నిన్నగాక మొన్న గ్రాడ్యుయేట్ సహా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తెలంగాణలో తాజాగా మరో ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ‘హైదరాబాద్ స్థానిక సంస్థల’ కోటాలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఈ నెల 28న పూర్తిస్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల ఘట్టం.. ఆ రోజు నుంచే ప్రారంభం కానుంది.
ఇక, ఎన్నికల పోలింగ్ మాత్రం ఏప్రిల్ 23వ తేదీన జరగనుంది. నామినేషన్ల దాఖలుకు.. ఏప్రిల్ 4వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణకు గడువును ఏప్రిల్ 9వ తేదీ గా నిర్ణయించారు. అదేనెల 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏప్రిల్ 25న జరుగుతుంది. అదే రోజు ఫలితం వెల్లడించనున్నారు.
ఎలా ఖాళీ అయింది?
ప్రస్తుతం ఎం.ఎస్. ప్రభాకర్ రావు హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే.. ప్రభాకర్రావు పదవీ కాలం మే 1తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ లో సభ్యులుగా ఉన్న కార్పొరేటర్లు, మేయర్ సహా.. స్టాండింగ్ కమిటీ సభ్యులు ఓటర్లుగా ఉంటారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు ఆధిక్యం ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అటు ప్రభుత్వ పక్షానికి, ఇటు బీజేపీ, బీఆర్ ఎస్, ఎంఐఎం వంటి విపక్షాలకు కూడా.. కీలకంగా మారింది.
This post was last modified on March 24, 2025 2:29 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడపగా ముద్రపడ్డ కడపలో వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
వైసీపీ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వంతు వచ్చింది. ఆయన గతంలో ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన డిగ్రీ…
తమీమ్ ఇక్బాల్.. అంతర్జాతీయ క్రికెట్ ను ఫాలో అయ్యేవారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఈ సీనియర్ క్రికెటర్…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యవహారం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రభుత్వం కోల్పోయారు.…
సన్నిడియోల్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన జాట్ వచ్చే నెల ఏప్రిల్ 10…
వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం.. పులివెందులలో రైతులకు భారీ కష్టం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు…