న గ్రాడ్యుయేట్ సహా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తెలంగాణలో తాజాగా మరో ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ‘హైదరాబాద్ స్థానిక సంస్థల’ కోటాలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఈ నెల 28న పూర్తిస్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల ఘట్టం.. ఆ రోజు నుంచే ప్రారంభం కానుంది.
ఇక, ఎన్నికల పోలింగ్ మాత్రం ఏప్రిల్ 23వ తేదీన జరగనుంది. నామినేషన్ల దాఖలుకు.. ఏప్రిల్ 4వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణకు గడువును ఏప్రిల్ 9వ తేదీ గా నిర్ణయించారు. అదేనెల 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏప్రిల్ 25న జరుగుతుంది. అదే రోజు ఫలితం వెల్లడించనున్నారు.
ఎలా ఖాళీ అయింది?
ప్రస్తుతం ఎం.ఎస్. ప్రభాకర్ రావు హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే.. ప్రభాకర్రావు పదవీ కాలం మే 1తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ లో సభ్యులుగా ఉన్న కార్పొరేటర్లు, మేయర్ సహా.. స్టాండింగ్ కమిటీ సభ్యులు ఓటర్లుగా ఉంటారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు ఆధిక్యం ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అటు ప్రభుత్వ పక్షానికి, ఇటు బీజేపీ, బీఆర్ ఎస్, ఎంఐఎం వంటి విపక్షాలకు కూడా.. కీలకంగా మారింది.
This post was last modified on March 24, 2025 2:29 pm
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…