నిన్నగాక మొన్న గ్రాడ్యుయేట్ సహా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తెలంగాణలో తాజాగా మరో ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ‘హైదరాబాద్ స్థానిక సంస్థల’ కోటాలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఈ నెల 28న పూర్తిస్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల ఘట్టం.. ఆ రోజు నుంచే ప్రారంభం కానుంది.
ఇక, ఎన్నికల పోలింగ్ మాత్రం ఏప్రిల్ 23వ తేదీన జరగనుంది. నామినేషన్ల దాఖలుకు.. ఏప్రిల్ 4వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణకు గడువును ఏప్రిల్ 9వ తేదీ గా నిర్ణయించారు. అదేనెల 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏప్రిల్ 25న జరుగుతుంది. అదే రోజు ఫలితం వెల్లడించనున్నారు.
ఎలా ఖాళీ అయింది?
ప్రస్తుతం ఎం.ఎస్. ప్రభాకర్ రావు హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే.. ప్రభాకర్రావు పదవీ కాలం మే 1తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ లో సభ్యులుగా ఉన్న కార్పొరేటర్లు, మేయర్ సహా.. స్టాండింగ్ కమిటీ సభ్యులు ఓటర్లుగా ఉంటారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు ఆధిక్యం ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అటు ప్రభుత్వ పక్షానికి, ఇటు బీజేపీ, బీఆర్ ఎస్, ఎంఐఎం వంటి విపక్షాలకు కూడా.. కీలకంగా మారింది.
This post was last modified on March 24, 2025 2:29 pm
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…